
3721 వార్తలు

అహ్మదాబాద్: ఐపిఎల్లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన ఆర్సిబి ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది. ఇక గుజరాత్కు ఈ మ్యాచ్ సవాల్గా మారింది.

నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రతిపక్షాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం అత్యంత వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా అత్యున్నత పాలనా స్థాయినుంచి ఏదైనా మాట్లాడితే తక్షణం అది జనంలో వెంటనే ప్రచారమవుతుంది. అదే ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడితే అది కేవలం కమ్యూనికేషన్కు పరిమితం కాదు. అది రాజకీయ నీతిజ్ఞతగా పరిగణించబడుతుంది. ప్రధాని కార్యాలయం ఒక పార్టీకి చెందినదిగా ఉండదు. అది రాజ్యాంగ విలువలకు, కొన్ని కోట్ల ప్రజల సమన్వయ సంకల్పం, ఆకాంక్షల ప్రతిరూపం. అందువల్ల నేరుగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడాలనుకున్న అంశం, కథనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకునేలా ఉండాలి. కొన్ని కోట్లమంది ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసే ప్రసంగం జాతీయ ప్రాధాన్యమైనదిగా ఉండాలే తప్ప కేవలం ఒక పార్టీ ఫక్తు రాజకీయ ప్రసంగంలా ఉండరాదు. వాస్తవానికి జాతీయ ప్రాధాన్యత కలిగిన సందర్భాల్లోనే ప్రధాని ఎవరైనా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య సంప్రదాయం. యుద్ధాల

ప్రతిష్టాత్మకంగా జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, మొత్తం అయిదు అసెంబ్లీల ఎన్నికల పోలింగ్ ఘట్టం బుధవారంతో ముగిసింది. రెండు చోట్ల ఎన్డిఎ, మూడు చోట్ల ప్రత్యర్థి పార్టీ/ కూటములు గెలుపొందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దేశప్రజల దృష్టినాకర్శించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వాల్ని నిలబెట్టుకునే సూచనలున్నాయి. ఈ రెండు చోట్ల, కేంద్రంలో పాలకపక్షమైన బిజెపికి గట్టి ప్రత్యర్థులు మమతా బెనర్జీ (టిఎంసి), ఎం.కె. స్టాలిన్ (డిఎంకె) లు ముఖ్యమంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే! ఇక బిజెపి నేతృత్వం వహిస్తున్న ఎన్డిఎ ప్రస్తుత పాలనలోని అసోం (హిమంత బిశ్వశర్మ), పుదుచ్చెరి (ఎన్.ఆర్. రంగస్వామి) ల్లోనూ పాలకపక్షాలే గెలుపొందనున్నాయి. దేశంలో ఏకైక కమ్యూనిస్టు రాష్ట్రం కేరళ (పినరయ్ విజయ్) లో మాత్రమే పాలక వామపక్ష ఎల్డిఎఫ్ ఓడి కాంగ్రెస్ నేతృత్వపు యుడిఎఫ్ గెలుపొందే సంకేతాలున్నాయి. ఇక్కడ బిజెపి ఉనికి నామమాత్రమే! ఇదీ అసెంబ్లీల ఎన్నికల తాజా ముఖచిత్రం! కమ్యూనిస్టు పాలనలోని ఒక్క కేరళలో తప్ప మిగతా నాలుగుచోట్ల పాలకపక్షాలే ఎన్నికల్లో గెలిచే సూచనలున్న

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత 95.15 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 96.26 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 94.07 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత, బాలుర కంటే 2.19 శాతం అధికంగా నమోదైంది. ఎస్సిఇఆర్టి కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పివి శ్రీహరి,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణత నమోదైందని అన్నారు. విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు, బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ మోడల్ స్కూల్స్,ప్రైవేట్, కెజిబివి మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యిందని తెలిపారు. రాష్ట్రంలో 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. గురుకుల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గ

