9713 వార్తలు


నవతెలంగాణ-వర్ధన్నపేట:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59 జన్మదినం సందర్భంగా.. ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, సొసైటీ చైర్మన్ కౌడగాని రాజేష్ ఖన్నా పలువురు కాంగ్రెస్ మండల నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యం ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు […] The post ఇల్లందలో ఘనంగా టిపిసిసి రాష్ట్ర అధ్యక్షునిజన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ–అశ్వారావుపేట: మండలంలోని వినాయకపురం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు. ఎస్ఐ టీ.యయాతీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంఘటన స్థలం నుంచి మరికొందరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు […] The post పేకాట స్థావరంపై పోలీసుల దాడి appeared first on Navatelangana.

నవతెలంగాణ-అశ్వారావుపేట:ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మీడియా కో-ఆర్డినేటర్ మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాసానీ పద్మశేఖర్ గార్డెన్లో ఆదివారం మండల అధ్యక్షులు ఉస్మాన్ బాబా, కార్యదర్శి ఫంబి ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బండి కొమరయ్య హాజరై గ్రామీణ వైద్య మిత్రులు ప్రాథమిక వైద్య సేవలకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు.అధికంగా యాంటీబయాటిక్స్ వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ… పరిమిత స్థాయిలోనే […] The post ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో appeared first on Navatelangana.


ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ రసవత్తర పోరులో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోల్ కతాకు కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే.. కోల్ కతాకు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక, ఢిల్లీ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ ను నిష్క్రమించిన సంగతి తెలిసిందే.జట్ల వివరాలు:కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే(సి), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(w), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): అభిషేక్ పోరెల్, KL రాహుల్(w), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి


నవతెలంగాణ-అచ్చంపేట: నాగర్ కర్నూల జిల్లా బల్మూర్ మండల పరిధిలోని కొండనాగుల ఈస్ట్ బీట్ పవన కుంట ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. చెంచుగూడెం గ్రామానికి చెందిన నిమ్మల సాలమ్మ భర్త నిమ్మల రాములు మేకల కాపలాకు అడవికి వెళ్లారు. పిల్లలతో సంచరిస్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లేశం, ఫారెస్ట్ బీట్ […] The post మహిళపై ఎలుగుబంటి దాడి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని తత్తెహక్కలు నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. జాలర్ల సాయంతో 8మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 7మంది మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో నదిలో ఆల్చిప్పలు విరివిగా దొరుకుతాయి. దీంతో భత్కళ […] The post వేటకు నదిలో దిగి..ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి appeared first on Navatelangana.

మేడ్చల్: ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని యుపిలోని గాజియాబాద్కు చెందిన జయీద్ఖాన్గా గుర్తించారు. మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పని చేస్తున్న అతడు.. ఇన్స్టాగ్రామ్లో ఉగ్రవాద సంస్థలను ఫాలో అవుతున్నాడు. కొన్నాళ్లుగా ఉగ్ర ముఠాలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పాక్ ఐఎస్ఐలోనూ చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జయీద్ఖాన్ సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టి పట్టుకున్నారు. అతడి నుంచి నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నవతెలంగాణ–ఆలేరు రూరల్: అమెరికా,ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై కొనసాగిస్తున్న యుద్ధ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం భారతదేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని,వారి వంటింటి బడ్జెట్ను తలకిందులు చేస్తోందని సీపీఐ (ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆలేరులో నూతనంగా ఎన్నికైన సీపీఐ (ఎం) నాయకులు,మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన “అంతర్జాతీయ యుద్ధాలు – దేశీయ నిత్యావసరాల ధరలపై ప్రభావం” […] The post అమెరికా-ఇరాన్ యుద్ధంతో సామాన్యుడిపై మోయలేని భారం appeared first on Navatelangana.

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్య, చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన ఉదరి కిష్టయ్య, చౌటుప్పల్ పట్టణానికి చెందిన కేశవాచారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఈ సాయం అందించామని,రాజీవ్ ట్రస్ట్ […] The post రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బి.మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ […] The post ఘనంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా.. వర్ధన్ హాస్పిటల్లో డా.సృజిల్ బాబు తేడ్డు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమాజ సేవకు అంకితభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆరోగ్యవంతమైన […] The post వర్ధన్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం appeared first on Navatelangana.

నవతెలంగాణ-మిరుదొడ్డి: సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో పలు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన, వడ్ల రాజమణి,కుంట స్వామి, వడదెబ్బతో మరణించిన, పర్స రాజయ్య కుటుంబాలను, బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరామర్శించారు.ఆయా కుటుంబాలకు 50 కిలోల చొప్పున మొత్తం 150 కిలోల బియ్యన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు వారి కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనారు. The post పేద కుటుంబాలకు బహుజన మిత్రుల సాయం appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామ పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 585 మార్కులు సాధించిన రామ్ చరణ్ తేజను శాలువా పూలమాలతో సన్మానించినారు. ఈ సందర్భంగా విద్యార్థులందరు ఇలాంటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించి అంకాపూర్కు పేరు ప్రఖ్యాతలు తేవాలని పూర్వ విద్యార్థులు(1998-99) కోరారు. The post ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం appeared first on Navatelangana.

నవతెలంగాణ-వనపర్తివికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డి) వనపర్తి జిల్లా నూతన కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్పీఆర్డి వనపర్తి జిల్లా సదస్సు నిర్వహించుకోగా.. ఈ సదస్సుకు 10 మండలాల నుండి ఎన్పిఆర్డి సభ్యులు హాజరయ్యారు. వనపర్తి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా బి బంగారయ్య నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడం లక్ష్మి కార్యదర్శి మల్లెపు నరసింహ ఉపాధ్యక్షులు ఆంజనేయులు కోశాధికారి చెన్నయ్య మహిళా విభాగం కన్వీనర్ భాగ్యలక్ష్మి పార్వతమ్మ భాగ్యమ్మ నాగమ్మ నారాయణ చంద్రాయుడు […] The post NPRD వనపర్తి జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.బంగారయ్య appeared first on Navatelangana.

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వివిధ మండలాలకు సంబంధించిన గ్రామాల ఉపసర్పంచుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులుగా గంభీరావుపేట ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తంగళ్ళపల్లి మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు మందాటి రాము యాదవ్, వీర్నపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అజ్మీరా రామ్ […] The post ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం appeared first on Navatelangana.

నవతెలంగాణ–ఆలేరు రూరల్: మాదిగల ఆరాధ్య దైవంగా భావించే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు గ్రామస్థాయిలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కందుల నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వెల్లడించారు.గ్రామ కమిటీలలో సభ్యులుగా ఎంపికయ్యే వారు విద్యావంతులై ఉండటంతో […] The post గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మండల కేంద్రంలోతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు “శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరి వినోద్ జనరల్ సెక్రెటరీ గన్నా లక్ష్మణ్ మైనార్టీ మండల అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్ సీనియర్ నాయకులు జైడి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ […] The post జక్రాన్పల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆర్మూర్తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జంబి హనుమాన్ ఆలయం నందు ఆదివారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నారు. ఇ సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థాయికి […] The post జంబి హనుమాన్ ఆలయంలో టిపిసిసి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్బస్వపూర్ రిజర్వాయర్ లో తాము పుట్టిపెరిగిన ఊరు బిఎన్ తిమ్మాపురం గ్రామం ముంపునకు గురికావడం జీర్ణించుకోలేక తమ గ్రామ ప్రజల బాగు కోసం ఎంత దూరమైన వెళ్లి తన గ్రామ ప్రజల కొరకు న్యాయం చేయాలని ఆరాట పడుతూ, పరితపిస్తున్న భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, వారి కుమారుడు బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి లు చేస్తున్న పోరాటం చాలా అభినందనీయమని బిఎన్ తిమ్మాపురం నిర్వాసితులు అన్నారు.గతంలో ఎడ్ల […] The post గ్రామ ప్రజల కోసం తండ్రి తనయుల కృషి అభినందనీయం appeared first on Navatelangana.

నవతెలంగాణ-దర్పల్లి: మండలవ్యాప్తంగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను అపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆదేశాలతో మండల పార్టీ ముఖ్యనేతలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చేర్మెన్లు, డైరెక్టర్లు, సీనియర్ పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చి మండలకేంద్రములోని గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి తమ ప్రియతమ నాయకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. […] The post ఘనంగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.