9733 వార్తలు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. జూన్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి. ఏపీలో 2026-27 విద్యాసంవత్సరానికి 232 పని దినాలు, తెలంగాణలో 224 పని దినాలు ఉండనున్నాయి. మరోవైపు స్కూల్ విద్యార్థులకు మాత్రం జూన్ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. జూన్ 12 […] The post విద్యార్ధులకు అలర్ట్.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనకు సంబంధించి నిందితుల ఫోటోలను విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్కార్పియో కారులో నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా రెక్కీ నిర్వహించిన తర్వాతే దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. వక్ఫ్ బోర్డు భూముల వివాదమే […] The post న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసు.. నిందితుల ఫోటోలు విడుదల appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : నటి ట్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించగా, సోమవారం విచారణ జరగనుంది. గత ఏడాది డిసెంబర్లో న్యాయవాది సమర్థ్ సింగ్ను వివాహం చేసుకున్న ట్విషా, మే 12న భోపాల్లో అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వరకట్న వేధింపులు, మానసిక హింస కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసి […] The post నటి ట్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, బ్రెజ్జా కారు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి చేవెళ్లకు వెళ్తున్న మెహదీపట్నం డిపో బస్సు యూటర్న్ వద్ద కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్బ్యాగ్లు వెంటనే ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరోవైపు బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఈ […] The post ఆర్టీసీ బస్సు, బ్రెజ్జా కారు ఢీ.. 25 మంది ప్రయాణికులు సేఫ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున అర్జున్ నిన్న తన తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో ఓడిపోయినప్పటికీ, అర్జున్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ తన కుమారుడిని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ […] The post వెల్డన్ అర్జున్..కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే విదేశాలకు ప్రయాణించవద్దని తెలిపింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ దేశాలకు వెళ్లాలనుకునేవారు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. The post ఎబోలా కలవరం.. భారత్ కీలక అడ్వైజరీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన ఏటుకూరి ప్రసాద్(90) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో వయో సంబంధిత సమస్యలతో ఆయన మరణించారు. 1970 నుంచి అభ్యుదయ రచయితల సంఘం(అరసం) పునర్నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. చివరి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సభ్యుడిగా కొనసాగారు. కొంతకాలం అరసం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఎర్రజెండా, ఎర్రబాట, శివాలయ్య లాంటి పేరొందిన రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. తాపీ […] The post ఏటుకూరి ప్రసాద్ కన్నుమూత appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నారాయణగిరిపల్లె గ్రామం వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నలేంద్ర లక్ష్మి(40), కుమార్తె దీపిక(19), కుమారుడు సాయికిరణ్తో కలిసి బైక్పై గణపురం వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ, దీపిక మృతి చెందారు. సాయికిరణ్ తీవ్రంగా […] The post బైక్ను ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు ఓ ఆగంతుకుడు మెయిల్ చేసి బెదిరించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చని హెచ్చరించాడు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై విమానంలోని ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధరించారు. The post శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్లో భాగంగా భోపాల్లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్లో భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఫుట్బాల్ ఆటగాడిగా పేర్కొని నెటిజన్ల ట్రోలింగ్కు గురయ్యారు. ఈ పొరపాటుపై తీవ్ర విమర్శలు రావడంతో, రామ్ చరణ్ వెంటనే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు. తనకి బుమ్రా ఆట అంటే ఎంతో అభిమానమని, ఆయన సాధించిన విజయాలు గర్వకారణమని పేర్కొన్నారు. The post బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్ appeared first on Navatelangana.

