
3732 వార్తలు
ట్రంప్ను తప్పుదోవ పట్టిస్తోందా..?యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఆందోళనవాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం మొదలైన రోజే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైన విషయం విదితమే. దాంతో అక్కడ పాలనా వ్యవస్థ కూలిపోయి, తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా భావించింది. కానీ అలా జరగగా పోగా సీన్ రివర్స్ అయ్యింది. తమ మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలబడలేదన్న అంచనాలు తప్పాయి. దాంతో యుద్ధం ముగింపు కోసం అమెరికా మల్లగుల్లాలు పడు […] The post పెంటగాన్లో ముసలం appeared first on Navatelangana.
మోడీ పాలనలో క్షీణిస్తున్న విద్యా స్వేచ్ఛరాజీనామాలు, సస్పెన్షన్లు, అరెస్టులుభారత్లో అధ్యాపకులపై పెరుగుతున్న ఒత్తిళ్లుఅధికార బీజేపీ రాజకీయ జోక్యం, నియంత్రణదెబ్బతింటున్న విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తివిద్యావేత్తలు, మేధావుల ఆందోళనన్యూఢిల్లీ : మోడీ పాలనలో విద్యా రంగం అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విద్యా స్వేచ్ఛ ఆందోళనకరంగా మారింది. గత పదేండ్లలో అధ్యాపకులకు బోధనా స్వేచ్ఛ, పరిశోధనా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండటం లేదు. యూని వర్సిటీల స్వయం ప్రతిపత్తి నీటి మీద రాతలా మారి పోయింది. భారత్లో […] The post భయంతో మూగబోతున్న విద్యా ప్రాంగణాలు appeared first on Navatelangana.

మేషంచేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. మిధునం ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలిగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. కర్కాటకం ఒక వ్యవహారంలో ఇంటాబయట సమస్యలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది క
ఎస్ఎల్సీ అధ్యక్షుడు షమ్మి సిల్వ రాజీనామాకొలంబో (శ్రీలంక) : శ్రీలంక క్రికెట్ నాయకత్వ మార్పునకు సిద్ధమైంది. ఏడేండ్లుగా శ్రీలంక క్రికెట్ను నడిపిస్తున్న షమ్మి సిల్వపై క్రికెటర్లు, క్లబ్లు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక ప్రదర్శన సైతం పేలవం. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చింది. దేశాధ్యక్షుడు అనుర కుమార జోక్యంతో క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ షమ్మి సిల్వ సహా ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా చేసింది. […] The post ప్రభుత్వం చేతుల్లోకి శ్రీలంక క్రికెట్! appeared first on Navatelangana.
హేలీ బాప్టిస్ట్ చేతిలో ఓటమిమాడ్రిడ్ ఓపెన్ 2026మాడ్రిడ్ (స్పెయిన్) : మహిళల సింగిల్స్ వరల్డ్ నం.1, వరుసగా 15 మ్యాచ్ల జైత్రయాత్ర జోరుమీదున్న అరినా సబలెంక (బెలారస్)కు చుక్కెదురు. అమెరికా అమ్మాయి హేలీ బాప్టిస్ట్ మూడు సెట్ల సమరంలో టాప్ సీడ్కు షాక ఇచ్చింది. 2-6, 6-2, 7-6(8-6)తో సబలెంకపై బాప్టిస్ట్ గెలుపొందింది. హేలీ బాప్టిస్ట్ 12 ఏస్లు, 10 డబుల్ ఫాల్ట్స్తో మెరువగా.. సబలెంక ఐదు ఏస్లతో సరిపెట్టింది. తొలి సెట్ను అలవోకగా నెగ్గిన సబలెంక.. […] The post సబలెంకకు షాక్ appeared first on Navatelangana.

ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై నిర్దేశించిన 244 పరుగల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసి చేధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(45), ట్రావిస్ హెడ్(76)లు మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తర్వాత క్లాసెన్(65) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. చివర్లో సలీల్ అరోరా(30 నాటౌట్) భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో మరో 8 బంతులు ఉండగానే హైదరాబాద్ సూపర్ విక్టర్ సాధించింది.
వాంకోవర్ సమావేశానికి దూరంన్యూఢిల్లీ : 2026 ఫిఫా ప్రపంచకప్లో పోటీపడతామని ఇరాన్ ప్రకటించినా.. మంగళవారం వాంకోవర్ (కెనడా)లో జరిగిన ప్రపంచ ఫుట్బాల్ అధినేతల సమావేశానికి ఇరాన్ హాజరు కాలేదు. బుధవారం వాంకోవర్ వేదికగా ఆసియా ఫుట్బాల్ దేశాలతో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో భేటీ అయినా.. ఇరాన్ గైర్హాజరు అంశం చర్చకు రాలేదని సమాచారం. అమెరికా, మెక్సికో సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్-జిలో న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్తో పోటీపడనున్న ఇరాన్.. తమ […] The post ఇరాన్కు వీసా కష్టాలు appeared first on Navatelangana.
శుభాకాంక్షలు తెలిపిన ప్రాధానోపాధ్యాయుడు సిహెచ్.తిరుపతినవ తెలంగాణ-మల్హర్ రావు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎస్.ఎస్.సి ఫలితాల్లో పరీక్ష ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి విజయభేరీ మోగించారు.ఇందుకు పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు సిహెచ్.తిరుపతి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పాఠశాలలో మొత్తం 55 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా విడుదలైన ఫలితాల్లో 55 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు.ఉత్తమమైన ఫలితాలు రావడానికి కృషి […] The post తాడిచెర్ల హైస్కూల్ పధిలో వందశాతం ఉత్తీర్ణత.! appeared first on Navatelangana.

అబుదాబి: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైదొలగడం మధ్యప్రాచ్య ఇంధన రంగంలో కీలక మార్పులకు దారితీసింది. మే 1 నుంచి ఒపెక్ విధించిన ఉత్పత్తి పరిమితులు యూఏఈపై అమల్లో ఉండవు. దీంతో దేశం తన పూర్తి సామర్థ్యంతో ముడి చమురు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం పొందింది. ఈ పరిణామం భారత్కు మరింత చమురు సరఫరా జరిగే అవకాశాలను తెరిచింది. ప్రత్యేకంగా హబ్షాన్ఫుజైరా పైప్లైన్ ద్వారా హార్మూజ్ జలసంధిని పూర్తిగా దాటేసి చమురు రవాణా చేయడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో అంతరాయాల నేపథ్యంలో భారత్ ఇప్పటికే ఫుజైరా మార్గాన్ని వినియోగిస్తోంది. ఇప్పుడు ఒపెక్ కోటా పరిమితులు లేకపోవడంతో యూఏఈ రోజుకు అదనంగా దాదాపు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచగలదు. దీంతో భారత్కు మరింత, అలాగే తక్కువ ధరలో చమురు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, పెట్రోకెమికల్ అవసరాల కోసం భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం దేశ ఇంధన భద్రతకు ఊరటనివ్వనుంది. మంగళవారం అబుదాబి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటి

నగరంలో బుధవారం కురిసిన అకాల భారీ వర్షాలకు బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రి ప్రహారీ గోడ కూలి ముగ్గురు పిల్లలతోసహా 8మంది మృతి చెందారు. వర్షంతోపాటు బలమైన గాలులు వీచడంతో గోడపక్కన నిలుచున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది అక్కడే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులని పోలీసులు చెప్పారు. అత్యవసర సహాయ బృందాలు అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శిధిలాలను తొలగిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం ప్రకటించారు. డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

