24274 articles

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రయాణ, పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ 2026 సంవత్సరానికి గ్లోబల్ టూరిజం అవార్డు - అందుకుంది. నాణ్యమైన సేవలు, వినూత్న ఆలోచనలు, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం, పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శ్రీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ, ఈ అవార్డు తమ సంస్థకు లభించిన గర్వకారణమైన గుర్తింపని తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది నిరంతర కృషి, ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారులు చూపుతున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమన్నారు. భవిష్యత్తులో మరింత వినూత్నమైన సేవలు అందిస్తూ, ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 56 సంవత్సరాల దీర్ఘకాల ప్రయాణ రంగ అనుభవంతో సదరన్ ట్రావెల్స్ దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆలపాటి శ్రీకృష్ణ మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ***

నేటితో ముగియనున్న లాటరీ ప్రక్రియ మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ ప్రక్రియ మూడవరోజూ విజయవంతంగా ముగిసింది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మలక్ పేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన లాటరీని ఆయా నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్లు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1920 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. లాటరీలో ఇల్లు వచ్చిన అబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ సొంత ఇంటి కలలు నిజం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల సమక్షంలో, హౌసింగ్ బోర్డ్ అధికారులతో పాటు పోలీసు, రెవిన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ సాగింది. ఆదివారం వరకు 12 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తికాగా, సనత్ నగర్, మహేశ్వరం, మల్కాజి గిరి, కార్వాన్ నియోజకవర్గాల్లో సోమవారం లాటరీ ప్రక్రియ జరుగుతుందని హౌసింగ్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. దీంతో లాటరీ ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పరి

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబునవతెలంగాణ – మల్హర్ రావురైతు సంక్షేమంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మండలంలోని కొయ్యూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గతంలో ఐదు మండలాల కేంద్రంగా కాటారంలో మరమ్మతు కేంద్రం ఉండగా ట్రాన్స్ఫార్మర్ల మరమత్తులో కొంత జాప్యం జరగడం వల్ల రైతులకు వెనువెంటనే […] The post రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఎస్సి, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా పెన్షన్ల పెంపు ఆలస్యం అవుతోందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. బిఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల ప్రణాళికలో దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, మళ్లీ 2023 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు తామే రాజులం, తామే మంత్రులం, తమకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారని ఆయన తూర్పారపట్టారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్తో పాట

నవతెలంగాణ-నవాబ్ పేటమండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో మైసమ్మ బోనాల పండగను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామ దేవత అయిన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు గ్రామ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తలపై బోనం కలశాలను ఎత్తుకొని, నోట్లో వేపాకులతో శివసత్తులు అవతారం ఎత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.భక్తులు కోరికలు తీరాలని కోడిపుంజులతో మొక్కులు తీర్చుకున్నారు, పసుపు కుంకుమలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.డప్పు వాయిద్యాల నడుమ శివ సత్తుల నృత్యాలు […] The post అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ appeared first on Navatelangana.

టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు స్పందించారు. పార్టీలోని నాయకుల అసంతృప్తిపై మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. ఇక్కడ నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు.. అదే సమయంలో పార్టీ క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం” అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చామని, అయితే కొన్ని […] The post కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ వాస్తవమే appeared first on Navatelangana.

2,63,535 మంది అభ్యర్థులు హాజరు-రాజస్థాన్లోని జైపుర్లో రెండు కేంద్రాల్లో పరీక్ష వాయిదా విద్యుత్ అంతరాయం కారణంగా నిలిచిన పరీక్ష సెప్టెంబర్ 5న మ.3 గంటలకు తిరిగి పరీక్ష మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బిఇఎంఎస్) ఆధ్వర్యంలో నీట్ పిజి 2026 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 2,73,096 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,63,535 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, రాజస్థాన్లోని జైపుర్లో రెండు పరీక్ష కేంద్రాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. విద్యుత్ అంతరాయంతో పరీక్షలు సజావుగా జరగలేదని, తిరిగి సెప్టెంబర్ 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్బిఇఎంఎస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటలకు రీ టెస్ట్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. పరీక్షా కేంద్రం, సవరించిన అడ్మిట్ కార్డులతో సహా తదుపరి వివరాలు విడిగా తెలియజేస్తామని ప్రకటించాయి. రీ షెడ్యూల్ చేసిన పరీక్ష కేంద్రాల్లో దాదాపు 2,445 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, సహా పలు నగరాల్లోని విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యా

The Telangana Employees’ Joint Action Committee (JAC) has announced a fresh series of agitation programmes from September 1, demanding implementation of the pending Pay Revision Commission (PRC), release of Dearness Allowance (DA) dues and abolition of the Contributory Pension Scheme (CPS) in favour of the Old Pension Scheme (OPS). September 1 will be observed as ‘CPS Virodha Dinam’, with employees wearing black badges and holding protests outside government offices. A ‘Chalo Hyderabad – Employees’ Sankalpa Sabha’ will also be held at the Exhibition Grounds in Hyderabad on September 6.

