
భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సిఎం రేవంత్ కు పూజారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సిఎం దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శనివారం యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన వేద పాఠశాల భవన నిర్మాణ సముదాయానికి భూమి పూజా చేయడంతో పాటు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధి, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంఎల్ఎ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎంఎల్ఎ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎంఎల్ఎ మందుల సామేలు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.