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పు ణ్యక్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యా ల నడుమ నిర్వహించిన వేద పాఠశాల భూమి పూజ కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలిసి యాదగిరిగుట్టలోని పెద్దగుట్టపైకి చేరుకొని సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వేద పాఠశాలకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితు ల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యే క పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక హోమం నిర్వహించగా, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సిఎం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన రూ. 99.55 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కొండా సురే ఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖాయం అవుతుందన్న ఆశలు కలుగుతున్న తరుణంలో మళ్లీ ఇరాన్పై దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధం కావడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇరాన్ సీనియర్ నేతలతో కీలకాంశాలపై చర్చకు శుక్రవారం రాత్రి టెహ్రాన్ చేరుకోగా, అమెరికాతో సమన్వయంతో పనిచేస్తున్న ఖతార్ దౌత్యబృందం కూడా టెహ్రాన్కు విచ్చేసింది. ట్రంప్ను ఒప్పించి యుద్ధం ఆపడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రంగం లోకి దిగింది. సౌదీ అరేబియా, ఖతార్ ప్రతినిధులతో కలిసి దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ నుంచి మళ్లీ ప్రతిఘటన ప్రారంభమైతే, శత్రుత్వాలు ముదిరితే గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభం లోకి కూరుకుపోతుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైనిక చర్య వల్ల అమెరికా తన లక్షాన్ని సాధించలేదని అమెరికా మిత్రదేశాలు ఈ మూడూ హెచ్చరిస్తున్నాయి. గతంలో ఇరాన్ దాడుల వల్ల తామెంత నష్టపోయామో తెలుసుకున్న యుఎఇ ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది. గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడులకు పాల్పడినప్పుడు ఇరాక్ లోని మిలిటెంట్లను ఇరాన

అది ప్రత్యేకతలేమీ లేని ఒక సాధారణ వీధి. హైదరాబాద్ వైఎంసిఎ నుంచి బర్కత్పురా సర్కిల్ వరకు కేవలం అరకిలోమీటరు మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని నెలల క్రితం ఆ వీధిలో కారులో ప్రయాణిస్తుండగా, నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు ఒక్కసారిగా కదిలాయి. క్యాన్సర్తో పోరాడుతున్న నా చిన్ననాటి స్నేహితుడిని కలవడానికివెళ్తున్నాను. ఎంతో మారిపోయిన మహానగరమైన హైదరాబాద్లో, ఆ వీధి మాత్రం పెద్దగా మారలేదనే భావన కలిగింది. ఎందుకంటే నేను వయసులో ఉన్నప్పుడు ఎన్నో సాయంత్రాలు అతనితో అక్కడే గడిచాయి. కవి వర్డ్స్వర్త్ మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పాలంటే.. ఆ సంధ్యవేళలను అనుభూతి చెందడం ఒక ఆనందమైతే, వయసులో ఉండటం నిజంగా స్వర్గానుభూతిలా అనిపించేది. ఆ వీధిలో ప్రతి సాయంత్రం వాకింగ్ ఎన్నో సంభాషణలకు వేదికగా ఉండేది. పక్కింటి అమ్మాయిల నుంచి వియత్నాం యుద్ధం వరకు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల నుంచి మహమ్మద్ రఫీ పాటల వరకు మా చర్చలకు హద్దులు ఉండేవి కాదు. యే దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై వంటి పాటలు మా యవ్వనపు భావోద్వేగాలకు ప్రతిధ్వనిలా అనిపించేవి. ఆ రోజులలో ఉమాకాంత్, ప్రదీప్, అప్పుడప్పుడు సీతారాం కూడా మా వెంట ఉండేవారు. ఆ సీతారామే తరువాత కాలంల

దేశవ్యాప్తంగా పలు వివాదాలతో సంచలనం రేపుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సెగ ఇక తెలుగు రాష్ట్రాలకు తాకనుంది. వేసవి కాలం ముగిసి తొలకరి రుతుపవనాలు ప్రవేశించే జూన్ నెలలో తెలంగాణలో ‘సర్’ వేడి మొదలుకానుంది. ఇప్పటికే దేశంలో రెండు దశల్లో ముగిసిన ఓటర్ల జాబితా ప్రక్షాళన తుది మూడో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా మొత్తం 16 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మొదటి రెండు దశల్లో పశ్చిమబెంగాల్, అసోం, బీహార్, తమిళనాడు, కేరళ, రాష్ట్రాల్లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ‘సర్’ ప్రక్రియ నిర్వహించడంతో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ఉన్నా రాష్ర్టంలో ‘సర్’ రాజకీయ వేడి పుట్టించింది. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎలాంటి విమర్శలు ఎదుర్కోకుండా నిష్పక్షపాతంగా తెలంగాణలో ‘సర్’ను విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ర్ట ఓటర్లు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా దేశంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. దేశంలో ఇంతకుముందు 195152, 1960, 1980, 1993, 1995, 2002 2004 సంవత్సరాల్లో దేశంలో ‘సర్’ ప్రక్రియ న

