
3542 వార్తలు
నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం, పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, శిఖర ప్రతిష్ట, ఆంజనేయస్వామి విగ్రహ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న మహా అన్నదాన కార్యక్రమం గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు సమక్షంలో చేపట్టారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుసోమయ్య, ఇరిగి మహేష్, […] The post మహా అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నందున, తదుపరి ఆదేశాలు జారీ చేసేందుకు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది మిశ్రమంగా పనిచేయడానికి ఈ మార్గదర్శకాలు వీలు కల్పిస్తాయని, అయితే ఇసి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు `అక్షరాలా స్పూర్తి’తో […] The post సీఎం మమతా బెనర్జీ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.
పరకాలలో రాత్రి 11 దాటినా బార్లా తెరిచే మద్యం దుకాణాలుహోటళ్లన్నీ ‘మద్యం’ మయమే.. పలు ప్రాంతాల్లో 24/7 బెల్ట్ దందా!నవతెలంగాణ – పరకాల నిబంధనలు సామాన్యులకేనా? బడా మద్యం వ్యాపారులకు చట్టం వర్తించదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పరకాల పట్టణంలో. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు నిర్ణీత సమయానికి షట్టర్లు పడాలి.. కానీ పరకాల పట్టణంలో మాత్రం రాత్రి 11 గంటలు దాటినా ప్రధాన షట్టర్లు తీసి మరీ విక్రయాలు సాగిస్తుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. హోటలా..? […] The post చీకటి పడితేనే అసలు ‘కిక్కు’ appeared first on Navatelangana.
నవతెలంగాణ-తుంగతుర్తిశారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ,సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల tశ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు,జిల్లా యువజన క్రీడల సమాఖ్య సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవికాల క్రీడాశిక్షణ శిబిరాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు యువత,క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకుముందు ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య మాట్లాడుతూ […] The post వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్కు పోలీసుల నుంచి చుక్కెదురైంది. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి చేరుకున్న అతడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఎయిర్పోర్టులోనే అడ్డుకున్నారు. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన రాహెల్, ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారు. అయితే కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, కోర్టు […] The post మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎయిర్పోర్టులో అడ్డుకున్న పోలీసులు appeared first on Navatelangana.
సర్పంచ్ పరిదే మమత నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి నెలకొంది.గ్రామ ప్రవేశ ద్వారం వద్ద 11 కేవీ విద్యుత్ లైన్ చాలా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఈ లైన్కు వడ్ల లారీలు, రైతులు తీసుకెళ్లే గడ్డి తరచుగా తగులుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ పరిస్థితి వల్ల ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా […] The post ప్రమాదకరంగా 11 కేవీ లైన్.. స్పందించని అధికారులు appeared first on Navatelangana.
– ఏప్రిల్లో గెలల ధర రూ.23,501– పామాయిల్ రైతుల్లో పెరిగిన ఆశలునవతెలంగాణ – అశ్వారావుపేటఏప్రిల్ నెలలో సేకరించిన పామాయిల్ గెలల ధరను టన్నుకు రూ.23,501గా ఆయిల్ ఫెడ్ పాలక మండలి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి నెలలో టన్ను గెలల ధర రూ.23,005గా ఉండగా, ఏప్రిల్ నెలకు రూ.23,501గా నిర్ణయించడంతో టన్నుకు రూ.496 పెరుగుదల నమోదైంది. గత నాలుగు నెలలుగా గెలల ధరలు నెలనెలా పెరుగుతూ రావడం పామాయిల్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గెలల దిగుబడులు […] The post నెలనెలా పెరుగుతున్న గెలల ధరలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : మూడేళ్లకుపైగా జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్ను టీమ్లోకి తీసుకోవడానికి పరిశీలించాలని మాజీ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ సెలక్టర్లకు సూచించాడు. ఈ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున అదరగొడుతున్న 36 ఏళ్ల భువీ 9 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. భువీ సూపర్ ఫామ్ నేపథ్యంలో టీ20 టీమ్కు అతడిని పరిశీలించాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అద్భుత ప్రదర్శనలు చేస్తున్న సమయంలో వయసు అనేది పెద్ద విషయం కాదన్నాడు. The post అతడిని జట్టులోకి తీసుకోండి: సెహ్వాగ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డి బంజారాహిల్స్ లో నిర్మించే సేవాలాల్ మహారాజా గుడి నిర్మాణం కి భూమి, నిధులను కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు కోరారు. ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లాలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాదు బంజారాహిల్స్ లో సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100 ఎకరాలు భూమి కేటాయించి 1000 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను […] The post సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ – మునిపల్లి మండలంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట పడిగాపులు కాసినా దొరకని పరిస్థితి.. మండలంలో అధిక శాతం ఉపయోగించేది ఇండియా గ్యాస్ అయితే గత కొన్ని నెలలుగా గ్యాస్ సరఫరా లేక మునిపల్లి మండల గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా గ్యాస్ కార్యాలయం మండల […] The post గ్రామాల్లో కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల కష్టాలు appeared first on Navatelangana.
