24826 వార్తలు

మూసీ ప్రక్షాళన కార్పొరేట్ల ప్రయోజనాల కోసమేనా.?గోదావరి జలాల కేటాయింపే శాశ్వత పరిష్కారంపెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్నేడు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాహాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, నేతలు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు నవతెలంగాణ-బోడుప్పల్యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి, వాటి పూర్తి కోసం ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర […] The post సాగు నీటి కోసమే సమర శంఖారావం appeared first on Navatelangana.

12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా లోటు..ఏపీ, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో 40 శాతానికి మించి కొరతకేంద్రం లక్ష్యాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులుఖరీఫ్ సాగుకు దెబ్బ. వరి 3 శాతం, మొక్కజొన్న 4 శాతం తగ్గుదల దేశవ్యాప్తంగా ఆగస్టులో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దాని కంటే మెరుగైన వర్షాలు కురిసినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు మాత్రం తీరలేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 29 వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు దాదాపు 14 శాతానికి […] The post ఆగస్టు వానలొచ్చినా.. వర్షాభావమే! appeared first on Navatelangana.

మేషంపనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. మిధునం సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. కర్కాటకం సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహం

భారత్లోనూ హైరిస్క్ సరస్సులు.. బద్దలైతే జలప్రళయమే!హిమాలయాల్లో 7,500 హిమానీనద సరస్సులుభారత్లో 195 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా గుర్తింపుసిక్కింలోనే 25 హైరిస్క్ సరస్సులు.. గంగా పరివాహక ప్రాంతంలో 4,700 సరస్సులు న్యూఢిల్లీ : నేపాల్ లో ఇటీవల సంభవించిన హిమానీనద విపత్తు భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయ పర్వతాల్లోని మంచు సరస్సులు బద్దలైతే ఎంతటి విధ్వంసం సంభవిస్తుందో నేపాల్ ఘటన స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్లో కూడా వందల సంఖ్యలో ప్రమాదకర హిమానీనద […] The post హిమాలయాల్లో ‘మంచు’ ముప్పు appeared first on Navatelangana.

కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీఎన్ఈపీ-2020ని వెనక్కి తీసుకోవాలి : ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ నవతెలంగాణ-సిటీబ్యూరో/నిజాంపేటప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టపరిచి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్ లోని లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ లో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘జిల్లా విద్యా సదస్సు’ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి […] The post ప్రభుత్వ విద్యను పటిష్ట పర్చాలి appeared first on Navatelangana.

హైదరాబాద్లో ఓ Zepto డెలివరీ బాయ్కు ఎదురైన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.తన భార్య ఆస్పత్రిలో ఉందని,ఒక్క డెలివరీ పూర్తి చేసి వెంటనే వెళ్లిపోతానని ట్రాఫిక్ పోలీసులను వేడుకున్నప్పటికీ కనికరించలేదని బాధితుడు వాపోయినట్లు సమాచారం.


మారిషస్లో తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మారిషస్లో తరతరాలుగా కొనసాగుతున్న తెలుగు వారసత్వాన్ని కాపాడటంతో పాటు భాషా బోధన, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు సంస్థలకు మద్దతు వంటి అంశాల్లో సహకారం అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మారిషస్లో తెలుగు ఒక వారసత్వ భాషగా కొనసాగుతోంది. అక్కడి తెలుగు సమాజం భాషను ప్రధానంగా విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల ద్వారా కొనసాగిస్తోంది.

హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ కిడ్నీ మార్పిడి వైద్యంలో కీలక మైలురాయిని సాధించింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు ఆసుపత్రి వెల్లడించింది. ఇందులో ABO-incompatible ట్రాన్స్ప్లాంట్లు, వృద్ధ రోగులకు చేసిన కిడ్నీ మార్పిడులు, వృద్ధ జీవించి ఉన్న దాతల నుంచి కిడ్నీ సేకరణ వంటి క్లిష్టమైన కేసులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ‘కిడ్నీ సింపోజియం 2026’ నిర్వహించి ఆధునిక చికిత్సా విధానాలు, ట్రాన్స్ప్లాంట్ అనంతర సంరక్షణ, అవయవదానంపై నిపుణులు చర్చించారు.

