🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3417 వార్తలు

మైక్రో ఫైనాన్స్ కేసులో హేమకాంత్ అరెస్టు
పాత వార్త
తెలంగాణ

మైక్రో ఫైనాన్స్ కేసులో హేమకాంత్ అరెస్టు

ఇప్పటికే ముగిసిన నిందితుడు మధు పోలీస్ కస్టడీతదుపరి విచారణలో మంగ్లీ, సోదరుడు శివ పాత్రపై ఆరా తీయనున్న పోలీసులుమన తెలంగాణ/సిటీబ్యూరో: మైక్రో ఫైనాన్స్ కేసులో నిందితుడిగా ఉన్న హేమకాంత రెడ్డిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో ఇదివరకే రమావత్ మధును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీకి తీసుకొని పోలీసులు మూడు రోజులు విచారించారు, కస్టడీ ముగియడంతో శనివారం మధును జైలుకు పంపించారు. ఈ క్రమంలోనే హేమకాంతరెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి, కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిసింది. మధు, హేమకాంతరెడ్డి ఇద్దరిని విచారిస్తే మైక్రో ఫైనాన్స్ కేసులోని అసలు విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరికి మంగ్లీ, ఆమె సోదరుడు శివ స్నేహితుడు కావడంతో ఆ కోణంలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రమావత్ మధు శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించి పలువురి వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఐదు లక్షలు కడితే నెలకు రూ.25,000, 102 గజాల ప్లాట్ ఇస్త

Admin2 రోజుల క్రితం👁 1
భవంతిలో అగ్నికీలలు.. 9మంది మృతి
పాత
తెలంగాణ

భవంతిలో అగ్నికీలలు.. 9మంది మృతి

మరో ఇద్దరికి గాయాలు మృతుల్లో ఏడాదిన్నర చిన్నారిఎయిర్ కండీషనర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు, క్షణాల్లో వ్యాప్తిఢిల్లీలోని వివేక్ విహార్‌లో తెల్లవారుజామున ఘటనన్యూఢిల్లీ: ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకటిన్నరేళ్ల చిన్నారితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో భవనం రెండో అంతస్తులో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. వెంటనే 14 అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి మంటలు మూడో, నాలుగో అంతస్తులకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు. తూర్పు ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వివేక్ విహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవనం నుంచి పన్నెండు మందికి పైగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రికి తరలించి

30రోజుల్లోగా ముగిద్దాం
పాత
తెలంగాణ

30రోజుల్లోగా ముగిద్దాం

అమెరికా 9 పాయింట్లకు స్పందనగా 14 పాయింట్లతో ఇరాన్ ప్రతిపాదనలుతాత్కాలిక సంధికి నిరాకరణ హర్మూజ్ దిగ్బంధనం ఎత్తివేత, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఆస్తుల విడుదలలెబనాన్‌పైనా యుద్ధం నిలిపివేత సహా పలు షరతులు విధింపు బంతి అమెరికా కోర్టులో ఉందని ప్రకటన ఇరాన్ ప్రతిపాదనలపై అధ్యక్షుడు ట్రంప్ పెదవి విరుపు అణ్వాయుధాలపై స్పష్టమైన హామీ లేదని అసంతృప్తి లాహోర్: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ముందుకు తీసుకెళ్లేందుకు ఇరాన్ అమెరికాకు 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఘర్షణను ముగించేందుకు అమెరికా నుంచి వచ్చిన 9 పాయింట్లకు స్పందనగా ఇరాన్ ఈ 14 పాయింట్లతో తాజా ప్రతిపాదనలు చేసింది. ఇందులో లెబనాన్‌తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని టెహ్రాన్ పిలుపునిచ్చింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపునను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా.. 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీనితో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమ

14 లక్షల విద్యార్థులకు సిఎం వెన్నుపోటు
పాత
తెలంగాణ

14 లక్షల విద్యార్థులకు సిఎం వెన్నుపోటు

ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు ముఖ్యమంత్రి కుట్రజీఓ నెంబర్ 7 పేరిట చీకటి ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకునివిద్యార్థులకు క్షమాపణ చెప్పాలి లేకపోతే మీరు, మంత్రులు రోడ్లపై తిరగలేరు సిఎం రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖమనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14 లక్షల మం ది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 ను తీసుకొచ్చారని మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వం సం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా అని నిలదీశారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరని హెచ్చరిస్తూ ఆదివారం సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశా రు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బిసి, ఎస్‌సి,ఎస్‌టి, మై నారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దుచేసేలా చేస్తున్న కుట్ర భ యంకరమైనదని పేర్కొన్నారు. ఈ జిఒ వచ్

ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకముంది
పాత
తెలంగాణ

ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకముంది

సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు5న రాష్ట్రవ్యాప్త నిరసనలు వాయిదా : ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ శ్రీనివాసరావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం, విశ్వాసముందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం […] The post ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకముంది appeared first on Navatelangana.

