



ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, నటుడు అభిమన్యు దస్సాని, గాయని రిచా అనిరుద్, పంజాబీ కళాకారుడు డా. లక్ష్యరాజ్ సింగ్, గాయకుడు మోనాంక్ పటేల్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి ప్రదర్శనలు, సందేశాలతో వేడుకలకు మరింత ఉత్సాహం వచ్చింది.














అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు వ్యాపార, వృత్తి, కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేసే దిశగా కీలక ముందడుగు పడింది. Andhra Pradesh American Association (AAA), Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ఐదుగురు రీజినల్ డైరెక్టర్లను ప్రకటించాయి. ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో AAA, ABC కార్యక్రమాలను విస్తరించడంతో పాటు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, యువ నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.