ఇంటికో పండ్ల మొక్క..ఆరోగ్యానికి బంగారు బాట-వనమహోత్సవ పురోగతి సమీక్షలో మంత్రి సీతక్క మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, పచ్చని రాష్ట్రంతో పాటు ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన వనమహోత్సవ పురోగతిపై ఆదివారం సమీక్షించారు. కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి జిల్లాల వారీగా మొక్కలు నాటడం, ఇంటి ఆవరణల్లో మొక్కల పంపిణీ, గుంతల తవ్వకం, మొక్కల మనుగడపై ఈ సమీక్షలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది శాఖ పరిధిలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.61 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీంతో లక్ష్యంలో 91 శాతం మేర మొక్కల నాటడం పూర్తయిందని తెలిపారు. గుంతల తవ్వకంలో కూడా 92 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. జిల్లాల పనితీరును సమీక్షించిన మంత్రి సీతక్క, నిర్దేశించిన లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న చొరవపై సంతృప్తి

తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా ఏర్పాట్లు ఉండాలిపుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు కేటాయించడం హర్షణీయం : కార్యాలయ ప్రారంభించిన అనంతరం సమీక్షలో మంత్రి కొండా సురేఖ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి పుష్కరాలు- 2027 నిర్వహణకు సంబంధించి ప్రజాభవన్లో ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రాంభోత్సవానికి విచ్చేసిన మంత్రిని అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణతో సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయంలోని సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. కార్యాలయంలోని అన్ని సెక్షన్లను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయం వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరా


న్యూఢిల్లీ: వైవిధ్యంలో ఏకత్వం భారత్ డీఎన్ఏలోనే ఉందంటూ అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. మాటల కంటే చేతలే ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ.. ఈ అంశంపై భగవత్ విదేశాల్లో మాట్లాడిన తీరుకు, స్వదేశంలో ఆయన మౌనం వహిస్తున్న తీరుకు పొంతన లేదని అన్నారు.శనివారం న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లోని ఇన్ఫోసిస్ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, వివిధ మతాల నాయకులను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. వైవిధ్యాన్ని గౌరవించాలని, దాన్ని ఆమోదించి వేడుక జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైవిధ్యంలో ఏకత్వం భారత్ అస్తిత్వంలోనే భాగమని పేర్కొన్నారు. భగవత్ ప్రసంగంపై స్పందించిన సిబల్ ‘ఎక్స్’లో.. ‘న్యూయార్క్లో భగవత్: వైవిధ్యం మన సహజమైన ఏకత్వానికి అలంకారం. దాన్ని కాపాడుకోవాలి. విదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనం. మాటలకు ప్రాధాన్యం లేదు.. చేతలే మాట్లాడాలి!’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భగవత్ చేసిన వ్యాఖ్యలు గొప్ప మాటలుగా ఉన్నప్పటికీ.. దేశంలో మాత్రం ఈ అంశంపై మౌనం కనిపిస్తోందని అన్నారు. అమెరికన్ హిందూస్ ఫర్

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమై.. యువతకు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తిని మాత్రమే కబళించదని, మొత్తం కుటుంబం, సమాజం దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి చెందిన భారత్ కోసం మాదకద్రవ్య రహిత యువత’ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందన్నారు. దీని లక్ష్యం స్పష్టంగా ఉందని, ‘మాదకద్రవ్యాలకు దూరంగా యువత.. మాదకద్రవ్య రహిత భారత్’ సాధించడమే ఉద్దేశమని చెప్పారు.ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా.. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ‘భారత యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మనందరి ఉమ్మడి సంకల్పం. దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఈ మంచి లక్ష్యంలో మనమంతా మన వంతు పాత్ర పోషిద్దాం’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తినే ప్రభావితం చేయదని, దాని పర్యవసానాలను మ