సామాజిక చింతనాపరుడు, పర్యావరణవేత్త, తెలంగాణ రైతులతో క్షేత్రస్థాయిలో తన విజ్ఞానాన్ని అందించి, వారి వ్యవసాయ పద్ధతులు, సులభతరం చేయడానికి విశేషంగా కృషి చేసిన కె.ఎస్. గోపాల్, క్యాన్సర్ వ్యాధితో ఈ నెల 15వ తేదీన మరణించాడు. ఉన్నత చదువులు చదివిన ఆయనకు, ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నా ఆయన, తన విజ్ఞానాన్ని, ఆలోచనలను క్షేత్ర స్థాయిలో ప్రయోగానికి పెట్టాడు. కె.ఎస్. గోపాల్ కమం (కొమండూర్ సంతాన గోపాల్) 1962లో కె.జి. దేసికన్, శంకుతలకు హైదరాబాద్లో జన్మించారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో, సెక్రటేరియట్లో ఒక శాఖకు కార్యదర్శి హోదాలో పని చేసాడు. అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తి చేసిన తర్వాత, కాచిగూడ లోని భద్రు క కాలేజీనుండి బి.కామ్ పూర్తి చేసి చేసి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ, అంతర్జాతీయ వాణిజ్య విధానంలో డిప్లొమా కోర్సు చదివాడు. స్కూల్లో, కాలేజీలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీల్లో బహుమతులన్నీ గోపాల్ కే దక్కేవట. వై.ఎం.సి.ఎ విద్యార్థుల ఫోరంలో కూడా ఆయనే ముందుండేవాడట బాల్యం నుండే కొత్త కోణంలో ఆలో చించడం, విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి శోధించడం ఆయన గుణం. అందువల్లనే గోప

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ సుమారు మూ డుగంటల పాటు జరిగింది. పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీకి సంబంధించి రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాల ని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం ప్రారంభించి గోడలు, శ్లాబ్ దశల్లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మం త్రివర్గం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపా రు. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబ్ పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబ్ ని లిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఇం డస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పి) విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చే సింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం హిల్ట్ పి విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణి జ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిల్ట్ పి పాలసీ కింద అర్హత గల పరిశ్రమల యూనిట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. 2025 నవంబర్ 22 తేదీన జారీ చేసిన జిఒ 27 ద్వారా హిల్ట్ పి ప్రకటించారు. ఈ పాలజీ కోర్ అర్బన్ రీజియర్(క్యూర్) పరిధిలోని 21 ఇండస్ట్రియల్ పార్కులు, స్వతంత్ర పరిశ్రమలలో ఉన్న కా లుష్యకారక పరిశ్రమలను పునరావాసం చేయడానికి రూపొందించారు. అమలు విధానంలో భాగ ంగా కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 10 శాతం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ (డిఐఎఫ్)ను ముందస్తుగా చెల్లించే విధానం, 2026 జూన్ 30 లోపు దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు ప్రస్తు త ఎస్ఆర్ఒ మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకోవడం ఆమోదించారు. కొత్తగా ప్రారంభించిన డిజిటల్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన పరిశ్రమల యూనిట్ హోల్డర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఫ్యూచ ర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మండిపడ్డా రు. అమెరికా వెళ్ళిన హరీశ్రావు అక్కడ పగటి కలలు కం టున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ధ్వ జమెత్తారు. హరీశ్రావు ప్రకటన తెలంగాణ ప్రాంతానికి అ న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఇలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావ ని, పక్క రాష్ట్రాలకు వెళతాయని అన్నారు. పెట్టుబడులు అ డ్డుకోవడంతో రాష్ట్రంలోని యువతకు అన్యాయం చేసి ఉ ద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా? అని ఆయ న హరీశ్రావును ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవని, వాటిని రద్దు చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి బిఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్రాభివృద్ధి జరగాలని మీకు ఉందా? మీ పార్టీ కి ఉందా?, అసలు రాష్ట్ర అభివృద్ధిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నేతలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆ

మన తెలంగాణ/హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండ ల్లో రైతుల గుండెలు ఆగిపోతు న్నా.. ఈ కర్కశ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదా..? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.పంటలు కొనకుండా ఇంకెంత కాలం యాతన పెడతారు.. ఇంకెన్ని చావులు కావాలి.. ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యం కు ప్పల మీదే కుప్ప కూలుతున్న రైతన్నలు...రాష్ట్రంలో కుప్ప కూలిన ప్రభు త్వ వ్యవస్థలు..రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల చావులను చూసి ముఖ్యమంత్రి ఆనందిస్తున్నరా..? అని ప్రశ్నించారు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి..పంట కొనుగోళ్లను పూర్తి చేయండి..రైతన్నల తిప్పలు తప్పించండి అంటూ సిఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