పేదోనిదైనా, పెద్దోనిదైనా... పైసలున్నోనిదైనా, పైసక్కరువున్నోనిదైనా... పూర్ గుడిసోనిదైనా, ఫుల్లు రిచ్చోనిదైనా... గూడున్నోడిదైనా, గూడు లేనోడిదైనా... ఎవరిదైనా పానమే. అది ఎప్పటికైనా పోయేదే గనీ, ఎల్లకాలం ఉండేది కాదు గదా..? మరి, అసొంటప్పుడు పానం బోయిన మనిషిని జూస్తే ఎందుకంత భయం? కాదు కాదు, అది భయమనుకుంటే మనం భ్రమ పడ్డట్ట్టే! ఆ పానంబోయిన మనిషి పెద్దోడు కాదు కావట్టే ఛీ పొమ్మంటున్నదీ పాడు లోకం. ఆ పానం బోయిన మనిషి దగ్గర పైసల్లెవ్వు కావట్టే అట్లా దూరం పెడుతున్నదీ సమాజం. ఆ పానం బోయిన మనిషికి నిల్వ నీడ లేదు కావట్టే ఛీ పొమ్మని ఛీత్కరించుకుంటున్నదీ లోకం. ఎందుకింత నైరాశ్యమని ఆలోచిస్తున్నరా? ఇదిగో ఈ వ్యాసం సదువుతే మీకే అర్థమైతది. 2017 అనుకుంటా... ఓ జర్నలిస్టు మిత్రుడి వాళ్ల నాయిన జగదీశ్కు రోడ్డు యాక్సిడెంటైతే గాంధీ దావఖానకేస్కొచ్చిన్రు. పరిస్థితేం బాగలేదు, మనిషి కొరి జీవునం మీదున్నడని తెలిస్తే.. నేను, ఇంకో ఇద్దరు జర్నలిస్టు మిత్రులు ముగ్గురం గల్సి గాంధీ దావఖానకు వోయినం. పోయేసరికే పాపం ఆ పెద్దమనిషి జీవిడిసిండనే వార్త మా కండ్లనెరుపెక్కించింది. మేమే గాదు, ఆ పెద్దమనిషి కోసం అక్కడికొచ్చిన ప్రతీ ఒక్క మనిష

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి ఎన్నో శాఖలు ఉన్నా, ప్రజలతో అత్యంత ప్రత్యక్ష సంబంధం కలిగి, ప్రభుత్వ ఉనికిని నేలమీద ప్రతిఫలింపజేసే శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖే. ఈ శాఖను కేవలం భూముల పరిపాలనకు పరిమితమైన యంత్రాంగంగా చూడటం దాని అసలైన పరిధిని, ప్రాముఖ్యతను అణగదొక్కినట్లే అవుతుంది. వాస్తవానికి రెవెన్యూ శాఖ అనేది రాష్ట్ర పరిపాలనా నిర్మాణానికి వెన్నెముక మాత్రమే కాదు, అది ప్రభుత్వ కార్యాచరణకు క్షేత్రస్థాయి జీవనాడి. గ్రామ సరిహద్దునుంచి రాష్ట్ర రాజధానివరకు విస్తరించిన పరిపాలనా శ్రేణిలో ప్రభుత్వానికి కళ్ళూ, చెవులూ, చేతులూ అన్నీ ఈ శాఖే. ప్రజలు ప్రభుత్వాన్ని మొదటగా స్పృశించే స్థలం తహసీల్దార్ కార్యాలయం; జిల్లా పరిపాలనను క్షేత్రస్థాయిలో నడిపించే ప్రధానశక్తి కలెక్టరేట్; ఈ రెండింటి వెనుక నిలిచేది రెవెన్యూ యంత్రాంగమే. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల గడప దాటే మార్గం ఇదే. పౌరుడి జీవితం ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానమయ్యే ప్రతి దశలో రెవెన్యూ శాఖ ఉంటుంది. పుట్టుక నమోదులోనూ, మరణ ధ్రువీకరణలోనూ, కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల జారీలోనూ, వారసత్వ హక్కుల నిర్ధారణలోనూ ఈ శాఖ పాత్ర అనివార్యం. విద్య, ఉద్యోగం, సంక్

మన తెలంగాణ/హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసిఆర్హెచ్ఆర్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజ్యసభ ఎంపి వేం నరేందర్ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ఎంత ఎత్తులో నిర్మించాలి, ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని, ఇప్పటికే 71.5 కిలోమీటర్ల కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు సిఎంకు వివరించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టిఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, త

న్యూ ఢిల్లీ: హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. అధికార తృణమూల్ 177187, భాజపా 95110 స్థానా ల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. టీఎంసీ 125140, భాజపా 146161 చోట్ల విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్ సర్వే వెల్లడించింది. పీమార్క్ సర్వే మాత్రం తృణమూల్ 118138 స్థానాలు, భాజపా 150175 స్థానా ల్లో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ కూడా భాజపా వైపే మొగ్గు చూపాయి. భాజపాకు 150160 సీట్లు, తృణమూ ల్ కాంగ్రెస్కు 130140 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో మరోసారి డీఎంకే.. ఏప్రిల్ 23న తమిళనాడులో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ మరోసారి సత్తా చాటబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనాలు వెలువడుతున్నాయి. ముక్కోణపు పోరులో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగించనుందని అంచనా వేశాయి. భాజపాతో కలిసి బరిలో దిగిన అన్నాడీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్పార్టీ టీవీకే మూ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వెయ్యి కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేశారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుణుగుణంగా ఈ ఏడాది మార్చి వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని వెయ్యి కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. గతేడాది అక్టోబర్ వరకు ఉన్న జిపిఎఫ్ క్లియర్ అక్టోబర్ 2025 వర

మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పటి వరకు ఎల్ అండ్ టి ఆధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టి కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ బుధవారం స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఇరువురు మెట్రో బదిలీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఎల్ అండ్ టి ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించిన ఆపరేషన్స్, భవిష్యత్లో రెండోదశ మెట్రో పనుల్లో ఆ కంపెనీ భాగ స్వామ్యంపై వారిద్దరూ ప్రాథమికంగా చర్చించారు. వంద శాతం షేర్లు రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువ స్వాధీనం హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-Iను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ అండ్ టితో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టి, ఎల్టిఎంఆర్హెచ్ఎల్ ప్రతినిధులు బుధవారం రాష్ట
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాలు 2025-26లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. విద్యాపరమైన నైపుణ్యం, విద్యార్థుల విజయానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 98.86 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఇది గతేడాది కంటే 0.78 శాతం ఎక్కువ. 84 విద్యాలయాల్లో 66 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. సిర్పూర్-1, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బి.అక్షయ 587 మార్కులు సాధించారు. 90 శాతం కంటే […] The post గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 98.86 శాతం ఉత్తీర్ణత appeared first on Navatelangana.
ఎన్నికల్లో చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటిఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?పంటలను కొనుగోలు చేయాలిసీఎం రేవంత్రెడ్డికి మాజీమంత్రి హరీశ్రావు బహిరంగ లేఖ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చెప్పిందొకటి… అధికారంలోకి వచ్చాక అమలు చేసేదొకటని ఎద్దేవా చేశారు. తాలు […] The post కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ appeared first on Navatelangana.
మూడు నెలల్లో పెండింగ్ సమస్యలు క్లియర్సాదాబైనామాలకు 45 రోజుల్లోనే పరిష్కారం : ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవతెలంగాణ – ఖమ్మంరూరల్ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తునూ అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామంలో బుధవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రజల నుంచి […] The post దరఖాస్తు ఏదైనా.. పరిష్కారం పక్కా appeared first on Navatelangana.
బహుముఖ పోరాటాలతోనే కులరహిత సమాజం :కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబునవతెలంగాణ-ఖమ్మంకుల వ్యవస్థ నిర్మూలన జరగకపోతే మానవ సమానత్వం సాధ్యం కాదని, సమానత్వం లేకుండా సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు తెలిపారు. మతాలు, పాలకులు మారినా దేశంలో కులవ్యవస్థ మాత్రం మారలేదన్నారు. ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ”కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల” ముగింపు కార్యక్రమంలో స్కైలాబ్బాబు మాట్లాడారు. […] The post కుల వ్యవస్థ నిర్మూలన లేకుండా సమానత్వం అసాధ్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-గండిపేట్హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకులం బాలికలు టెన్త్లో రాష్ట్రస్థాయిలో ఫలితాలు సాధించారని జిల్లా డీసీఓ కల్పన తెలిపారు. బుధవారం ఆమె పది ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గౌలిదొడ్డి బాలికల సీఓఈలో 76 మంది పరీక్షకు హాజరుగా 76 మంది పాస్ అయినట్టు తెలిపారు. రాష్ట్రస్థాయిలో అత్యధికంగా కె.స్వేచ్చదాస్ 584, కె.తులసి 583 మార్కులను సాధించినట్టు తెలిపారు. మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణతో కూడిన బోధన ఇవ్వడంతో రాష్ట్రస్థాయిలో గౌలిదొడ్డి […] The post గౌలిదొడ్డి గురుకులంలోరాష్ట్ర స్థాయి ఫలితాలుజిల్లా డీసీఓ కల్పన appeared first on Navatelangana.
వ్యవసాయానికి తీవ్ర నష్టం :రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్మిగులు ఉత్పత్తి అమ్ముకోవడానికే యుద్ధాలు : వ్యకాస రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఏ.మధుసూదన్ రెడ్డి నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి”విదేశీ వాణిజ్య ఒప్పందాలు ప్రజల సమక్షంలో చేసుకోవాలని దొడ్డిదారిన ఒప్పందాలు చేసుకుని ప్రకటించడం సరికాదు.. ఈ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది.. ఇరాన్పై యుద్ధం వల్ల అమెరికాకు ఒరిగిందేం లేదు.. అమెరికాలో ఆర్థిక సంక్షేమం ఏర్పడింది” అని తెలంగాణ […] The post దొడ్డిదారి వాణిజ్య ఒప్పందాలొద్దు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అనుమతి లేని లే ఔట్లను (ఎల్ఆర్ఎస్ స్కీం కింద) రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్ ఫీజులు, చార్జీల్లో 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. మే01 వ తేదీ నుంచి 31 జూలై వరకు ఎల్ఆర్ఎస్కు అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ బుధవారం జీఓ ఎంఎస్ నెం.131 జారీచేశారు. గతంలో సుమారు 6లక్షలకుపైగా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినా 2లక్షల మందికి మాత్రమే ప్రొసిడింగ్స్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26.15లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా, 6.04లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 20.11లక్షల దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించాలని అధికారులు లేఖలు పంపించారు. ఇప్పటి వరకు 6.26 లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. వీటిలో సుమారు 2లక్షల మందికి అధికారులు ప్రొసిడింగ్స్ జారీచేశారు. లే ఔట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందలేదు. కానీ, భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వాటి ద్వారా ప్రభుత్వం రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని అ
అదే బాటలో రేవంత్రెడ్డి సర్కార్ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ- మిర్యాలగూడటౌన్కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిస్సిగ్గుగా అమలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తుంగలో తొక్కి నాలుగు […] The post కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు appeared first on Navatelangana.
98.99శాతం ఉత్తీర్ణత,రెండో స్థానంలో బీసీ గురుకులాలు204 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణతఅత్యధికంగా 588 మార్కులుసాధించిన నితీషా, శ్రీనిధి587 మార్కులు సాధించినసాయిమనోజ్ రెడ్డి, లాస్య580 కన్నా ఎక్కువ మార్కులుసాధించిన 60 మంది570కి పైగా మార్కులు సాధించిన364 మంది విద్యార్థులు3598 మంది విద్యార్థులకు90 శాతానికి పైగా మార్కులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి విజయఢంకా మోగించారు. అత్యధిక మార్కులు 588 ఇద్దరు […] The post పదో తరగతి ఫలితాల్లోబీసీ గురుకుల విద్యార్థుల విజయదుందుభి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని, పంట కొనుగోళ్లలోనూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటి, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని హరీశ్రావు విమర్శించారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సిఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని హరీశ్రావు ఈ లేఖలో ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని హరీశ్రావు మండిపడ్డారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500ల బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే
భారీ గాలులకు మామిడికాయలు నేలమట్టంవర్షానికి తడిసి ముద్దయిన మొక్కజొన్న, ధాన్యంనవతెలంగాణ – మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధిఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలు అకాల వర్షానికి నేలపాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులకు మామిడికాయలు నేలమట్టమైతే.. గంటపాటు కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మక్క నీటిపాలయింది. మార్కెట్లో దారి వెంట ఉంచిన మక్కలు గుగ్గిళ్లుగా మారాయి. పొద్దంతా వర్షం వచ్చే సూచనలేమీ లేకపోవడంతో రైతులు మొక్కలను కుప్పలుగా పోయలేదు. కానీ, రాత్రి ఒక్కసారిగా భారీ […] The post మక్కలు, మామిడి వర్షార్పణం appeared first on Navatelangana.
అంతర్జాతీయ సంస్థలకు మంత్రి శ్రీధర్బాబు పిలుపు‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ ప్రారంభోత్సవంనవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోతెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్య మయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా, స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్మ్యాప్ను […] The post పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములవ్వండి appeared first on Navatelangana.
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,103 కోట్ల నికర లాభాలు సాధించింది. చెన్నరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్ గతేడాది ఇదే సమయంలో రూ. 2,956 కోట్లుగా నమోదయ్యింది. గడిచిన క్యూ4లో రిటైల్ వ్యాపారం 18.72 శాతం పెరిగి రూ. 1,41, 396 కోట్లకు చేరింది. మొండి బకాయిలు 1.98 శాతానికి తగ్గి ఆస్తుల […] The post ఇండియన్ బ్యాంక్కు రూ.3,103 కోట్ల నికర లాభాలు appeared first on Navatelangana.