25151 articles








నవతెలంగాణ -పరకాల జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా జెండాకు సెల్యూట్ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పరకాల పురపాలక సంఘం కమిషనర్పై విచారణ జరిపి, తప్పు తేలితే చర్యలు తీసుకోవాలని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి మేఘనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆగస్టు 15న మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఇప్పటికే పోలీస్స్టేషన్, ఆర్డీవోకు […] The post పురపాలక కమీషనర్పై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్లోని ఆర్టిసి ఎక్స్ రోడ్స్లో ఏఎస్బిఎల్ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ ఎఎస్బిఎల్ లెగసీని ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఇదే మొదటి గేటెడ్ కమ్యూనిటీ, అత్యంత ఎత్తైన నిర్మాణం కావడం గమనార్హం. 7.97 ఎకరాలలో, జి+50 అంతస్తులతో 3 టవర్లుగా దీనిని నిర్మిస్తున్నారు. రూ. 1.99 కోట్ల ప్రా రంభ ధరతో 3, 4 బిహెచ్కె ఇళ్లను అందిస్తున్నారు. దీనిలో 73.25% ఖాళీ స్థలం, 74,000 చ.అడుగుల క్లబ్హౌస్, 1.70 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో 50కి పైగా సౌకర్యాలు ఉన్నాయి. ఇది మెట్రో స్టేషన్కు 2 నిమిషాలు, కాచిగూడ స్టేషన్కు 8 నిమిషాలు, ఎంజిబిఎస్కు 15 నిమిషాల దూ రంలో ఉంది. సెంట్రల్ హైదరాబాద్లో డి మాండ్ ఉన్నప్పటికీ, పెద్ద స్థలాలు లేకపోవడం వల్లే నాణ్యమైన ఇళ్ల కొరత ఉందని ఎఎస్బిఎల్ సిఇఒ అజితేష్ కొరుపోలు తెలిపారు.

– హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీ కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు– ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు: దొరికిన వాహనదారులునవతెలంగాణ – కామారెడ్డిరాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించకుండా ప్రేమతో రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్, మహిళా ట్రాఫిక్ సిబ్బంది పోలీస్స్టేషన్ […] The post రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్ అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే చిరస్థాయిగా నిలవాలి. ఈ పవిత్రమైన రాఖీ బంధం ప్రతి కుటుంబంలో మరింత ప్రేమను, ఆనందాన్ని నింపాలని ఈ పండుగ మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ జుక్కల్ ఎమ్మెల్యే, మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ తోటా లక్ష్మీకాంతారావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. The post ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో దారుణం జరిగింది. దంపతులు గోదావరి వంతెన పై నుంచి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. దొడ్డ సాయి, సిరి స్వస్థలం తణుకు మండలం వేల్పూరుకు చెందినవారు. సాయి భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేశాడు. నెల క్రితం కుటుంబసభ్యులు తణుకు నుంచి భీమవరం వెళ్లారు. ఐదేళ్ల చిన్నారిని వంతెనపైనే వదిలేసి దంపతులు గోదావరి వంతెన పై నుంచి నదిలో దూకి ఆత్మహత్యచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకున్నారు. మృతులు చించినాడ వంతెన వద్దకు బైకుపై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నవతెలంగాణ – ముధోల్మండల పరిధిలోని వడ్తాల్ గ్రామంలోని ఓ రైస్ మిల్లును శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రైస్ మిల్ లోని ధాన్యం నిల్వలను, సీఎంఆర్ లెక్కలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ధాన్యం, సిఎంఆర్ లెక్కల్లో తేడాలున్నట్లు సంబదిత అధికారులు ముందుగా గుర్తించినట్లు తెలుస్తోంది. రైస్ మిల్ లోనే అధికారులు పంచానామ నిర్వహించి సాక్షుల సంతకాలు తీసుకున్నారు. అయితే తనిఖీల సమయంలో రైస్ మిల్ నడిపిస్తున్న యాజమాని అందుబాటులో లేనట్లు […] The post వడ్తల్ లో రైస్ మిల్ ను తనిఖీ చేసిన అధికారులు appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. The post ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బీడీ కార్మికులు appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి సాయా గౌడ్, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతలుగా బ్యాంకు ఖాతాలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో మరికొన్ని నూతన ఇండ్ల నిర్మాణాలకు మార్కౌట్ వేశామనీ, నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మిస్తేనే బిల్లులు చెల్లిస్తామని […] The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాఖీ పండుగను పురస్కరిచుకుని అంతాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నాచెళ్లెళ్ళ బంధానికి ప్రతీకగా స్థానిక సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బన్సి పటేల్, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారస్ సురేష్, మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంగాధర్, మండల నాయకులు హనుమంత్ పటేల్, అప్పారావు పటేల్, […] The post అంతాపూర్ లో రాఖీ పండుగ వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఆగస్టు 29 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ […] The post తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు appeared first on Navatelangana.

. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : రక్షాబంధన్ పండుగ సందర్భంగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబాల్లోనే కాకుండా సమాజంలోనూ సోదరభావం, పరస్పర గౌరవం, రక్షణ భావనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గురువారం బ్రహ్మకుమారీ సోదరీమణులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే […] The post ఆత్మీయతకు రాఖీ ప్రతీక: ఎమ్మెల్యే కడియం appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేరుగా చేరాలనే లక్ష్యంతో, అర్హులైన వారికి సుమారు 87వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మార్వో మారుతి, ప్రజాప్రతినిధులు బొంపెలి […] The post పేదల సంక్షేమమే ధ్యేయం: జుక్కల్ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

అహ్మదాబాద్: 76 ఏళ్ల బిచ్చగత్తెను ఎత్తుకెళ్లి అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చంపేసి మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేసిన సంఘటన గుజరాత్లోని రాష్ట్రం రాజ్కోట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... 76 ఏళ్ల వృద్ధురాలు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. పది రోజుల క్రితం ఆమె మనవడు ఓ దేవాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అదే రోజు ఆమెను రమేష్ వాదుకియా అనే వ్యక్తి (33) కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై కర్రతో దాడి చేయడంతో స్పృహతప్పిపడిపోయింది. ఆమెపై అతడు అత్యాచారం చేసి చంపేశాడు. మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేశాడు. వృద్ధురాలు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో సిసి కెమెరాలో రమేష్ తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. రమేష్పై గతంలో పలు కేసులు ఉన్నట్టు సమాచారం. 2018లో మూడేళ్ల బాలికపై కిడ్నాప్ చేయడంతో హత్యాచారం చేశాడు. 2010లో చోటిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన

హైదరాబాద్: ఏడాది లోపే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆడబిడ్డల పేరుమీద ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ ఇళ్లు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ లాటరీ కార్యక్రమం జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోని లక్కీ డ్రాలో పొంగులేటి పాల్గొన్నారు. మొదటి దఫాలో 7,340 ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు ప్రభుత్వం అందించనుంది. ఆయా నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకంగా లక్కీ డ్రాతోనే ఇళ్లను కేటాయిస్తున్నామని, అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నామని తెలియజేశారు. మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామని, ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చామని అన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేశామని, రెండు, మూడ్రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారని పొంగులేటి పేర్కొన్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని అన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు ఉందని, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాటిని తాకట్టు పెట్టుకునేందుకు

