9976 వార్తలు

సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టిజిఎస్ ఆర్టిసి మే 21గురువారం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ స్పెషల్ బస్సు సర్వీసులు జూన్ 1 వరకు నడుపుతున్నట్లు సంస్థ ఎండి వై. నాగిరెడ్డి తెలిపారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా వారి ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. హైదరాబాద్, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుంచి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సుల వేళలు, ఇతర వివరాల కోసం సంబంధిత డిపోలను సంప్రదించవచ్చని తెలిపారు. నర్సంపేట: 9959226293, తొర్రూరు: 9959226053, భూపాలపల్లి: 9959226707, మణుగూరు: 9959225963, కరీంనగర్: 9959225920, మంథని: 9959225923, హన్మకొండ: 9959226049, మహబూబాబా



మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ’వాల్తేర్ వీరయ్య’ సంచలనాత్మక మాస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్ట్ ‘చిరుబాబీ2’, ‘చిరు158’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత వెంకట్ కె నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన తర్వాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటికే వరుస అప్డేట్స్తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం గురువారం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్


కరీంనగర్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసిఎఫ్) కింద రూ.840 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మోడల్ రోడ్లు, స్కైవాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ అభివృద్ధికి రూ.630 కోట్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్రం గురువారం ప్రకటించింది. డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నీటి నివారణ చర్యలకు రూ.130 కోట్లు ఆమోదం తెలిపింది. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.80 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా ఆమోద లేఖ పంపారు.




నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 229పరుగులు చేసింది. జీటీ బ్యాటర్లు గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన గుజరాత్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఏడు ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులతో సాయి సుదర్శన్ భారీ స్కోర్కు బాటలు వేశాడు. సుభమన్ గిల్ 64 పరుగులతో అమూలమైన ఇన్నింగ్స్ ఆడాడు. […] The post గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అర్ధ సెంచరీ..సీఎస్కే టార్గెట్ ఎంతంటే..? appeared first on Navatelangana.




భారతీయులకు అసలైన మామిడి రుచిని అందిస్తున్న మాజా® 50 వసంతాలను కోకా-కోలా ఇండియా వేడుక చేసుకుంటోంది. 1976లో ప్రారంభమైనప్పటి నుండి మాజా®, అద్భుతమైన రుచి, చిన్ననాటి జ్ఞాపకాలు, పూర్తిగా భారతీయత ఉట్టిపడే క్షణాల బలమైన వారసత్వంతో, మామిడి పండ్లపై భారతీ యులకున్న ప్రేమతో తనను తాను గాఢంగా ముడివేసుకుంది. ఐదు దశాబ్దాలుగా, వేసవి కాలపు మధ్యాహ్నాలు, కుటుంబ వేడుకలు మొదలుకొని నుండి చిన్న చిన్న రోజు వారీ ఆనందాల వరకు… తరాల పొడుగునా మాజా® ఒక సుపరిచితమైన […] The post 50 ఏండ్ల మాజా appeared first on Navatelangana.

నవతెలంగాణ హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్లో “ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడం” అనే అంశంపై ఒక సదస్సు జరిగింది. భారతదేశ రిటైల్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న రెండు ప్రధాన ముప్పులైన ‘పెరుగుతున్న అక్రమ వాణిజ్యం’, ‘అనైతిక మార్కెట్ విధానాలు’ అనే అంశాలపై చర్చించేందుకు రిటైలర్లు, వ్యాపార సంఘాలు, విధాన నిర్ణేతలు ఈ సదస్సులో ఒకే వేదికపైకి వచ్చారు. మార్కెట్లలో నకిలీ ఉత్పత్తులు, […] The post ఆన్లైన్ రిటైల్ వ్యవస్థలో పెరుగుతున్న అక్రమ వాణిజ్యం, మార్కెట్ అసమతుల్యతపై ఎఫ్ఆర్ఏఐ ఆందోళన appeared first on Navatelangana.

నవతెలంగాణ హైదరాబాద్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY; దీని అనుబంధ సంస్థలతో కలిపి ‘డాక్టర్ రెడ్డీస్’ గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన ‘సెమాగ్లుటైడ్ బయోసిమిలర్’ ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా®’ (Obeda®) బ్రాండ్ […] The post సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ‘ఒబెడా®’ను ఆవిష్కరించిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ appeared first on Navatelangana.


నవతెలంగాణ – వర్ధన్నపేటకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ వర్ధన్నపేట బస్టాండ్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఆదరణకు నోచుకోలేదు. వ్రత నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహాలను పక్కన పెట్టారు. అప్పటినుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ, తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలను పట్టించుకున్న పాపాన పోలేదు. గత పది సంవత్సరాలుగా […] The post ఆదరణకు నోచుకోను మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహం appeared first on Navatelangana.

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్లోని ఎగుమతిదారులు, అంతర్జాతీయ మార్కెట్లలోని వినియోగదారులను తమ ఉత్పత్తులతో చేరుకునేందుకు అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ను ఉపయోగించుకుంటూ, ఈ-కామర్స్ ఎగుమతుల ద్వారా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. కలప ఉత్పత్తులు, వస్త్రాలు, ఆభరణాలు, గృహ, వంటగది ఉత్పత్తులతో సహా బలమైన తయారీ రంగానికి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్, భారతదేశం నుంచి సరిహద్దుల మీదుగా జరిగే ఈ-కామర్స్కు కీలక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు తెలంగాణలో అమెజాన్ గ్లోబల్ […] The post అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్లోని హైదరాబాద్ ఎగుమతిదారులు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లోపించిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సీఐటీయు(సెంటర్ ఫర్ ట్రేడ్ యూనియన్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. 14 ఏండ్ల తర్వాత కనీస వేతనాలను సవరించడం అభినందనీయమని, ఈ పెంపుతో కోటి 11లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియజేసింది. కానీ పెంపు విషయంలో శాస్త్రీయత లోపించిందని, అశాస్త్రీయంగా వేతనాలను సవరించారని సీఐటీయు విమర్శించింది. వేతనాలను 4 క్యాటగీరీలుగా విభజించి అన్ని రంగాల్లో […] The post కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లోపించింది: CITU appeared first on Navatelangana.

– కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి నవతెలంగాణ – హలియా : అనుముల మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం హాలియాలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన భారతదేశానికి ఐటి రంగాన్ని పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి అదే విధంగా 18 సంవత్సరాలకే ఓటు […] The post 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన నేత రాజీవ్ గాంధీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్(53) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన ప్రకారం చంద్రమోహన్ గత కొన్ని సంవత్సరాల నుండి కరీంనగర్ లో సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు అని తెలిపారు. వృద్ధులైన చంద్రమోహన్ తల్లిదండ్రులు రాంపూర్ గ్రామంలో ఉండటంతో ఆయన సతీమణి గత మూడు రోజుల క్రితం రాంపూర్ కు వచ్చి వారి బాగోగులు చూసుకుంటున్నారు. కరీంనగర్లో […] The post గుండెపోటుతో వ్యక్తి మృతి… appeared first on Navatelangana.
