
ఆమిదాలగొంది: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్నాయి. రహదారి పక్కనే ఆడుకుంటున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటడంతో అతడిని తప్పించబోయి కర్ణాటక ఆర్టిసి బస్సు.. స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్ల కాళ్లు విరగ్గా.. 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