ఆంగ్ల మాధ్యమంలో బోధనఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభంనవతెలంగాణ – మల్హర్ రావుపేద, వెనుకబడిన, మధ్యలో బడి మానిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)లను ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. చదువుతో పాటు క్రమశిక్షణ,సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్ వరకు బోధన అందిస్తున్నారు. 2026-27 విద్యాసం వత్సరానికి […] The post కేజీబీవీ పిలుస్తోంది.! appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలబోతోంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం, డిస్టలరీల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పెంపు అమలైతే ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్పై రూ.100 వరకు భారం పడొచ్చని అంచనా. గత ఏడాది కాలంగా […] The post మందుబాబులకు షాక్..భారీగా పెరగనున్న మద్యం ధరలు..! appeared first on Navatelangana.
అగ్ని ప్రమాద రైతులకు నష్ట పరిహారం అందేలా చూస్తామాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డినవతెలంగాణ-కుభీర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మండలంలో ఇటీవల ఆయా గ్రామల్లో ఉన్న రైతుల పంట క్షేత్రాల్లో మొక్క జొన్న పంటలు ప్రమాదవ శాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంబవించి మొక్క జొన్న పంటలు పూర్తిగా కాలి బూడిద కావడం జరిగింది. మండలంలోని దార్ కుభీర్, ఫార్డి కే, నిగ్వ గ్రామంలో దాదాపుగా 42ఎకరాల్లో మొక్క జొన్న, జొన్న […] The post మొక్క జొన్న రైతులకు ఆదుకుంటాం appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2003లో పదవతరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుతున్న ఎండల నేపథ్యంలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రయాణికులు,బాటసారులు,ప్రజలకు దాహార్తి తీర్చడాని చలివేంద్రం ఏర్పాటు చేసినట్లుగా పూర్వ విద్యార్థులు తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేయడంపై పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పుప్పాల రాజు, మాచర్ల సురేష్, ఆకుల రాజబాబు, తిప్పని రాజు, ముడుతనపల్లి ప్రదిప్ […] The post పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
పైలెట్ ప్రాజెక్టుగా గ్రామానికో సంఘం ఏర్పాటు15-18 ఏళ్ల బాలికలే సభ్యులు 13 అంశాలపై అవగాహన కార్యక్రమాలునవతెలంగాణ – మల్హర్ రావుమహిళా సాధికారత దిశగా గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్ హెచ్ జి గ్రూపుల) మాదిరిగానే గ్రామాల్లో కిశోర బాలికల కోసం కూడా సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.స్నేహ సంఘాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ సంఘాల్లో 15- 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు సభ్యులుగా ఉంటారు.ప్రస్తుతానికి ఒక్కో గ్రామంలో […] The post కిశోర బాలికలు.. స్నేహ సంఘాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని అభినందించారు. అన్ని రంగాల్లో […] The post మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-గాంధారి గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారుగా 19 వేల ఎకరాల్లో పండించిన జొన్న పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న అధికార పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు జొన్న పంట చేతికి వచ్చిన ఏ ఒక్కరూ స్పందించడం లేదని, రైతు పండిచిన పంటలు దళారులకు అమ్ముకోవడం జరుగుతుందని, ప్రభుత్వం నామ్ కె […] The post జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరా.? appeared first on Navatelangana.
ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలి: చెరుపు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య నవతెలంగాణ – జక్రాన్ పల్లి సేంద్రియ పద్ధతిని పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి ప్రకృతి ఆధారిత పద్ధతులలో పంటలు సాగు చేయాలని ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 […] The post సేంద్రీయ పద్ధతిని పాటించండి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందండి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ధరకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మోసం చేసే ముఠాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. వైద్య వృత్తిపై సమాజంలో ఉన్న గౌరవాన్ని ఆసరాగా చేసుకుని దళారులు తల్లిదండ్రులను మోసం చేసి లక్షలు కాజేస్తున్నారని, నీట్లో ర్యాంకు రాకున్నా చైనా, కిర్గిజ్స్థాన్ వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని ఆశచూపుతున్నారని […] The post మెడికల్ సీట్లంటూ మోసగిస్తారు జాగ్రత్త : సీపీ సజ్జనర్ appeared first on Navatelangana.



హైదరాబాద్: త్వరలో పెట్రోల్, డీజిల్, ఎల్ పిజి ధరలు పెరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్ పిజిపై రూ.50 వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. పెట్రోల్, డీజిల్పై రూ.5 పెరిగే అవకాశం ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ధరల పెంపునకు ఆయిల్ కంపెనీల కసరత్తు చేస్తున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 చమురు సంస్థలు పెంచిన విషయం తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071 హైదరాబాద్ లో రూ.3315 కు చేరింది. ఇప్పుడు సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు కాలం వెళ్లదీయడం కష్టంగా మారుతుంది.