గాలిదుమారం.. ఈదురుగాలులు
పాత
తెలంగాణ

గాలిదుమారం.. ఈదురుగాలులు

ఉరుములు, పిడుగులతో వర్షాలు.. పంటలకు తీవ్రనష్టంకొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటలునేలకొరిగిన చెట్లు, వంగిన విద్యుత్‌ స్తంభాలుచీకట్లు కమ్ముకున్న పలు గ్రామాలునవతెలంగాణ- విలేకరుల బృందంరాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించినా కొనుగోలు కేంద్రాల్లో పంటలు తడిసిపోయాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలో భారీ ఈదురుగాలుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. […] The post గాలిదుమారం.. ఈదురుగాలులు appeared first on Navatelangana.

పెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి..
పాత
తెలంగాణ

పెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి..

మనస్తాపంతో యువతి ఆత్మహత్యజగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో ఘటననవతెలంగాణ – మల్లాపూర్‌పెండ్లి నిశ్చయమైన వ్యక్తి గల్ఫ్‌ దేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో మనస్తాపం చెందిన యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారకర ఘటన ఇది.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని సిరిపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిపూర్‌ గ్రామానికి చెందిన ఒల్లెపు రంగయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఒల్లెపు […] The post పెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి.. appeared first on Navatelangana.

అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు
పాత
తెలంగాణ

అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు

త్వరలోనే రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇండ్ల మంజూరు :ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి భరోసానవతెలంగాణ-కూసుమంచిప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్‌’లో ఆయన పాల్గొన్నారు. జిల్లా […] The post అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు appeared first on Navatelangana.

ఎస్పీడీసీఎల్‌ కస్టమర్లు 1.17 కోట్లు
పాత
తెలంగాణ

ఎస్పీడీసీఎల్‌ కస్టమర్లు 1.17 కోట్లు

అత్యధికంగా డొమెస్టిక్‌ వినియోగదారులే..గ్రేటర్‌లోనే విద్యుత్‌ వినియోగం అధికంవిస్తృతంగా పెరిగిన డిస్కం నెట్‌వర్క్‌తప్పని అప్రకటిత విద్యుత్‌ కోతలుమౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటునవతెలంగాణ-సిటీబ్యూరోగల్లీ నుంచి పారిశ్రామిక వాడల వరకు, పల్లె ముంగిట నుంచి ఐటీ కారిడార్ల వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) వెలుగులు విరజిమ్ముతోంది. రాష్ట్ర పురోగతిలో కీలకంగా మారిన ఈ సంస్థ ప్రస్తుతం 1.17 కోట్ల వినియోగదారులతో అత్యుత్తమ నెట్‌వర్క్‌ను కలిగిన డిస్కంలలో ఒకటిగా నిలిచింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తూ […] The post ఎస్పీడీసీఎల్‌ కస్టమర్లు 1.17 కోట్లు appeared first on Navatelangana.

కొనుగోలు కేంద్రంలోనే
పాత
తెలంగాణ

కొనుగోలు కేంద్రంలోనే

రైతు కన్నుమూతవడడెబ్బతో రైతు మృతిఇబ్రహీంపట్నంలో ఘటననవతెలంగాణ-ఇబ్రహీంపట్నంవరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడడెబ్బతో రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్‌ గ్రామంలో రాపోలు మంగలి గౌరయ్య (63) రాయపోల్‌ వరి కొనుగోలు కేంద్రం వద్ద నాలుగు రోజులుగా ఎర్రటి ఎండలో వడ్లు ఆరబోస్తూ అక్కడే ఉంటున్నారు. మాయిశ్చర్‌ పేరిట రైతులను కొనుగోలు కేంద్రాల ముందు ప్రభుత్వం […] The post కొనుగోలు కేంద్రంలోనే appeared first on Navatelangana.

ఢిల్లీలో ఘోరం
పాత
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు కుట్ర
పాత
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు కుట్ర

జీవో 7 అందుకోసమే..14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటువైఎస్‌ పథకాలకూ పాతరేస్తున్న సర్కారువిద్యార్థిలోకం గర్జిస్తే మంత్రులు రోడ్లపై తిరగరురూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రేండున్నరేండ్ల కాంగ్రెస్‌ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థను కుప్పకూలిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా?అని […] The post ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు కుట్ర appeared first on Navatelangana.

ప్రశాంతంగా నీట్‌
పాత
తెలంగాణ

ప్రశాంతంగా నీట్‌

జూన్‌ మొదటి వారంలో ఫలితాలు?దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది హాజరునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌తోపాటు ఇతర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ-2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జూన్‌ మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. దేశవ్యాప్తంగా 552 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వారిలో 13,32,928 మంది అమ్మాయిలు, […] The post ప్రశాంతంగా నీట్‌ appeared first on Navatelangana.

పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
పాత
తెలంగాణ

పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ప్రయోజనం శూన్యంవ్యవసాయంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పోరాటంతోనే కొనుగోలు కేంద్రాల ప్రారంభం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ొ కొనుగోలు కేంద్రాల పరిశీలన నవతెలంగాణ – బోనకల్‌రైతులు పండించిన పంటను సమయా నికి కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు మండిపడ్డారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ప్రయోజనం […] The post పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం appeared first on Navatelangana.

నగల దుకాణంలో కాల్పులు
పాత
తెలంగాణ

నగల దుకాణంలో కాల్పులు

మన తెలంగాణ/ కరీంనగర్ క్రైం: ప్రశాంతంగా ఉండే కరీంనగర్ నగరం ఆదివారం ఉదయం తుపాకీ మోతలతో ఉలిక్కిపడింది. కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపును టార్గెట్ చేసిన ఐదుగురు దొంగల ముఠా తుపాకులతో దాడిచేసి బంగారు నగలను దోచుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కాల్పులు జరిపి సంచలనం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, అదికూడా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పిఎంజె జ్యువెలరీ షోరూమ్‌లో దుండగులు జరిపిన భారీ దోపిడీ స్థానికంగా కలకలం రేపుతోంది. దోపిడీ సమయంలో అడ్డుకోబోయిన కమల్, ముస్తాక్, రాజేష్, మధుకర్ అనే నలుగురు ఉద్యోగులపై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకీ గాయాలకు గురైన బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు, బుల్లెట్లు, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫు టేజీ ఆధారంగా నిందితుల ఫొటోలను విడుదల చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు తెలుగు, హిందీ

ఒప్పందం చేసుకోండి..లేకుంటే విపత్తే
పాత
తెలంగాణ

ఒప్పందం చేసుకోండి..లేకుంటే విపత్తే

ట్రంప్ బెదిరింపులుదౌత్యమా..యుద్ధమా.. నిర్ణయించుకోవాల్సింది అమెరికానే : ఇరాన్కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదంనవ తెలంగాణ – జనరల్ డెస్క్అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌పై మళ్లీ దాడి చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటు మూడు కీలక అంశాలైన అణు కార్యక్రమం, హార్ముజ్ దిగ్బంధనం, భద్రతా హామీలు వంటి అంశాలపై ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ట్రంప్ […] The post ఒప్పందం చేసుకోండి..లేకుంటే విపత్తే appeared first on Navatelangana.

నేడు ఎన్నికల ఫలితాలు
పాత
తెలంగాణ

నేడు ఎన్నికల ఫలితాలు

తేలనున్న కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ భవితవ్యం ఎగ్జిట్‌ పోల్స్‌లో నిఖార్సెంత..? చెన్నై : ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌లో నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్‌, బీజేపీలకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. పటిష్ట భద్రతపై రాష్ట్రాల్లో ఓట్ల […] The post నేడు ఎన్నికల ఫలితాలు appeared first on Navatelangana.

బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు
పాత
తెలంగాణ

బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు

భానుడి భగభగతో అల్లాడుతున్న ప్రయాణీకులుఅయిదుగురు కూర్చుంటే .. మిగతావారు ఎండలోనే నిరీక్షణవసతుల కల్పన, చలివేంద్రాల ఏర్పాటుపై పట్టించుకోని వైనంఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయలోపం.. జనం ఆందోళన నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూసే ప్రయాణికులకు తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కరువయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించాల్సిన ఆ సంస్థ, ఇతర ప్రభుత్వ […] The post బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు appeared first on Navatelangana.

