24639 articles

Telangana Skills University has entered into a partnership with a Japanese education and skills-training institute to strengthen industry-oriented training for students. The collaboration is expected to focus on Japanese language proficiency, technical and vocational skills, workplace culture and job readiness for opportunities in Japan. The initiative could help connect Telangana's young workforce with Japan's growing demand for skilled professionals across sectors.


కింగ్ నాగార్జున మైల్స్టోన్ 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్ఫుల్ టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్ ఓవర్తో ప్రారంభమయ్యే గ్లింప్స్లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నాగార్జున మైల్స్టోన్ 100వ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్ పర్ఫెక్ట్గా ఉంది. నాగార్జునను అత్యంత స్టైలిష్, డైనమిక్ అవతార్లో చూపించారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ప్రభావాన్ని మరింత పెంచింది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కింగ్ 100’ చిత్రం క్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల హల్ద్వానీలో పాల్గొన్న ర్యాలీ ప్రదేశంలో నిర్వహించిన ‘శుద్ధీకరణ’ కార్యక్రమంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన ఒక నేరమని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించాలని డిమాండ్ చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, క్యాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఈ ఘటన బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. దళితులు అభివృద్ధి చెందడం, గౌరవంగా జీవించడం, విజయాలు సాధించడం వారికి ఇష్టం లేదని ఆరోపించారు. ‘ఉత్తరాఖండ్లో జరిగిన ఘటనకు కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయండి. ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు.



రెండు ఇళ్ల మధ్య ఉన్న వేపచెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం చివరికి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన గొడవలో గొడ్డలి దాడితో ఇద్దరు మృతిచెందారు. ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన భూక్యా పెదబాబు, అతని తమ్ముడు భూక్యా రాము ఇంటి పక్కన ఉన్న వేపచెట్టును కొంతకాలంగా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని అమరబోయిన వెంకటేశ్వర్లు గుర్తించాడు. దీంతో చెట్టును తొలగించే ప్రయత్నంలో భాగంగా వెంకటేశ్వర్లు చెట్టును కొడుతున్న సమయంలో భూక్యా రాము, పెదబాబు అతనిపై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పెదబాబు, రాము తండ్రి భూక్యా సైదాపైనా పెదబాబు గొడ్డలి, కర్రతో దాడి చేసినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన సైదాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతికి కారణమైన అన్నదమ్ములపై దాడి చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్థులను అదుపుచేసే క్రమంలో ఎస్ఐ నవీన్కుమార్కు తలకు

దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను నెలకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 33 నెలలుగా పింఛన్లో ఒక్క రూపాయి కూడా పెంచకపోవడంతో హామీ మేరకు లెక్కిస్తే ఒక్కో దివ్యాంగుడికి రూ.1.98 లక్షలు బకాయి పడినట్లవుతుందన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల పింఛన్ను రూ.516 నుంచి రూ.4,016కు పెంచామని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవా? లేక దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి లేదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్సిటీ, ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 33 నెలల్లో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. దివ్యాంగుల సమస్యలను సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్ల

మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్డి సుమంత్ను అరెస్ట్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, చెక్పోస్ట్ సమీపంలోని ఒక డెన్లో కొండా సురేఖ మాజీ ఒఎస్డి సుమంత్ తన అనుచరులతో కలిసి బాధితుడు హరికృష్ణపై రాడ్లతో దారుణంగా దాడి చేశారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే, దాదాపు 20 రోజుల పాటు కేసు నమోదు కాకుండా అడ్డుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక సిఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తీవ్ర ఆరోపనలు చేశారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో దాడి జరిగితే సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో కేసు నమోదు కావడం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంత వరకుసుమంత్పై కేసు నమోదు కాకుండా తొక్కిపెట్టారని పేర్కొన్నారు. కేసు నమోదైనా ఇప్పటి వరకు సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. పైగా కేవలం మూడు వారాల క్రితమే బాధ్యతలు స్వీకరించిన జూబ్లీహిల్స

హైదరాబాద్: కొత్త కారు కొన్న ఓ కుటుంబంలో సంతోషం కొద్ది సేపు కూడా ఉండకుండానే విషాదంగా మారింది. పూజ పూర్తి కాగానే కారును ముందుకు తీయడంతో దాని కిందపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్కు చెందిన సాయికుమార్ కొత్త కారు కొన్నాడు. సాయికుమార్ మేనమామ ఎపి రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ, తుమ్ములపల్లికి చెందిన రామచంద్రరావు(70) భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలోనే మేనల్లుడు కారు పూజ చేయించాలని వారిని తీసుకుని శుక్రవారం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడికి తీసుకుని వచ్చాడు. గుడి వద్ద అర్చకులు కొత్త కారుకు పూజ చేశారు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కారు కొద్దిగా ముందుకు కదపాలని పూజారీ సూచించడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అయితే బ్రేక్కు బదులుగా ఎక్సలేటర్పై కాలు గట్టిగా వేయడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. అప్పటికే కారు ముందు భాగంలో ఉన్న రామచంద్రరావు గట్టిగా ఢీకొట్టడంతో ఎగిరి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడ


ఘటనపై పోలీసుల ఆరా మనతెలంగాణ / సిటిబ్యూరోః మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అత్యాచారం చేశాడన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్గా పరిగణించిన ఎంఐఎం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై వేటు విధించడం నగరంలో సంచలనం సృష్టించింది. అయితే బాలికపై లైంగిక వేధింపులతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారన్న వార్తలు కలకలం రేపుతున్నా... సస్పెన్షన్కు సరైన కారణాలను పార్టీ వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్లో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు సదరు ఎమ్మెల్సీని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. ఈ విషయం నగరంలో పెను సంచలనం సృష్టించడంతో ఎంఐఎం పార్టీ అధిష్టానం అప్రమత్తం అయింది. పరిస్థితి చేయిదాటకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఎంఐఎం అధిష్టానం ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశించి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విశేషం. ఓ ఎమ్మెల్సీ ఎంతటి దారుణానికి పాల్పడినా బాధితులెవరు ముందుకు రాకపోవడం, కేసు నమోదు కాకపోవడం మరో విశేషం. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు

ఒంటరి మహిళపై సమూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల కథనం ప్రకారం.. వాంబే కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి స్థానికంగా జులాయిగా తిరిగే ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం మహిళా ఎంతసేపటికీ స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారు ఆమెను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నున్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపారు.

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు నెం. 07227గుంటూరు - వికారాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 30న ఆదివారం రాత్రి 9.45 గంటలకు గుంటూరు నుండి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. రైలు నెం. 07228 వికారాబాద్ గుంటూరు ప్రత్యేక రైలు ఈ నెల 31న సోమవారం రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుండి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు (మరుసటి గుంటూరు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2 ఎ, 3 ఎ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.పిడుగురాళ్లలో ప్రయోగాత్మక హాల్ట్ విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ఒక నిమిషం ప్రయోగాత్మక స్టాపేజీ కల్పించారు. ఈ స్టాపేజీ సెప్టెంబర్ 4 నుండి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. రైలు నెం. 12795 విజయవాడ - లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి సాయంత్రం 5.30 గంట

మన తెలంగాణ/హైదరాబాద్ః వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, కౌన్సిల్ కార్యదర్శి వి. నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. 7న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన బిఏసి సమావేశమై సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంతో పాటు అజెండానూ ఖరారు చేస్తారు.



చిన్న నీటిపారుదల రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు, చెరువుల పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రభుత్వానికి రైతు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పేర్కొంది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కమిషన్ తెలిపింది. చెరువుల పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నీటి భద్రతతో పాటు వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ అభిప్రాయపడింది

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ (జీఎస్ హెచ్) హాస్టల్లో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఉదయం టిఫిన్గా బజ్జీలు తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, విరేచనాల లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు హాస్టల్లోనే విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొందరు విద్యార్థులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలోని బుచ్ జిల్లాపై రష్యా జరిపిన దాడిలో కనీసం 37 మంది మృతి చెందినట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. ఈ దాడిలో కనీసం 50 నివాస భవనాలు దెబ్బతిన్నాయని, భారీగా మంటలు చెలరేగి ఇళ్లు, ఓ రెస్టారెంట్కు వ్యాపించాయని స్థానిక ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి టిముర్ త్కాచెంకో తెలిపారు. శుక్రవరాం రాత్రి 8 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు అధికారులు చెబుతున్నరు. దాడి ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, అనంతరం అక్కడ భారీ పేలుడు చోటుచేసుకుందని చెప్పారు. గోదాము గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ ఇళ్లు, ఇతర నివాస ప్రాంతాలకు సమీపంలో మందుగుండు సామగ్రిని నిల్వ చేయకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నట్టు చెప్పారు. రష్యా దాడిలో వృద్ధులు, వికలాంగుల కోసం నిర్వహిస్తున్న సంరక్షణ కేంద్రం, నివాస భవనాలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు.కాగా, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై మాట్లాడుతూ, మైలా ప్రాంతంలోని గోదాములు దీర్ఘశ్రేణి డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు,