డ్రైవర్ కు గాయాలు.ఫోటో లు.మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడ్తో మోత్కూరు నుండి తుంగతుర్తి దగ్గర ఉన్న అన్నారం గ్రామానికి వెళ్తున్న మినీ వ్యాన్ (TS07UK1810) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. స్థానికుల తెలిసిన వివరాల ప్రకారం... ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కుర్మిల్ల నరేష్కు గాయాలయ్యాయి. భువనగిరి రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో మట్టి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో వ్యాన్ ఒకవైపునకు వంగిపోవడం తో అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టి, పల్టీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ కురుమిళ్ళ నరేష్ను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్, పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన జ

ప్రయాణికుల రద్దీకి అదనపు కోచ్లు అవసరంకానీ.. ఆ కారణంతో జాప్యం తప్పేలాలేదు..! మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో రోడ్డు రవాణా పరిస్థితి నరకప్రాయంగా మారింది. ఎల్బీ నగర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. పది కిలోమీటర్ల ప్రయాణం సాగాలన్నా గంటల సమయం పడుతుండటంతో హైదరాబాదీలు విసుగెత్తిపోతున్నారు. ఆటోలు, ట్యాక్సీలలో వెళ్లినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గమ్యస్థానాలకు త్వరగా, ప్రశాంతంగా చేరేందుకు ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయంగా మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అదనపు బోగీలతో రద్దీని నియంత్రించేందుకు అధికారవర్గాలు అడుగులు వేస్తున్నా.. కాలతీతం తప్పడం లేదు. పెరుగుతున్న రద్దీ.. తప్పనిసరి అయిన బోగీల పెంపు నగరంలో 2007 నవంబర్ 28 నుంచి మెట్రో రైలు పరుగులు పెట్టింది. అప్పుడు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ మూడు బోగీలతో రైళ్లను ప్రారంభించింది. అప్పట్లో నగరంలో ప్రయాణికుల రద్దీ అంచనాలకు తగినట్టుగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రారంభంలో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య తక్

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్గా ప్రేక్షకులను అలరించారు నమిత. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తక్కువ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నమిత. కెరీర్ ఆరంభంలో వరుస సినిమాలతో తనకొచ్చిన పేరు, ప్రఖ్యాతుల కారణంగా అహంకారం తలకెక్కి నష్టపోయినట్లు అభిప్రాయపడ్డారు. వరుస విజయాలు, మీడియా ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా తన ప్రవర్తన అసాధారణంగా ఉండేదన్నారు. ‘‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో నాలో గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. ఈ విషయమై చాలా మంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాంటి వైఖరే అనుసరిస్తే, ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేదు’ అన్నారు. దీంతో నెమ్మదిగా నాలో మార్పు మొదలైంది. నా ప్రవర్తన కారణంగా సహనటులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్లు చాలా ఇబ్బంది పడ్డారట. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఈ విషయాన్ని నాకు చెప్పారు’’ అని నమిత చెప్పుకొచ్చారు.


నవతెలంగాణ-టేకుమట్లచిట్యాల సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎడ్లపల్లి సతీష్ ను ఆదివారం టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి క్రిష్ణారెడ్డి, సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ అందించే సేవలకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని సిఐ అన్నారు. కార్యక్రమంలో టేకుమట్ల మండల సర్పంచుల పోరం […] The post నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు appeared first on Navatelangana.

నవతెలంగాణ – అశ్వారావుపేటదమ్మపేట మండలం మొద్దులగూడెం ఎస్సీ కాలనీలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక మహిళలు ఆదివారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య విషయం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు సమస్యను […] The post మంచినీటి కోసం ధర్నా.. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.

– హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు, సార్గమ్మ పునఃప్రతిష్ఠా ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ, సార్గమ్మ పునఃప్రతిష్ఠా వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సమృద్ధిగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో […] The post మహమ్మదాపూర్ లో పోచమ్మ బోనాలు appeared first on Navatelangana.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డినవతెలంగాణ – తిమ్మాజిపేటరేపు తిమ్మాజిపేట మండలానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8:00 గంటలకు బుద్ధ సముద్రం గ్రామంలో నిర్వహించే పోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ, 10:00 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల […] The post రేపు మండలానికి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాక appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు పట్టణంలో ప్రజల సౌకర్యార్థం సుందరమైన పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. బస్టాండ్ వెనుక సుభాష్ నగర్ కాలనీలో ప్రభాకర్ హాస్పిటల్ వద్ద ఆదివారం మేరా యువభారత్ లో భాగంగా, యూత్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ.. ఆలేరు సమగ్ర అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. యువ చైతన్య కార్యక్రమాల గురించి మహేష్ వివరించారు. రిటైర్డ్ టీచర్ బి.బాలరాజు […] The post పట్టణంలో ఓపెన్ జిమ్, పార్కు ఏర్పాటు చేస్తాం appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ శ్రావణ మాస బోనాలు పురస్కరించుకొని, ఆలేరు పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా మహిళలు సామూహికంగా భక్తిశ్రద్ధలతో బోనాలు గ్రామదేవతలకు సమర్పించారు. ఈ మేరకు పోచమ్మ దేవాలయం, గడి మైసమ్మ, బొడ్రాయి, కొలను పాక రోడ్డు, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ దేవాలయాలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం అమ్మవారికి కుమ్మరి పూజారుల సమక్షంలో మొక్కులు చెల్లించి, నూతన వస్త్రాలు, నైవేద్యం సమర్పించారు. పట్టణం, గ్రామాలు ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని, కరువు కాటకాలు పారద్రోలాలని, […] The post గ్రామ దేవతలకు బోనాలు సమర్పణ appeared first on Navatelangana.

