24450 articles


శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎక్కువగా నోబాల్స్ వేశాడు. 2021 నుంచి ఇఫ్పటివకూ జడేజా దాదాపు 85 నోబాల్స్ వేయడం గమనార్హం. ఇక ఈ సిరీస్తో ఆరంగేట్రం చేసిన సారాంశ్ జైన్ కూడా కొన్ని నోబాల్స్ వేశాడు. .ఇదే విషయమై స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతలే మాట్లాడుతూ ‘టెస్టుల్లోనూ నో బాల్ వేస్తే ఫ్రీహిట్ ఇస్తే బాగుంటుంది’ అని అన్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఓ కీలక సూచన చేశారు. ఇలా పదే పదే నోబాల్స్ విసిరే బౌలర్లపై చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో బౌలింగ కోచ్ను కూడా బాధ్యుడిని చేయాలని అన్నారు. ‘‘ఇటీవల నో బాల్స్ను వేయడంపై చర్చ సాగుతోంది. ఇది అత్యంత కీలక విషయమని గుర్తించాలి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆటగాళ్లు కొన్నింటిని కంట్రోల్ చేయగలరు. బ్యాటర్ అయితే గార్డ్ను తీసుకోవడం.. అదే బౌలర్గా నో బాల్స్ వేయకుండా ఉండటం. ఇప్పుడున్న కాలంలో ప్రతి దానిని గణించడం జరుగుతుంది. అలాంటప్పుడు బౌలింగ్ క్రీజ్ను ఎందుకు దాటాలి. ఈ తప్పిదాలు క్షమించరానివి’’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు. ‘‘భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు. నో బాల్ వేసిన తర్వాత ఫ్రీ


న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎల్ఎన్జి ధరలు భారీగా పెరగడంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జిస్ ధరను కిలోకు రూ.3.89 పెంచింది. పశ్చిమాసియాలో మరోమారు నెలకొన్న సంక్షోభం, హోర్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా రవాణాకు అంతరాయాలు ఏర్పడటం వల్ల అంతర్జాతీయ ఎల్ఎన్జి ధరలు గణనీయంగా పెరిగాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన ఈ ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఢిల్లీలో సిఎన్జి ధర కిలోకు రూ.83.09 నుంచి రూ.86.98కు చేరింది. ఈ తాజా పెంపుతో ఈ ఏడాది ఢిల్లీలో సిఎన్జి ధర మొత్తం దాదాపు కిలోకు రూ.10 మేర పెరిగింది. మే రెండో వారంలో నాలుగు విడతల్లో మొత్తం రూ.6 పెంచడంతో ధర రూ.83.09కు చేరింది. తాజాగా మరో రూ.3.89 పెంచారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్లలో కూడా సిఎన్జి ధరలు పెరిగాయి. ప్రస్తుతం నోయిడా, ఘాజియాబాద్లో కిలో సిఎన్జి ధర రూ.95.59 కాగా, గురుగ్రామ్లో రూ.92.01గా ఉంది.

ఆమిదాలగొంది: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్నాయి. రహదారి పక్కనే ఆడుకుంటున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటడంతో అతడిని తప్పించబోయి కర్ణాటక ఆర్టిసి బస్సు.. స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్ల కాళ్లు విరగ్గా.. 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: దివ్యాంగులకు బ్యాటరీ వీల్ ఛైర్లు, వాహనాలు అందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి రూ.50 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిదులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు..అమలు చేశారా? అని ప్రశ్నించారు. పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బిఆర్ఎస్ చెప్పాలి? అని పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇంకా మిగిలిన వారికి కూడా సంక్షేమం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. దివ్యాంగ దంపతులు ఒకేచోట పనిచేసేలా సవరణలు చేశామని, 34 జివో తీసుకొచ్చి దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చామని తెలియజేశారు. అర్హత ఉన్న దివ్యాంగులందరికీ కొత్తగా పింఛన్లు ఇచ్చామని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నామని, పుట్టిన వెంటనే అంగవైకల్యం ఉంటే బాల్ భరోసా పథకం తీసుకొచ్చామని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.



అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ పై మాటల దాడి ఇప్పటికీ ఆగలేదని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరే అని కొనియాడారు. కావాలనే వ్యక్తిగతంగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారని, కొంతమంది వ్యక్తి హననం చేస్తుంటారని విమర్శించారు. వైసిపిని విమర్శించే విషయంలో పాత్రలు మాత్రమే మారుతున్నాయని, వారి వారి వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ నుంచి వెళ్లారని తెలియజేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసిపిపై విమర్శలు చేస్తున్నారని, అటెన్షన్ కోసమే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని, 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడలేదని, జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి అనడం దారుణం అని, సొ

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సొంత కారణాలతోనే విజయసాయిరెడ్డి వైసిపి నుంచి బయటకు వెళ్లారని.. పార్టీ వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని సజ్జల అన్నారు.విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.. 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి అనడం దారుణని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్గా మాట్లాడలేదని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసిపిపై విమర్శలు చేస్తున్నారని.. పబ్లిసిటీ కోసం సిఎం చంద్రబాబు చేసే ప్రయత్నాలను జగన్కు ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరేనని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.




అతి చిన్న వయసులోనే భారత జట్టులోకి అడగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం అతడు దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు. అంతేకాక ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అదేంటి వైభవ్ జట్టు వైస్ కెప్టెన్ కదా అనే అనుమానం రావొచ్చు. ఇందుకు కారణం లేకుండా పోలేదు. కెప్టెన్ ఇషాన్ కిషన్కి గాయం కావడంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. దంీతో ఆటోమేటిక్గా వైస్ కెప్టెన్నే కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. దీంతో సీనియర్లను ముందుండి నడిపించే అవకాశం వైభవ్కు దక్కింది. ఈస్ట్ జోన్లో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వర్, కుమార్ కుషాంగ్రా, అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లతో కెప్టెన్గా వ్యవహరింస్తున్నాడు.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామన్న సిఎం సువేందు ప్రకటించారు. గత ఏడాది కోల్కతాలోని యువ భారతి స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన సుమారు 33,000 మంది ఫుట్బాల్ అభిమానులకు రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుండి టిక్కెట్ డబ్బును తిరిగి చెల్లిస్తామని సువేందు తెలిపారు.హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా 'నబన్నా'లో జరిగిన ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో అధికారి మాట్లాడుతూ.. డిసెంబర్ 13, 2025న జరిగిన ఈ కార్యక్రమం కోసం రూ.4 వేలు, రూ.6 వేల ధరలతో టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు."మెస్సీకి భారీ అభిమానులు ఉన్నారు. వారు వేల రూపాయల పెట్టి టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఈ 33,000 మంది క్రీడాభిమానులు చెల్లించిన డబ్బును తిరిగి వారికి అందేలా చూడాలన్నది నా కోరిక. నేను ఇప్పటికే దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టాను. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నా


జ్యూరిచ్ (స్విట్జర్లాండ్): 'రేవ్' పార్టీ వద్ద గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగ గాయపడ్డారు. ఈ ఘటన స్విట్జర్లాండ్ ఉత్తర ప్రాంతంలోని ఆరౌ నగరంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పోలీసులు ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు, వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


అమరావతి: సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ ఎన్టిఆర్ భరోసా పింఛన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి మీడియాతో మాట్లాడుతూ..కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు, రూ.2.51 కోట్లు విడుదల జరుగుతుందని, భర్తను కోల్పోయిన అర్హులైన జీవిత భాగస్వాములకు సామాజిక భద్రతే లక్ష్యమని తెలియజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.



న్యూఢిల్లీ : ప్రభుత్వ సంస్థల్లో యాజమాన్య వాటాను తగ్గించుకుని నిధులుగా మలుచుకునే డిజిన్వెస్ట్మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) లక్ష్యాన్ని కేంద్రం 78 శాతం పూర్తి చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్, అస్సెట్ మోనెటైజేషన్ (ఆస్తుల నగదీకరణ) లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని బడ్జెట్లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.62,124 కోట్ల మూలధనాన్ని సేకరించింది. సేకరించిన మొత్తం నిధులలో రూ.55,757 కోట్లు 9 ప్రభుత్వ రంగ సంస్థల్లో (పిఎస్యు) మైనారిటీ వాటాల విక్రయం, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపిసిఎల్) వ్యూహాత్మక విక్రయం, ఎస్యుయుటిఐ నుండి వచ్చిన నిధుల ద్వారా లభించాయి. దీంతో పాటు ఇన్విట్స్ ద్వారా అస్సెట్ మోనెటైజేషన్తో మరో రూ.6,367 కోట్ల ఆదాయం సమకూరింది.ఎల్ఐసిదే అత్యధిక వాటా ఈ విక్రయాల ప్రక్రియలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఎల్ఐసిలోని 6.5 శాతం వాటాను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక్కసారిగా రూ.31,515