
1579 వార్తలు

Gujarat Titans vs Royal Challengers Bengaluru Result: ఐపీఎల్ 2026లో భాగంగా 42వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు అందించిన 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కథనాయికగా తనదైన ముద్ర వేసింది హీరోయిన్ రాశి. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన రాశి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మరోసారి సినీప్రియులను అలరిస్తుంది.

ప్రధానమంత్రి స్వనిధి యోజన చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనిస్తోంది. రూ.80,000 వరకు పూచీకత్తు లేని రుణాలు, కొత్తగా క్రెడిట్ కార్డ్ సౌకర్యం అందిస్తోంది. డిజిటల్ లావాదేవీలపై వడ్డీ రాయితీ, క్యాష్బ్యాక్ లభిస్తాయి. ఈ పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా చిన్న వ్యాపారులు అడుగులు వేయొచ్చు.

ప్రతి రోజూ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం గృహిణులకు పెద్ద పని. అందుకే చాలామంది ఒకేసారి పెద్ద మొత్తంలో తయారు చేసి నిల్వ చేసుకుంటారు. కానీ కొన్ని రోజులకే అది రంగు మారిపోవడం లేదా వాసన రావడం జరుగుతుంటుంది. అలా కాకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా, ఘుమఘుమలాడుతూ ఉండాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తాజాగా ఉండటానికి పాటించాల్సిన ఒక రహస్యమైన కిచెన్ హ్యాక్ ఉంది.

బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సులో జరిగిన చిన్న వివాదం ఘర్షణకు దారి తీసి 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. చిన్న విషయంలో ప్రారంభమైన మాటల యుద్ధం చినికిచినికి గాలివానలా మారి, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పండుగ రద్దీ నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

OpenAI గణాంకాల ప్రకారం, ChatGPT Images 2.0 వినియోగంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. AI టూల్స్ పట్ల భారతీయ వినియోగదారుల వేగవంతమైన స్వీకరణను ఇది సూచిస్తుంది. సోషల్ మీడియా విజువల్స్, వ్యక్తిగత బ్రాండింగ్, పాత ఫోటోల పునరుద్ధరణ, ప్రొఫెషనల్ అవసరాల కోసం ఈ AI ఇమేజ్ జనరేషన్ టూల్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

నోటికి ఏదీ రుచించనప్పుడు కమ్మని వాసనతో, ఘాటైన రుచితో ఏదైనా తినాలనిపిస్తే.. గార్లిక్ ఫ్రైడ్ రైస్ బెస్ట్ ఛాయిస్. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు కేవలం రుచినే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మిగిలిపోయిన అన్నంతో కూడా ఐదు నిమిషాల్లో సిద్ధం చేసుకోగలిగే ఈ రెసిపీని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. హోటల్ రుచి రావాలంటే ఇందులో వేయాల్సిన ఆ సీక్రెట్ ఇంగ్రిడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధికారుల అలసత్వం నిండు ప్రాణాన్ని బలిగొంది. అధికారులు ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థి మరణించాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంలో మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. స్కూల్ సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్ లీగ్ మహిళల సింధియా కప్ కోసం ఐదు జట్ల క్రీడాకారిణుల ఎంపిక పూర్తయింది. ఐకాన్, రిటైన్డ్, డెవలప్మెంట్ కేటగిరీల కింద ఎంపికైన 75 మంది క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. చంబల్ ఘరియల్స్, గ్వాలియర్ షెర్నిస్, భోపాల్ వోల్వ్స్.. ఇలా ఐదు ఫ్రాంచైజీల పూర్తి స్క్వాడ్స్, స్టార్ ప్లేయర్ల వివరాలు తెలుసుకుందాం

తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా.. ఇప్పటివరకు సరికొత్త గేమ్ షోస్, వెబ్ సిరీస్, సినిమాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అత్యంత ప్రజాధరణ పొందిన గేమ్ షోలలో సర్కార్ ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్టింగ్ చేస్తున్న ఈ షోకు రోజు రోజుకీ మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటై 'యాషే స్పిట్టింగ్ కోబ్రా' (Ashe's Spitting Cobra) గురించి దాదాపు చాలా మందికి తెలియదు. ఇది తన విషాన్ని పిచికారీలా చిమ్మే విలక్షణమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది తన శత్రువుల లేదా వేటాడే జీవుల కళ్లను సరిగ్గా గురిచూసి విషాన్ని చిమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

జేపీమోర్గాన్ బ్యాంక్లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఓ జూనియర్ పురుష ఉద్యోగి తన సీనియర్ మహిళా బాస్పై లైంగిక వేధింపులు, మత్తుమందులు ఇచ్చి హింసించడం, జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించారని పేర్కొన్నారు. అయితే బ్యాంక్ ఈ ఆరోపణలను ఖండించింది.

