9770 వార్తలు


25న జరుగే బైక్ యాత్రను జయప్రదం చేయండినవతెలంగాణ- దామరగిద్దమండల పరిధిలోని కంసాన్పల్లి మత్తుగుండ్ల, సజనాపూర్ గ్రామాల్లో ఈ నెల 25న జరుగు బైక్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేసి ముమ్మార ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, సిసీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన గ్రామాల రోడ్ల దుస్థితి మారలేదని అన్నారు. కంసాన్పల్లి నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్న […] The post నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈమేరకు శనివారం హంగ్చుంగ్ ఎయిర్పోర్ట్లో దిగారు. షరీఫ్తో పాటు ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి సెనేటర్ ముహమ్మద్ ఇషాక్ దార్, ప్రణాళికా శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్, సమాచార-ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్, ఐటీ శాఖ మంత్రి షాజా ఫాతిమా ఖవాజా, ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి ఉన్నారు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. […] The post చైనాకు పాక్ ప్రధాని appeared first on Navatelangana.



అరకేజీ బంగారం రికవరీమహబూబ్నగర్ దొంగ అరెస్ట్నవతెలంగాణ – అమీన్పూర్ సైబరాబాద్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని […] The post అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.


నవతెలంగాణ-మర్రిగూడ బిజెపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వి బి జి రామ్ జి నూతన చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని మేటి చందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజు కూలి 600 […] The post వీబీజీ రాంజీ నూతన చట్టాన్ని రద్దు చేయాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (ఆర్ఎంఎస్)” కార్యక్రమం ముగింపు సభ శుక్రవారం మల్లాయిగూడెం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్. కె. శిరీష సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ అవసరాలకు […] The post మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.



నవతెలంగాణ – హైదరాబాద్ : అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్లో అఖిల్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. ‘మనోడు వస్తున్నాడు..’, ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ […] The post అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల appeared first on Navatelangana.

జనగామ: భార్య మరణం తట్టుకోలేక పూజారి, కుమారుడు కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బండలగూడెం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వరయూరు లక్ష్మీనరసింహ చార్యులు(54) అనే అర్చకుడు గత 20 ఏళ్లుగా పూజారిగా సేవలందిస్తున్నాడు. అదే గ్రామంలో తన భార్య శ్రీదేవి, మానసిక వికలాంగుడైన కుమారుడు పవనకుమారాచార్యులు(25)తో కలిసి ఉంటున్నాడు. గత నెల 16న భార్య శ్రీదేవి మరణించడంతో రోజు భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎప్పుడైనా తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి చనిపోతానని గ్రామస్థులతో చెప్పేవాడు. భార్య మరణం తట్టుకోలేక రెండు రోజుల క్రితం లక్ష్మీనరసింహ చార్యులు తన కుమారుడితో కలిసి ఆలయ కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం కోనేరులో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఫ్యూచరే తెలియదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చురకలంటించారు. తాము ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే హరీష్ రావుకు అసూయ అని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు పొంగులేటి రీకౌంటర్ ఇచ్చారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం ఫాంహౌస్ లు కట్టుకున్నారని, తెలంగాణ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని పొంగులేటి తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్లే ఆ పార్టీ భవిష్యత్తు ఖతం చేయాలని చూస్తున్నారని, ఫ్యూచర్ సిటీ భూములపై అక్కడ ఎవరికైనా ఒప్పందాలు చేశారా? అని ప్రశ్నించారు. ముందు హరీష్ రావు ఫ్యూచర్ కాపాడుకోవాలని, బిఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదని, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

లద్ధాక్: లద్ధాక్లోని లేహ్ పర్వత ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లతో ప్రయాణిస్తున్న చీతా హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికాధికారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మే 20న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం అనంతరం మిగిలిన ఇద్దరితో కలిసి మేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్పై ‘కొత్త దాడులు’ చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. The post గగనతలం మూసివేసిన ఇరాన్.. appeared first on Navatelangana.

భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సిఎం రేవంత్ కు పూజారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సిఎం దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన వేద పాఠశాల భవన నిర్మాణ సముదాయానికి భూమి పూజా చేయడంతో పాటు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధి, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంఎల్ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎంఎల్ఎ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎంఎల్ఎ మందుల సామేలు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.




నవతెలంగాణ – హైదరాబాద్ : లద్దాఖ్లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం లేహ్ పరిసర పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం అనంతరం వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనకు గల కారణాలపై ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. The post లద్దాఖ్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్..తృటిలో ప్రాణాపాయం appeared first on Navatelangana.

నవతెలంగాణ- నాచారం: నాచారం సర్కిల్ మల్లాపూర్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వీఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 233 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మరియు మధ్యతరగతి […] The post లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి appeared first on Navatelangana.