ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం.