అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో దారుణం జరిగింది. దంపతులు గోదావరి వంతెన పై నుంచి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. దొడ్డ సాయి, సిరి స్వస్థలం తణుకు మండలం వేల్పూరుకు చెందినవారు. సాయి భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేశాడు. నెల క్రితం కుటుంబసభ్యులు తణుకు నుంచి భీమవరం వెళ్లారు. ఐదేళ్ల చిన్నారిని వంతెనపైనే వదిలేసి దంపతులు గోదావరి వంతెన పై నుంచి నదిలో దూకి ఆత్మహత్యచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకున్నారు. మృతులు చించినాడ వంతెన వద్దకు బైకుపై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.