మన సమాజంలో పాముల చుట్టూ అల్లబడిన కథలు, అపోహలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్లెల్లో ఒక బలమైన నమ్మకం ఉంది.."పాము ఏదైనా పండును కొరికితే అది విషపూరితం అవుతుంది, దాన్ని తింటే మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు." ఈ భయం వల్ల ఎంతో పౌష్టికాహారం వృథా అవడమే కాకుండా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారు. అసలు పాము విషం మన జీర్ణవ్యవస్థలోకి వెళ్తే ఏం జరుగుతుంది? తెలుసుకుందాం..