టెహ్రాన్: తమకు అసలైన శత్రువుగా భావిస్తున్న శక్తులపై వ్యతిరేకంగా ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముస్లింల మధ్య విభేదాలు వారి ప్రత్యర్థుల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆయన హెచ్చరించారు. పాలస్తీనియన్ల దుస్థితికి, పశ్చిమాసియాలో నెలకొన్న విసృ్తత ఉద్రిక్తతలకు ప్రాంతీయ అనైక్యతే కారణమని ఆయన పేర్కొన్నారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఖమేనీ తన టెలిగ్రామ్ ఖాతాలో ఈ సందేశాన్ని రాతపూర్వకంగా విడుదల చేశారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని, వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ఒకరికొకరు రక్షణగా నిలవాలని ఆయన కోరారు. ముస్లింల మధ్య తెలిసో తెలియకో విభేదాలు సృష్టించే ఎవరైనా ఇస్లాం శత్రువులకు సహకరిస్తున్నట్లేనని అన్నారు. ముస్లింలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంతగా ‘నిస్సహాయ స్థితిలో’ ఉండేవారా అని కూడా ఖమేనీ ప్రశ్నించారు. గల్ఫ్ అరబ్ దేశాల పాలకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాలు ‘ఇస్లాం జెండా కింద ఐక్యంగా’ ఉండి ఉంటే, ‘గుర్తింపు లేని దుండగులు’ తమ భూభాగాలు,

68.5 టన్నుల సహాయ సామాగ్రి.. బేలీ వంతెనలు, సొరంగాల నిపుణుల బృందాలు కాఠ్మండు: వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్కు భారత్ 68.5 టన్నుల సహాయ సామగ్రిని అందించడంతోపాటు, గాలింపు, సహాయక చర్యలకు తోడ్పడేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, అవసరమైన పరికరాలను పంపినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్న నేపథ్యంలో.. గాలింపు, సహాయక చర్యల కోసం సొరంగాల నిపుణులతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని, అవసరమైన పరికరాలను భారత్ పంపినట్లు కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 11 టన్నుల సహాయ సామగ్రితో నాలుగో విమానం ఆదివారం నేపాల్కు చేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో వెల్లడించింది. ఇందులో సొరంగాల్లో గాలింపు, సహాయక చర్యలకు అవసరమైన పరికరాలతో కూడిన సాంకేతిక బృందం, డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఉన్నట్లు తెలిపింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లు సహా పలు సహాయ సామగ్రిని కూడా పంపినట్లు పేర్కొంది. వైద్యులు,


తాష్కెంట్లో మోదీకి ఆత్మీయ స్వాగతం తాష్కెంట్: భారత్ ఉజ్బెకిస్థాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఆదివారం నిర్ణయించాయి. అలాగే 2030 నాటికి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారానికి అనుగుణంగా.. ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మోదీమిర్జియోయెవ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1 బిలియన్ డాలర్లకు పైగా ఉందని మోదీ తెలిపారు. 2030 నాటికి దీనిని ఏటా 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తన ప్




వారం రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలుతుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్మన తెలంగాణ/మోత్కూర్: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయడం లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మారి రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు కోటి 16 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఎ లో చేర్చి ప్రజలు రైతుల, ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే 22ఏ సమస్యపై మొదటగా తానే మాట్లాడానని, ఇప్పుడు దాంతో తలెత్తుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి తమ తప్పేం లేదన్నట్టుగా అధికారులపై తోసేస్తున్నారని తెలిపారు. జీవో 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యను సర్వ నాశనం చేసాడని, పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లోకి వెళ్లకుండా నిషేధం విధించారన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు పడుతున్న

మరిన్ని వాహనాలు రెవెన్యూ అధికారులు వదిలివేసినట్లు ఆరోపణలుకొన్ని గంటల్లో తిరిగి కొనసాగిన మట్టి తవ్వకాలు మన తెలంగాణ/కీసర: రాంపల్లిదాయరలో అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వే నంబరు 633లోని భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న మూడు లారీలు, ఒక ఎక్స్కవేటర్ యంత్రాన్ని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కాగా రాంపల్లిదాయర సర్వే నంబరు 633లో అక్రమంగా మట్టిని తరిస్తున్న మూడు లారీలను సీజ్ చేసినట్లు పేర్కొన్న రెవెన్యూ అధికారులు, మట్టి తవ్వకాలు సాగిస్తున్న కాంట్రాక్టర్కు చెందిన నాలుగు లారీలు, రెండు ఎక్స్కవేటర్లు, మూడు కంప్రైజర్ ట్రాక్టర్ను మాత్రం వదిలి వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణాకు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఎక్స్కవేటర్లను వినియోగించి సర్వే నంబరు 633లో తిరిగి యధేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తుండటం గమనార్హం.