
నగరంలో బుధవారం కురిసిన అకాల భారీ వర్షాలకు బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రి ప్రహారీ గోడ కూలి ముగ్గురు పిల్లలతోసహా 8మంది మృతి చెందారు. వర్షంతోపాటు బలమైన గాలులు వీచడంతో గోడపక్కన నిలుచున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది అక్కడే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులని పోలీసులు చెప్పారు. అత్యవసర సహాయ బృందాలు అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శిధిలాలను తొలగిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం ప్రకటించారు. డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.













