
1579 వార్తలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశాలు తమ విదేశీ బంగారు నిల్వల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో భారత రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం బంగారంలో 77 శాతం స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, వ్యూహాత్మక భద్రతా చర్య.

ఒక వ్యక్తి జీవితాన్ని సంఖ్య నిర్వచిస్తోందా అంటే? అవును అనే చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మనల్ని ప్రజలు ఏ పేరుతో పిలుస్తారో, ఆ శబ్ధం నిరంతరం మన చుట్టూ ప్రతిధ్వనిస్తూ, మనపై ప్రభావం చూపుతుంది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన ప్రకంపన ఉంటుంది. ఇది మన వేద గ్రంథాలలో , శబ్ధాలు, నక్షత్రాలు, గ్రహాలతో ముడి పడి ఉంటాయి. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పేరు ప్రతి ధ్వని, పేరులోని మొదటి అక్షరం ప్రకంపనలు, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుపుతుంది. కాగా, దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసిన ధృవతార, నేడు కేవలం ఒక జ్ఞాపకం. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ల సరసన నటించి, వందకు పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటి అశ్విని జీవితం ఇంతటి విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మద్యం ప్రియులకు చేదువార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం.

బంగారు రుణాలపై ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? రూ. 2.2 లక్షల పైన లోన్ తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? రూ. 2.2 లక్షలు దాటితే ఐటీ వివరాలు తప్పనిసరి. మీరు మోసపోకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూడండి.

Credit Card Recovery Agents:బ్యాంకుల నుండి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కస్టమర్ బాధ్యత. అయితే, వసూలు చేసే ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి కానీ, దౌర్జన్యంగా ఉండకూడదు. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై భారీ జరిమానాలు విధించే అధికారం ఆర్బీఐకి ఉంది. అలాగే..

సాధారణంగా పాములు నేల మీద పాకడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఒక భారీ పాము ఏకంగా ఇంటి గేటు ఎక్కి, మెట్లపై నుంచి బిల్డింగ్ పైకి వెళ్లి హల్చల్ చేసింది. అంతటితో ఆగకుండా మళ్లీ కిందకు వచ్చి అక్కడే పార్క్ చేసిన ఉన్న కారులో దూరి అక్కడే తిష్టవేసింది. సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Bitter Gourd Food Combinations: కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, దీనిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఆరోగ్య నిపులణలు చెబుతున్నారు. కాబట్టి ఏ ఆహారాలతో కలిపి కాకరకాయలు తినడకూడదు. ఎందుకు తినడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Census 2027: ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఇలాంటి సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. తల్లిదండ్రులు, పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ జనగణనలో నమోదు చేసుకునేందుకు టెన్షన్ పడుతుటారు. అలాగే సందేహాలకు సరైన సమాధానం తెలుసుకుందాం..

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ అందాల తార.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ చిన్నది హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన నెల ఖర్చుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకునే అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది.

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సోలార్ స్టవ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గ్రీన్ ఎనర్జీ దిశగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దేశంలో కోట్లాదిమంది సెల్ ఫోన్ లు వినియోగిస్తున్నారు. తమ అవసరాలకు సమాచార మార్పిడికి సెల్ ఫోన్లను వాడుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా కాల్ చేస్తేనే ఫోన్ రింగ్ అవుతుంది. కానీ మే 2న శనివారం మాత్రం దేశవ్యాప్తంగా లక్షల ఫోన్లలో ఒక్కసారిగా సైరన్ శబ్దం వినిపించబోతోంది. ఈ సైరన్ శబ్దం ఎందుకు వినిపించబోతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు అలవోకగా ఛేదించి, జైపూర్ కోటలో రాయల్స్ గర్జనకు బ్రేక్ వేశారు.

సమాజంలో సొంత తెలివితేటలు లేకపోయినా, ఇతరుల ఐడియాలను కాపీ కొడుతూ మేధావుల్లా బిల్డప్ ఇచ్చే వ్యక్తులు ఎందరో ఉంటారు. సైకాలజీలో దీనిని 'డన్నింగ్ క్రుగర్ ఎఫెక్ట్' అంటారు. తియ్యటి మాటలతో బురిడీ కొట్టించే ఇలాంటి వారి అసలు నైజం, వారి వెనుక ఉన్న మానసిక స్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.

ఆధునిక కాలంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి, సరికాని ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వంటివి ఈ ప్రాణాంతక వ్యాధికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మనం తెలియకుండా చేస్తున్న తప్పులేంటి..? అనేది తెలుసుకుందాం..

నువ్వు చేయలేవు.. అని లోకం వెక్కిరించిన చోటే.. మేమేంటో చూపిస్తాం అని గర్జించిన చిచ్చరపిడుగుల కథ ఇది. శారీరక వైకల్యం, పేదరికం, ఆకలి.. ఇలా అన్ని వైపుల నుండి కష్టాలు చుట్టుముట్టినా, వాళ్ల నిశ్చయం ముందు హిమాలయాల ఎత్తు కూడా చిన్నబోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 21 మంది విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్పై విజయకేతనం ఎగురవేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

ప్రతిరోజూ చేసే పప్పు లేదా సాంబార్ తిని బోర్ కొట్టిందా? అయితే, ఈసారి కొత్తగా క్యారెట్, వెల్లుల్లి కాంబినేషన్లో సాంబార్ ప్రయత్నించండి. ఇది చేయడానికి చాలా సులభం. దీని రుచి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ తినేలా చేస్తుంది. క్యారెట్, వెల్లుల్లి కలిపి చేసే సాంబార్ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే క్యారెట్-వెల్లుల్లి సాంబార్ తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది. తెలంగాణలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉందా చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు భద్రాచలం వాసులు. కేంద్రం జన గణనలో భాగంగా చేపట్టిన సెల్ఫ్ ఎమ్యూనరేషన్ వెబ్సైట్లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చూయించడం కలకలం రేపింది.

ఇంట్లోనో, ఆఫీసులోనో ఫోన్ ఎక్కడో పెడతాం.. తీరా కాల్ చేస్తే అది సైలెంట్ లేదా వైబ్రేట్ మోడ్లో ఉంటుంది. చుట్టుపక్కల ఎన్నిసార్లు వెతికినా దొరకదు. ఇలాంటి సందర్భాల్లో మీ ఆందోళనను దూరం చేసే అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఉన్నాయి. మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా సరే, అది పెద్దగా రింగ్ అయ్యేలా చేసే ట్రిక్స్ ఇవే..

ఈపీఎఫ్వో ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుందా..? ఈపీఎఫ్వో కనీస పెన్షన్ పరిమితి పెరగనుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7,500కి పెంచాలనే డిమాండ్లు ఎప్పటనుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఉద్యోగుల డిమాండ్ నెరవేరేలా కనిపిస్తోంది.