మన తెలంగాణ/ నాంపల్లి: పకడ్బం దీ వ్యూహం, పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులు చేసిన ఓ న్యాయవాది హత్య రా ష్ట్రంలో కలకలం రేకెత్తించింది. వక్ఫ్బోర్డు ఆస్తుల వివాదాలు, వాటి పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తు న్న న్యాయవాదిని ఎలాగైనా కడతేర్చాలని పథకం పన్నిన ప్రత్యర్థులు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించా రు. ఉదయం నుంచి రాత్రి వరకు న్యాయవాది కదలికలను కొన్ని రోజులుగా క్షుణ్ణంగా పసిగట్టారు. ఈ మేర కు టార్గెట్ విధించుకొని శనివారం తెల్లవారుజామున 5.45 గంటలకు స్విమ్మింగ్కు వెళ్లేందుకు కారెక్కుతుండగా ఖాజా మొయిజుద్దీన్ (63) వెను క నుంచి కారుతో బలంగా ఢీకొట్టా రు. నాంపల్లి పోలీసులు, స్థానికుల క థనం వివరాలు ఇలా ఉన్నాయి. ఖా జా మొహిజుద్దీన్ ఫిట్నెస్ కోసం ప్రతిరోజు ఈత కొట్టడానికి వెళ్తాడు. ఆయన కదలికలను ముందుగానే గమనించిన దుండుగులు ఈ సమయం కోసం నిరీక్షించారు. అక్కడే మాటువేసిన కారు డ్రైవర్ ఆయన తన ఇంట్లో నుంచి బయటికొచ్చి కారు ఎక్కుతుండగా వెనుకనుంచి కారును వేగంగా నడిపి న్యాయవాదిని బలంగా ఢీకొన్నాడు. న్యాయవాది ఎగిరి పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలై తీవ్ర రక్త స్రావంతో విలవిలలాడాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం

వరంగల్లోని మూడు ఏటీసీల్లో వెళ్లిపోయిన 149 మంది విద్యార్థులు సరైన అవగాహన కల్పించకపోవడమే కారణంనవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా ప్రభుత్వం ఆధునీకరిస్తున్నా.. డ్రాపౌట్స్ ఉండటం గమనార్హం. అడ్మిషన్లు పెరుగుతున్నా.. మధ్యలోనే ఎందుకు చదువు ఆపేస్తున్నారో అంతు చిక్కడం లేదని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లలో తొలి విద్యాసంవత్సరంలోనే డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టాటా […] The post ఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు appeared first on Navatelangana.

సిబ్బంది కదలికలపై నిఘాఆఫీస్ టైమింగ్స్, లంచ్బ్రేక్లు, క్యాంపస్ బటయకు వెళ్లడంపై ఆంక్షలుతాజా సర్క్యులర్పై అధ్యాపకులు, ఉద్యోగుల్లో అసంతృప్తిఅకాడమిక్ స్వేచ్ఛ తగ్గిపోతోందని ఆందోళనన్యూఢిల్లీ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ప్రధాన కార్యాలయం జారీ చేసిన తాజా సర్క్యులర్ సంస్థలో పెరుగుతున్న పరిపాలనా నియంత్రణ, నిఘాపై ఆందోళనలు రేకెత్తించింది. ఉద్యోగులు కార్యాలయ సమయాల్లో అనుమతి లేకుండా క్యాంపస్ బయటకు వెళ్లకూడదనీ, ఆలస్యంగా వస్తే సెలవులు లేదా జీతం కోత విధిస్తామని పేర్కొంది. […] The post ఎన్సీఈఆర్టీలో కఠిన నియంత్రణలు! appeared first on Navatelangana.

ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులను కలిసి పూర్తి చేద్దాంఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాంకొత్త ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు పెద్దపీటపర్యాటక సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్గా మారుస్తూనే తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) ప్రాంగణంలో శనివారం “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ […] The post ప్రయివేటు భాగస్వామ్యంతోపర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.