విశాఖపట్నం: రుషికొండ బీచ్లో అతి పెద్ద ప్రమాదం తప్పింది. అలల ఉధృతికి ఏడుగురు పర్యాటకులు గల్లంతు కాగా, వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి రక్షించారు. దాంతో ఆ ఏడుగురు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా సాలూరు, చత్తీస్గఢ్ నుంచి పర్యాటకులుగా గుర్తించారు.

త్వరలో శ్రీవారి విద్యాసేవ, ఇంజనీరింగ్ సేవ, రక్షణ సేవలుమన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాలుగా కేవలం వసతి, భోజన సేవలకే పరిమితమైన ‘శ్రీవారి సేవ’ పరిధిని విస్తరిస్తూ.. వృత్తి నిపుణులను కూడా భాగస్వామ్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. జూన్ 5న పైలట్ ప్రాజెక్టుగా ‘శ్రీవారి వైద్యసేవ’ను ప్రారంభించింది. స్విమ్స్, బర్డ్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, సెంట్రల్ హాస్పిటల్, అశ్విని ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రులు, గోశాలల్లో ఈ సేవలందించే అవకాశం కల్పించింది. ఇందులో స్పెషలిస్ట్ వైద్యులు కనీసం 3 రోజులు, ఎంబీబీఎస్ వైద్యులు 7 రోజుల సేవా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైద్యసేవ ప్రారంభమైన 83 రోజుల్లోనే 723 మంది వైద్యులు ఆన్లైన్లో నమోదు చేసుకోగా, టీటీడీ 586 దరఖాస్తులను ఆమోదించింది. ఇందులో భాగంగా ఇప్పటికే స్పెషలిస్టులు, ఎంబీబీఎస్, ఆయుర్వేద, పశువైద్యులు కలిపి 109 మంది వైద్యులు శ్రీవారికి సేవలు అందించారు. వైద్యుల సేవలను ప్రోత్సహించేందుకు టీటీడీ ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. మూడు రోజుల సేవ పూర్తి చేసిన స్పెషలిస్ట్ వైద్యులకు ఆలయ ఆధికారులు శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తుండగా.. ఏడు రోజు

నవతెలంగాణ – ముధోల్దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ర రావు చౌహాన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయాధికారులు మాజీ సిఎం దంపతులను ఘనంగా సన్మానించి, అమ్మవారి ఫోటో ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, బాసర మండల బిజేపి అధ్యక్షుడు పుట్నల సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు. The post బాసరలో మహారాష్ట్ర మాజీ సీఎం పూజలు appeared first on Navatelangana.

పారదర్శకంగా ఆన్లైన్ విధానంలోసీట్ల భర్తీకి ప్రభుత్వానికి గతంలోనే ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు వివిధ కారణాలతో ఆన్లైన్ విధానంసై నాన్చుడు ధోరణి బి కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియపై స్పష్టత కరువు అయోమయానికి గురవుతున్న విద్యార్థులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బి కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రతిపాదించిన ఆన్లైన్ విధానం అమలుపై అడుగు ముందుకు పడటం లేదు. డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఇతర సిఎస్ఇ అనుబంధ బ్రాంచీల సీట్లను లక్షలాది రూపాయల డొనేషన్లకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని భావించినప్పటికీ, అది ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద 70 శాతం ఇంజనీరింగ్ సీట్లు ద్వారా కౌన్సెలింగ్ ద్వారా సజావుగా సాగుతున్నప్పటికీ, మిగిలిన 30 శాతం యాజమాన్య కోటా సీట్ల భర్తీ బాధ్యతను కళాశాల యాజమాన్యాలకే వదిలేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద సుమారు 94 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాట

మహిళా సాధికారతకు ఆధునిక మహిళా శక్తి భవనాలు 22 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న భవన నిర్మాణ పనులు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఇందిరా మహిళా శక్తి భవనంలో ‘వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార సలహాలు, ప్రాజెక్టు నివేదికల తయారీ, రిజిస్ట్రేషన్, లైసెన్సులు, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు రుణాల అనుసంధానం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ- కామర్స్, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానుంది. ఈ దిశగా మహిళా శక్తి భవనాలను వేదికలుగా చేసుకుని మహిళా సాధికారితకు తోడ్పాటును అందించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఆలోచన నుంచి కార్యరూపం దాల్చే వరకు అవసరమైన మార్గదర్శకత్వం, చేయూత అందించేలా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. దీంతో మహిళా సంఘాల సభ్యులకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు, తమ ఉత్పత్తులను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు అవసరమైన సహకారం ఒకే చోట