
1661 వార్తలు

సాధారణంగా వంట చేసే మగవారిపై లోకం జోకులు వేయడం మనం చూస్తుంటాం. కానీ వంట అనేది కేవలం ఆకలి తీర్చే ప్రక్రియ మాత్రమే కాదు.. అది ఒక గొప్ప విజయపథం కాగలదని నిరూపించారు ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా. అమృత్సర్లోని ఒక చిన్న వంటగదిలో తల్లి వెనుక తిరుగుతూ వంట నేర్చుకున్న ఆయన.. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా ‘టైమ్ 100- 2026’లో చోటు సంపాదించుకున్నారు.

ఇప్పటికే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్లను కూడా ఎన్టీయే విడుదల చేసింది. మరో పది రోజుల్లో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా ఒకే రోజు ఒకే సెషన్లో ఆఫ్లైన్ విధానంలో జరగనుంది. అయితే ఈ పరీక్ష జరిగిన తెల్లారే తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష జరగనుంది. నీట్ పరీక్ష ముగిసిన మరుసటి రోజే అంటే మే 4 నుంచి

Daily Horoscope in Telugu (April 19, 2026) మేషం నుంచి మీనం వరకు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఆదాయం బాగుండగా, వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో శుభవార్తలు లభిస్తాయి. మిథున రాశి వారికి పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కుటుంబ, ప్రేమ, విద్య, ఆరోగ్య రంగాల్లో రాశి వారీగా ఫలితాలు మారుతూ ఉండనున్నాయి.

Sunrisers Hyderabad vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ అందించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు దాతలను ఆశీర్వదించారు.

భారత్లో గోధుమలు అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యాలలో ఒకటి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సగానికి పైగా జనాభా ఆహారం కోసం గోధుమలపైనే ఆధారపడుతుంటారు. అయితే, రైతులు ఎంతో కష్టపడి పండించిన ఈ పంటను నిల్వ చేసేటప్పుడు తేమ పురుగుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. రసాయన పురుగుమందులు వాడటం ఆరోగ్యానికి హానికరం కాబట్టి, మన వంటింట్లో లభించే సాధారణ వస్తువులతోనే గోధుమలను పురుగులు పట్టకుండా నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.

దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోసెలతో కొబ్బరి చట్నీ లేని అల్పాహారాన్ని ఊహించుకోవడం కష్టం. అయితే కొందరు కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో దీనిని తినడానికి సంకోచిస్తుంటారు. కానీ వాస్తవానికి కొబ్బరిలో ఉండే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఇడ్లీ దోసె పిండి చాలా త్వరగా పులిసిపోతుంటుంది. పిండి అతిగా పులిసిపోవడం వల్ల రుచి మారడమే కాకుండా, అది ఆరోగ్యానికి కూడా హానికరం. ప్రతిరోజూ పిండిని రుబ్బడం సాధ్యం కాని వారు ఒకేసారి తయారు చేసుకున్న పిండిని వారం పొడవునా తాజాగా ఉంచుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మనం రకరకాల పండ్లను తింటుంటాం. అయితే బొప్పాయి పండు వేడి చేస్తుందని చాలామంది దీనిని వేసవిలో తినడానికి వెనుకాడతారు. కానీ వాస్తవానికి బొప్పాయిలో ఉండే అధిక నీటి శాతం పోషకాలు వేసవి తాపం నుండి మనల్ని రక్షించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి బొప్పాయి ఒక గొప్ప వరం.

కళ్యాణి ప్రియదర్శన్.. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి .

అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి తెలివైన పెట్టుబడి. ఒకేసారి కాకుండా, చిన్న మొత్తంతో ప్రారంభించి, ధరలు తగ్గినప్పుడు దశలవారీగా కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహం. ఇది సగటు కొనుగోలు ధరను తగ్గించి, మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి లాభం పొందడంలో సహాయపడుతుంది.

GHMC అధికారులు హైకోర్టు ఆదేశాలతో ఫుట్పాత్ల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. పాదచారులకు, ట్రాఫిక్కు ఆటంకంగా మారిన ఆక్రమణలను తొలగించారు. బడంగ్పేట సర్కిల్లో అత్యధికంగా 333 దుకాణాలు సహా మొత్తం 653 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నిరంతర డ్రైవ్తో ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గి, ప్రజల భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా సోనా వీకెండ్' సేల్ ప్రకటించింది. EVలపై రూ.50,000 వరకు డిస్కౌంట్లు, 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ, లక్కీ డ్రా బహుమతులు అందిస్తోంది. Ola S1 X, Roadster X మోడళ్లు కేవలం రూ.49,999 నుండి అందుబాటులో ఉన్నాయి.

మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైందన్నారు. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారని.. మహిళల కలలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

ఉరుకుల పరుగుల జీవితంలో పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన ఆరోగ్యం నిశ్శబ్దంగా క్షీణిస్తోంది. మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ ఆహారపు అలవాట్లు మనల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతాయి. ముఖ్యంగా మొలకెత్తిన గింజలు విత్తనాలలో ఉండే అద్భుతమైన పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, రక్తపోటు, మధుమేహం గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఈఎమ్ఐ కట్టలేదని అవిటివాడైన ఓ వ్యక్తి ఇంటిని సీజ్ చేశారు ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది. లోన్ వసూళ్ల పేరుతో ఓ వికలాంగుడిపై ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Telangana: ఆత్మహత్యలు పెరగడానికి కారణాలు అనేకం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో పోటీతత్వం, లాంగ్ అవర్స్ మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఒత్తిడికి చికిత్స లేకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మానసిక సమస్యలతో ఆత్మహత్యలు గణనీయంగా ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి..

ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న 27 మ్యాచ్లో పరుగుల సునామీ సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 15 బంతుల్లోనే అద్భుతమైన అర్ధ శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

PM Modi Addresses Nation Live Updates: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి మరియు ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రసంగానికి సంబంధించి మీడియా వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంశాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..


Budget-Friendly Summer Sleep Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలూ నిద్రపోవడానికి నరకం చూడాల్సిందే.. ఉదయ మంతా ఎండ వేడి, రాత్రంతంతా ఉక్కపోతా.. కంటి నిండా నిద్రపోవడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బులున్న వారైతే వేలు వేలు పెట్టి కూలర్స్, ఏసీలు కొంటారు. మరి సామన్యుల పరిస్థితి ఏంటి.. అలాంటి వారి కోసమే ఓ సరికొత్త ప్రాడక్ట్ గురించి చెప్పబోతున్నాం. ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్ మొత్తం హ్యాపీగా నిద్రపోవచ్చు.

ఎంతో శుభప్రదమైన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది. ఏప్రిల్ 19 ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు కొన్ని రకాల కలలు రావడం చాలా మంచిదంట. కాగా, ఈ రోజు ఎలాంటి కలలు వస్తే అదృష్టమూ ఇప్పుడు చూద్దాం.

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 'ఇంప్రూవ్మెంట్'కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ 'బెటర్మెంట్'కు అనుమతి ఇచ్చినట్లైంది..