చిట్టగాంగ్: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. ఉదయం నుంచే వర్షం మొదలైంది. ఆట ప్రారంభం అయ్యే సమయానికి అది మరింత పుంజుకుంది. భారీ వర్షం వల్ల మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో కనీసం టాస్ కూడా పరిస్థితి లేకుండా పోయింది. పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ ప్రస్తుతం 10 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక చివరి టి20లో న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగుస్తోంది. శనివారం ఈ మ్యాచ్ ఢాకాలో జరుగనుంది. ఇంతకుముందు వన్డే సిరీస్ను కూడా బంగ్లాదేశ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓడిపోతారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి జోష్యం చెప్పారు. భవానీపూర్ నియోజకవర్గంలోని ఖిదిర్పూర్ ప్రాంతంలో ఉన్న రెండు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలింగ్ రోజున సాధారణంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చే మమతా బెనర్జీ ఈసారి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలను సందర్శించడంపై స్పందించిన సువేందు అధికారి, ఏది ఏమైనా సరే, ఆమె ఓడిపోతారు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటున్నారని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.ఇక పశ్చిమ బెంగాల్లో రెండో, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కోల్కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బ బర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఈ జిల్లాలు రాష్ట్ర రాజకీయ, ఎన్నికల పరంగా అత్యంత కీలక ప్రాంతాలుగా భావిస్తున్నారు. ప్రత్యేకించి దక్షిణ బెంగాల్లోని ఈ దశ ఎన్నికల ఫలితాలు అత్

అస్సాంలో మరోసారి భాజపానే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ కాషాయ పార్టీ అధికారంలో ఉంది. యాక్సిస్మై ఇండియా సర్వే ప్రకారం భాజపా కూటమి 88100, కాంగ్రెస్ కూటమి 2436 స్థానాలు గెలుస్తాయని అంచనా. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం భాజపా కూటమి 8595, కాంగ్రెస్ కూటమి 2532 స్థానాలు గెలుస్తాయని అంచనా. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం భాజపా కూటమి 6872, కాంగ్రెస్ కూటమి 2226 స్థానాలు గెలుస్తాయని అంచనా. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం భాజపా కూటమి 8898, కాంగ్రెస్ కూటమి 2232 స్థానాలు గెలుస్తాయని అంచనా. పీమార్క్ సర్వే ప్రకారం భాజపా కూటమి 8294, కాంగ్రెస్ కూటమి 3040 స్థానాలు గెలుస్తాయని అంచనా. ఓట్వైబ్ సర్వే ప్రకారం భాజపా కూటమి 90100, కాంగ్రెస్ కూటమి 2333 స్థానాలు గెలుస్తాయని అంచనా.
బహుభాషా పండితుడు, మన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ భాషలను కూడా అవపోసన పట్టిన ఘనుడు. ఆయా భాషల్లో తన అభ్యుదయ వాదానికి అనుకూలంగా దగ్గరగా ఉన్న కవితలను తెలుగులోనికి అనువదించి తెలుగు పాఠకు లకు కూడా వాటి వాడి, వేడి, రుచి చూపిం చాడు. ఈ అనువాద కవితలు ముఖ్యంగా మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం లాంటి ముఖ్య సంకలనాలలో కనిపిస్తాయి. మహా ప్రస్థానం గీతాలన్నీ 30వ దశకంలోనే […] The post శ్రీశ్రీ అనువాదాలే..అనునాదాలు appeared first on Navatelangana.

కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్కు ఈసారి గట్టి షాక్ తగలనుంది. విజయన్ నేతృత్వంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కూటమికి ఈసారి ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు ఈసారి ఓటర్లు పట్టం కట్టనున్నట్లు అభిప్రాయపడ్డాయి. భాజపా ఈసారి ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కేరళలో 140 స్థానాలకు గాను ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోరు సాగింది. సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కానీ, 2021 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ సత్తా చాటింది. అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలించనున్నాయని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం యూడీఎఫ్ 7890, ఎల్డీఎఫ్ 4962, భాజపా03 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. పీపుల్స్పల్స్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 7585, ఎల్డీఎఫ్ 5565, భాజపా 03 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా. ఓట్వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 7080, ఎల్డీఎఫ్ 5868, భాజప

33 స్థానానికి పడిపోయిన రాజధాని నగరం 89.23 శాతం ఉత్తీర్ణతబాలికలదే పైచేయి మనతెలంగాణ/ నాంపల్లి : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 89.23 శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలో 33 వ స్థానానికి దిగజారింది. జిల్లాలో మొత్తం 74099 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఇందులో బాలురు36,254 మంది, బాలికలు 37845 మంది ఉన్నారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 66,115(89.23 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 31524(86.95శాతం) మంది, బాలికలు 34,591(91.4శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. చిన్న జిల్లా ములుగు 99.30 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలివగా, రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లా 33(చివరి)వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లలో బాలురు 2,645 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులుకాగా, 633 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. బాలికలు 3,906 మంది పరీక్షలు రాయగా 574 మంది బాలికలు పరీక్షల్లో తప్పారు. ఇందులో కూడా ఉత్తీర్ణతలో బాలికలే పై చేయిగా కనిపిస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల విషయానికి వస్తే బాలుర 26,373 మంది ఉత్తీర్

బంకు యజమానులకు కొయ్యుర్ ఎస్ఐ హెచ్చరికనవ తెలంగాణ-మల్హర్ రావు:మండలంలోని తాడిచెర్ల,కొయ్యుర్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్,డీజిల్ ఉంచుకొని ఇంధనాన్ని కృత్రిమ కొరత సృష్టిస్తే పెట్రోలు బంకుల యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ హెచ్చరించారు. బుధవారం పెట్రోలు పంపులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు కావాలనే ఎవరైనా డీజిల్,పెట్రోల్ కానీ స్టాక్ ఉంచుకొని స్టాక్ లేదని బోర్డు పెట్టి కృత్రిమ ఇంధనం కొరతను సృష్టిస్తే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి,బంకును […] The post ఇంధనాన్ని కృత్రిమ కొరత సృష్టిస్టే చర్యలు తప్పవు appeared first on Navatelangana.

హోర్సెన్స్(డెన్మార్క్): థామస్ కప్లో భాగంగా చైనాతో జరిగిన చివరి రౌండ్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఓడినా భారత్ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. కెనడా, ఆస్ట్రేలియాలతో జరిగిన తొలి రెండు టీమ్ విభాగం మ్యాచుల్లో గెలిచిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకుంది. అయితే చైనాతో జరిగిన మ్యాచ్లో మాత్రం భారత్కు ఓటమి తప్పలేదు. చైనా 3-2 తేడాతో భారత్ను ఓడించింది. తొలి సింగిల్స్లో లక్షసేన్ 19-21, 21-8, 12-21 తేడాతో లి ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తర్వాత జరిగిన డబుల్స్లో సాత్విక్సాయిరాజ్చిరాగ్ శెట్టి జంట పరాజయం చవిచూసింది. లియాంగ్వాంగ్ చాంగ్ జోడీతో జరిగిన మ్యాచ్లో సాత్విక్ జంట 13-21, 21-13, 24-26తో ఓడిపోయింది. కాగా, తర్వాత జరిగిన సింగిల్స్లో యువ సంచలం ఆయుశ్ శెట్టి విజయం సాధించాడు. వెంగ్ హాంగ్తో జరిగిన పోరులో ఆయుశ్ 17-21, 21-13, 21-15తో జయకేతం ఎగుర వేశాడు. అయితే కీలకమైన పురుషుల డబుల్స్లో హరిహరణ్ఎంఆర్ అర్జున్ జోడీ ఓటమి పాలైంది. జిటింగ్రెన్ జియాంగ్ జంటతో జరిగిన పోరులో వీరికి ఓటమి ఎదురైంది. ఇక చివరగా జరిగిన సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. లు
నవతెలంగాణ – శాయంపేట: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించి ముందు వరసలో నిలిచారు. జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాల నుండి బాసని అన్విత 560/600, సోషల్ వెల్ఫేర్ బాలికల విద్యాలయం నుండి వర్షహాసిని 581/600, కేజీబీవీ పాఠశాల నుండి అక్షర 568/600, నవోదయ పాఠశాల నుండి నేత్ర 562/600 మార్కులు సాధించారు. విద్యార్థుల కృషి క్రమశిక్షణ వల్లనే ఉత్తమ ఫలితాలు […] The post పది లో ఉత్తమ ఫలితాలు. appeared first on Navatelangana.
నవతెలంగాణ – శాయంపేట: అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వరంగల్ మహమ్మద్ తస్లీమా ను బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతి కుమార్, మాట్లాడుతూ తస్లీమా చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియడారు. గతంలో తస్లీమ్ సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో ఉండి అనేకమంది పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఉద్యోగ […] The post తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు appeared first on Navatelangana.