మంటలో పంటలు
పాత
తెలంగాణ

మంటలో పంటలు

షార్ట్‌ సర్క్యూటే కారణంపలుచోట్ల ఇదే తరహా ప్రమాదాలులబోదిబోమంటున్న రైతులునవతెలంగాణ – చొప్పదండి/బిజినేపల్లి/రాయపోల్‌/మద్దూరు/కామారెడ్డి/ బాన్సువాడరాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా పంటలకు నిప్పు అంటుకుని కాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు లేచి రెండెకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. చొప్పదండి పట్టణానికి చెందిన గోస్కుల శంకర్‌కు చెందిన రెండెకరాల మొక్కజొన్న పంటచేను పైనుంచి వెళ్తున్న 11కేవీ వైర్లు గాలికి ఒకదానికొకటి తాకి షార్ట్‌ […] The post మంటలో పంటలు appeared first on Navatelangana.

రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగల్‌
పాత
తెలంగాణ

రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగల్‌

కేంద్ర పర్యావరణశాఖ అనుమతిఓపెన్‌ కాస్ట్‌ 2, భూగర్భగనులు 3 మొత్తం బొగ్గు నిల్వలు 314.98 మిలియన్‌ టన్నులుఏడాదికి 210 లక్షల టన్నుల ఉత్పత్తి 25 ఏండ్లు కొనసాగనున్న తవ్వకాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామగుండం కోల్‌ మైన్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి శుక్రవారం లేఖ రాసింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. […] The post రామగుండం కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగల్‌ appeared first on Navatelangana.

సోమవారం రాశి ఫలాలు (04-05-2026)
పాత
తెలంగాణ

సోమవారం రాశి ఫలాలు (04-05-2026)

మేషం ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయమై కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభం దీర్ఘకాలిక ఋణాల నుండి బయటపడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి. మిధునం నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయమై సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సింహం

భారత ఉన్నత విద్యలో అసమానతలు
పాత
తెలంగాణ

భారత ఉన్నత విద్యలో అసమానతలు

ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలకు సింహభాగంమిగిలిన 97 శాతం మంది పరిస్థితి ఏంటి?తప్పుబడుతున్న మేధావులు, విద్యావేత్తలు న్యూఢిల్లీ : భారత్‌లో ఉన్నత విద్యా వ్యవస్థలో గాఢమైన అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో కేవలం 2.6 శాతం మందికి సేవలందిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు.. ఉన్నత విద్యకు కేటాయించిన ప్రభుత్వ నిధుల్లో 50 శాతానికి పైగా పొందుతున్నాయి. మిగిలిన 97 శాతం మంది విద్యార్థులు తక్కువ నిధులతో నడిచే వందలాది విద్యా సంస్థలపై ఆధారపడాల్సి […] The post భారత ఉన్నత విద్యలో అసమానతలు appeared first on Navatelangana.

సన్‌రైజర్స్‌కు బ్రేక్‌
పాత
తెలంగాణ

సన్‌రైజర్స్‌కు బ్రేక్‌

9 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపుఛేదనలో మెరిసిన రఘువంశీ, రహానెనిరాశపరిచిన సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌హైదరాబాద్‌ 165/10 కోల్‌కతా 169/3 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి ‘సిక్సర్‌’పై కన్నేసిన సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై ఓటమి చవిచూసింది. ట్రావిశ్‌ హెడ్‌ (61), ఇషాన్‌ కిషన్‌ (42) రాణించినా.. మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత 165 పరుగులకే ఆలౌటైంది. ఊరించే లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. రఘువంశీ (59), రహానె […] The post సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ appeared first on Navatelangana.

పంజాబ్ పై గుజరాత్ ఉత్కంఠ విజయం..
పాత
తెలంగాణ

పంజాబ్ పై గుజరాత్ ఉత్కంఠ విజయం..

అహ్మదాబాద్: ఐపిఎల్ చరిత్రలోనే భారీ లక్షాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిర గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. 164 పరుగుల లక్ష ఛేదనకు దిగిన గుజరాత్ సాయి సుదర్శన్(57), వాషిగ్టన్ సుందర్(40), జోస్ బట్లర్(26) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ గుజరాత్ బౌలర్ల ధాటికి ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి భారీ షాకివ్వగా.. జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ నడ్డీ విరిచాడు. ఇక, 47 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కురుకుపోయిన పంజాబ్‌ను సూర్యాన్ష్ షెడ్‌గే(57), మార్కస్ స్టోయినిస్(40)లు ఆదుకున్నారు. వీరిరువురూ గుజరాత్ బౌలింగ్‌ను ఎదుర్కొని స్కోర్ 120 దాటించారు. ఆచితూచి ఆడుతున్న ఈ జోడీని హోల్డర్ విడదీయడంతో 163 పరుగులకే పరిమితమైంది పంజాబ్.

Advertisement