మనలో చాలా మందికి ఒక అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఇంట్లో అందరం కూర్చుని ఉన్నా, దోమలు మాత్రం మనల్నే పట్టుకుని వదలవు. పక్కనే ఉన్న వారిని వదిలేసి మన చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయా అని విసుగు వస్తుంటుంది. "నా రక్తం ఏమైనా తీపిగా ఉందా?" అని మనం సరదాగా అనుకుంటాం కానీ, నిజానికి దోమలు మనల్ని ఎంచుకోవడానికి వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవి కేవలం మన రక్తం కోసం మాత్రమే కాకుండా, మన శరీరం విడుదల చేసే కొన్ని రసాయనాలు, వాసనలు మరియు ఉష్ణోగ్రతను బట్టి ఆకర్షించబడతాయి.

మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో పైకి వచ్చిన యాక్టర్. ఆయన తనను తాను చెక్కుకున్నారు. తననే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు. చిరు డ్యాన్స్ అన్నా.. డైలాగ్ అన్నా.. బాస్ గ్రేస్ అన్నా.. ఎప్పటికీ ఎవర్గ్రీన్. అలాంటి చిరు ఓ టాలీవుడ్ నటుడి గురించి చాలా మంచి మాటలు చెప్పారు.

Mumbai Indians Playoff Qualification: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఏకంగా ఆరింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే, అభిమానులకు ఒక చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. గణాంకాల ప్రకారం ముంబై ఇప్పటికీ ప్లేఆఫ్ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఆ సమీకరణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. తాజాగా తాను తల్లి కాబోతున్నానంటూ శుభవార్త పంచుకుంది. అంతేకాదు భర్తతో కలిసి చేసిన బేబీ బంప్ ఫోటోషూట్ షేర్ చేసింది. దీంతో ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

మన సమాజంలో పాముల చుట్టూ అల్లబడిన కథలు, అపోహలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్లెల్లో ఒక బలమైన నమ్మకం ఉంది.."పాము ఏదైనా పండును కొరికితే అది విషపూరితం అవుతుంది, దాన్ని తింటే మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు." ఈ భయం వల్ల ఎంతో పౌష్టికాహారం వృథా అవడమే కాకుండా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారు. అసలు పాము విషం మన జీర్ణవ్యవస్థలోకి వెళ్తే ఏం జరుగుతుంది? తెలుసుకుందాం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులపై 25 శాతం రాయితీ ప్రకటించింది. జులై వరకు ఈ సౌకర్యం అందుబాాటులో ఉండనుంది. ప్రస్తుతం చాలామంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసున్నా ఫీజు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండకు వడదెబ్బ, వానకు పిడుగులు.. ఇలా జనం రెండు రకాల గండాల మధ్య సతమతమవుతున్నారు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో జమకాని మీ కాంట్రిబ్యూషన్లు కోల్పోయినట్లు కాదు. PFRDA, SPCPA ద్వారా వాటిని తిరిగి పొందే అవకాశం కల్పిస్తోంది. PRANలో జమకాని నిధులు ఈ ప్రత్యేక ఖాతాలో భద్రపరుస్తారు. 25 సంవత్సరాల లోపు సరైన పత్రాలతో క్లెయిమ్ చేస్తే, అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

అరటి పండుతో పాటు అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ వ్యాధిని నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమస్యలను తగ్గించి, రక్తహీనతను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం దీనిని డైట్లో చేర్చుకోవడం ఎంతో మేలు.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ నేవీ కమాండర్ అమెరికాకు 'గుండెపోటు' తెప్పించే కొత్త ఆయుధం ప్రయోగిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు ఒప్పందం కుదిరేవరకు ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని, ఇది టెహ్రాన్ను ఒత్తిడిలో ఉంచుతుందని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయం అలముకుంది.

హైదరాబాద్ వాసులకు శుభవార్త. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత జర్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది.