24627 articles

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ నడుం బిగించారు. వచ్చే నెల 5, 6న 22ఏ సమస్యపై నిరసన దీక్ష నిర్వహించాలని, 7న ఫీజు రీ-యింబర్స్మెంట్పై ఇంది రా పార్కు వద్ద మహా ధర్నా చేయాలని నిర్ణయించారు. బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రా ష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసేందు కు శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో స మావేశమై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకుపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 5, 6న 22ఏ సమస్యపై ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టాలని, 7న ఫీజు రీ-యింబర్స్మెంట్పై ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా హాజరుకావాలని నిర్ణయించారు. ఫీజు రీ-యంబర్స్మెంట్ అంశంపై మహా ధర్నా నిర్వహణ బాధ్యతను బిజెవై

ఆ ఉప్పు నీటి చీకటి బావిఎన్ని కండేల లోతో అంతుతెల్వదు!లోతులోంచి పైకి లాగుతాననిఏదో అవకాశాల తాడును విసురుతుందిఒక మాయా చేయి!చీకట్లోకంటిని ఊరించే వెలుగులావెండితెర మీద జిగేల్ మనే జిందగీలా…ఆశల పూలగుత్తిలాఆ తాడు మెత్తగా చేతికి అందుతుంది !రంగు రంగుల కలలు కండ్లలో మెరిసే క్షణాలవి!ఆశలన్నీ గాలిలో వదిలిన బుడగల్లా,పిసరంత నిజాన్ని తాకకముందే పేలిపోతాయనీఎగరేసిన చేతులకేం తెలుసు!గగుర్పాటు కొండచిలువ ఒకటిఒళ్ళంతా చుట్టుకునేదాకా…ఏది తాడో, ఏది పామో నమ్మినఅమాయక ఆశలకేం తెలుసు!?మనసుఎడారిలో ఒంటరి ఒంటే అయినప్పుడు…వర్చువల్ ఒయాసిస్ ఒకటి,స్వచ్ఛ కొలనులో […] The post చీకటి బావి appeared first on Navatelangana.

జవహర్నగర్లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సుసోమశిలలో మరో ప్రపంచస్థాయి కేంద్రంపీపీపీ విధానంలో అభివృద్ధిపర్యాటకం, క్రీడల ప్రచారానికి కపిల్ సేవల వినియోగం : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా శామీర్పేట సమీపంలోని జవహర్నగర్లో 130 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్ […] The post గోల్ఫ్ టూరిజం హబ్గా తెలంగాణ appeared first on Navatelangana.

మేషంమేష రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవలసిన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ మిగులుతుంది. అధికమైన ఒత్తిడిని కోపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శని అంతగా అనుకూలంగా లేడు. రావలసిన ధనం లేటుగా చేతికి అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పన

బ్రిటన్కు చెందిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సమెదడులోని కణితి తొలగింపు ఆపరేషన్ వీడియోను ప్రత్యక్షంగా విశ్లేషించి వైద్యులకు సూచనలు చేసిన ఎఐ లండన్ : కృత్రిమ మేధ సాంకేతిక రంగంలోనే కాదు వైద్య రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సు సహాయంతో మెదడు శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగి విజయవంతంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్సలో భాగంగా రోగి మెదడులోని కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. బ్రిటన్లోని బెడ్ఫోర్డ్షైర్కు చెందిన రైస్ హిబర్ట్ (48)కు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స జరగకపోయి ఉంటే ఆయన చూపును కోల్పోయే ప్రమాదం ఉండేదని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఏఐ సాధనం ఆపరేషన్ వీడియోను ప్రత్యక్షంగా విశ్లేషించింది. మెదడులో కనిపించకుండా ఉన్న కీలకమైన రక్తనాళాలు, నరాలకు దెబ్బతగలకుండా ఉండేందుకు శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసింది. దీంతో కణితిలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని సురక్షితంగా తొలగించేందుకు వైద్యులకు వీలైంది. రోగి భద్రత పరంగా చూస్తే ఏఐ ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోంది. మన తల ల

Raidurgam has set another major real estate record. A 5.8-acre plot was sold for ₹1,447.22 crore, or ₹269 crore per acre, in the latest TGIIC auction. Combined with the previous 5.25-acre auction that fetched ₹1,386 crore, 10.63 acres have generated ₹2,833.22 crore for the government.

వాషింగ్టన్: వెనెజువెలాతో ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంతో వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనున్నట్టు ఆయన తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా ఈ ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ ఈ ఒప్పందం కోసం పనిచేశారని ట్రంప్ తెలిపారు. ప్రైవేటురంగ భాగస్వామ్యం ద్వారా ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంతో అమెరికా చమురు నిల్వలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంలో ఏయే చమురు క్షేతాలు ఉన్నాయి, అమెరికా నియంత్రణ ఏరూపంలో ఉంటుంది, ఏ ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయనే వివరాలను అమెరికా ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ ఒప్పందం ద్వారా వెనిజువెలాలో 100 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని, అమెరికాలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని రూబియా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ఈ ఒప్పందంపై వెనెజువెలా

మన తెలంగాణ/ధర్మపురిః రానున్న గోదావరి పుష్కరాలు ఇంతకు ముందెన్నడు కనివిని ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీ ఉగ్రలక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం పునర్ నిర్మాణంపై ఆలయ ప్రాంగనంలో ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాక కమిషనర్ హనుమంత రావు, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, జగిత్యాల జిల్లా అధనపు కలెక్టర్ రాజ గౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొని సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉ ందని అన్నారు.అందులో భాగంగా బాసర నుండి భద్రాచలం వ రకు ఉన్న ఆలయాల అభివృద్దికి అవసరమైనన్ని నిధులు కెటాయిస్తున్నారని తెలిపారు. బాసర, కాళేశ్వరం, భద్రాచలంతో సమానంగా ధర్మపురి క్షేత్రానికి నిధులు కెటాయించడం జరిగిందన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధర్మపురిలోని ఉగ్ర నరసింహ స్వా మి ఆలయాన్ని పునర్


Telangana Minister Konda Surekha tied a Rakhi to Chief Minister Revanth Reddy at his residence on Raksha Bandhan. The meeting took place amid an ongoing disciplinary controversy within the Telangana Congress. While the interaction appeared cordial, the issue involving disciplinary action against Surekha has not been officially resolved and remains with the Congress high command.


తాష్కెంట్: ఉజ్బెకిస్థాన్లో రెండ్రోజుల అధికార పర్యటన నిమిత్తం బయలుదేరిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవత్క్ మిర్జియోయెవ్ స్వయంగా విమానాశ్రయానిక వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ పర్యటన సాగుతోంది.

Telangana Skills University has entered into a partnership with a Japanese education and skills-training institute to strengthen industry-oriented training for students. The collaboration is expected to focus on Japanese language proficiency, technical and vocational skills, workplace culture and job readiness for opportunities in Japan. The initiative could help connect Telangana's young workforce with Japan's growing demand for skilled professionals across sectors.


కింగ్ నాగార్జున మైల్స్టోన్ 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్ఫుల్ టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్ ఓవర్తో ప్రారంభమయ్యే గ్లింప్స్లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నాగార్జున మైల్స్టోన్ 100వ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్ పర్ఫెక్ట్గా ఉంది. నాగార్జునను అత్యంత స్టైలిష్, డైనమిక్ అవతార్లో చూపించారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ప్రభావాన్ని మరింత పెంచింది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కింగ్ 100’ చిత్రం క్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల హల్ద్వానీలో పాల్గొన్న ర్యాలీ ప్రదేశంలో నిర్వహించిన ‘శుద్ధీకరణ’ కార్యక్రమంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన ఒక నేరమని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించాలని డిమాండ్ చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, క్యాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఈ ఘటన బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. దళితులు అభివృద్ధి చెందడం, గౌరవంగా జీవించడం, విజయాలు సాధించడం వారికి ఇష్టం లేదని ఆరోపించారు. ‘ఉత్తరాఖండ్లో జరిగిన ఘటనకు కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయండి. ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు.



రెండు ఇళ్ల మధ్య ఉన్న వేపచెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం చివరికి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన గొడవలో గొడ్డలి దాడితో ఇద్దరు మృతిచెందారు. ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన భూక్యా పెదబాబు, అతని తమ్ముడు భూక్యా రాము ఇంటి పక్కన ఉన్న వేపచెట్టును కొంతకాలంగా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని అమరబోయిన వెంకటేశ్వర్లు గుర్తించాడు. దీంతో చెట్టును తొలగించే ప్రయత్నంలో భాగంగా వెంకటేశ్వర్లు చెట్టును కొడుతున్న సమయంలో భూక్యా రాము, పెదబాబు అతనిపై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పెదబాబు, రాము తండ్రి భూక్యా సైదాపైనా పెదబాబు గొడ్డలి, కర్రతో దాడి చేసినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన సైదాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతికి కారణమైన అన్నదమ్ములపై దాడి చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్థులను అదుపుచేసే క్రమంలో ఎస్ఐ నవీన్కుమార్కు తలకు

దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను నెలకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 33 నెలలుగా పింఛన్లో ఒక్క రూపాయి కూడా పెంచకపోవడంతో హామీ మేరకు లెక్కిస్తే ఒక్కో దివ్యాంగుడికి రూ.1.98 లక్షలు బకాయి పడినట్లవుతుందన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల పింఛన్ను రూ.516 నుంచి రూ.4,016కు పెంచామని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవా? లేక దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి లేదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్సిటీ, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 33 నెలల్లో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. దివ్యాంగుల సమస్యలను సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్ల

మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్డి సుమంత్ను అరెస్ట్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, చెక్పోస్ట్ సమీపంలోని ఒక డెన్లో కొండా సురేఖ మాజీ ఒఎస్డి సుమంత్ తన అనుచరులతో కలిసి బాధితుడు హరికృష్ణపై రాడ్లతో దారుణంగా దాడి చేశారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే, దాదాపు 20 రోజుల పాటు కేసు నమోదు కాకుండా అడ్డుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక సిఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తీవ్ర ఆరోపనలు చేశారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో దాడి జరిగితే సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో కేసు నమోదు కావడం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంత వరకుసుమంత్పై కేసు నమోదు కాకుండా తొక్కిపెట్టారని పేర్కొన్నారు. కేసు నమోదైనా ఇప్పటి వరకు సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. పైగా కేవలం మూడు వారాల క్రితమే బాధ్యతలు స్వీకరించిన జూబ్లీహిల్స

హైదరాబాద్: కొత్త కారు కొన్న ఓ కుటుంబంలో సంతోషం కొద్ది సేపు కూడా ఉండకుండానే విషాదంగా మారింది. పూజ పూర్తి కాగానే కారును ముందుకు తీయడంతో దాని కిందపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్కు చెందిన సాయికుమార్ కొత్త కారు కొన్నాడు. సాయికుమార్ మేనమామ ఎపి రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ, తుమ్ములపల్లికి చెందిన రామచంద్రరావు(70) భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలోనే మేనల్లుడు కారు పూజ చేయించాలని వారిని తీసుకుని శుక్రవారం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడికి తీసుకుని వచ్చాడు. గుడి వద్ద అర్చకులు కొత్త కారుకు పూజ చేశారు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కారు కొద్దిగా ముందుకు కదపాలని పూజారీ సూచించడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అయితే బ్రేక్కు బదులుగా ఎక్సలేటర్పై కాలు గట్టిగా వేయడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. అప్పటికే కారు ముందు భాగంలో ఉన్న రామచంద్రరావు గట్టిగా ఢీకొట్టడంతో ఎగిరి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడ
