25144 articles

వరదల్లో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం చెవికి ఉన్న బంగారు కమ్మలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరదల్లో చనిపోయిన మహిళ ఒంటి మీద ఉన్న చెవి కమ్మలు తీసేస్తున్న వీడియో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు.నారాయణి నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని కొందరు వ్యక్తులు చెక్కల సాయంతో ఒడ్డుకు లాగారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమె చెవులకు ఉన్న పోగులను తీసి పక్కన పెట్టారు. చుట్టూ ఉన్నవారు ఈ దృశ్యాలను వీడియో తీయడంతో విషయం బయటపడింది.వీడియో ఆధారంగా..25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిగా స్థానిక పోలీసులు గుర్తించారు. భరత్పూర్ లోని పోఖరా బస్ పార్క్ దగ్గర వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

న్యూఢిల్లీ: నేపాల్ లో ఆకస్మిక వరద ప్రళయంతో మృతి చెందిన వారి సంఖ్య 538కి చేరింది. వరదల్లో వందల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరద ప్రభావిత నేపాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, గల్లంతైన 320 మంది భారతీయుల ఆచూచి ఇంకా లభించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) శుక్రవారం తెలిపింది. అలాగే భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకి కూడా తెలియరాలేదని పేర్కొంది. గల్లంతైన వారి పలు జాబితాలను అధికారులు సరిపోల్చే పనిలో ఉందని చెప్పింది. ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన భారతీయులను సంప్రదించడానికి, వారి తరలింపును సమన్వయం చేయడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతం నుండి కాఠ్మండుకు చేరుకున్న 21 మంది భారత పౌరులు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారని, నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ కాఠ్మండులో ఈ బృందాన్ని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని జైస్వాల్ తెలిపారు.ఈ విషాదం నేపథ్యంలో నేపాల్కు భారత్ అన్ని విధాల సహాయం అందిస్తుందని.. మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని జైస్వాల్ తెలిపారు. ఇప్పటికే సహాయక సామగ్రితో రెండు వ

ప్రయాణికుల నుంచి వస్తున్న పలు విజ్ఞప్తిల మేరకు ఆర్టిసి రాత్రి సమయాల్లో పలు మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచింది. ఇందులో భాగంగా రూట్ నెం ః 222ఏ పటాన చెరు , కోటీ మార్గంలో ఆబిడ్స్,లక్డికాపూల్, కేర్ ఆసుపత్రి, బేగం పేట, కొండాపూర్ క్రాసర్ రోడ్, హఫీజ్ పేట, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరం గూడ మీదుగా థర్డ్ షిఫ్ట్ ( అర్దరాత్రి) 4 బస్సులను ముషీరాబాద్ డిపో నుంచి 2, మియాపూర్ డిపో నుంచి రెండు బస్సులు నడపున్నట్లు ఆర్టిసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కోటీ నుంచి పటాన చెరుకు మొదటి అర్ధరాత్రి 11.40 నిమిషాలకు ఉండగా, చివరి బస్సు ఉదయం 4.55లకు ప్రతి 45 నిమిషాలకు అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా రూట్ నెం ః 218 అఫ్జల్గంజ్ నుంచి పటాన్ చెరువ మార్గంలో థర్డ్షిఫ్ట్లో భాగంగా రెండు బస్సులను, కాచిగూడ డిపో నుంచి 1 ఒక బస్సు అదే విధంగా మియాపూర్ డిపో 2 నుంచి 1 బస్సును ప్రయాణికులు సౌకర్యం కోసం నడుపుతున్నట్లు తెలిపారు.అఫ్జల్గంజ్ నుంచి మొదటి బస్సు అర్దరాత్రి 11.25 నిమిషాలకు ఉండగా, చివరి బస్సు ఉదయం 3 గంటల 5 నిమిషాలకు అంటే 1.15 గంటల తేడాతో అందుబాటులో ఉంటుందన్నారు. అదే విధంగా రూట్ నెం ః 219 (సికింద్రాబాద్ నుంచి పట



వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిలోని కీలక నౌకాయాన మార్గాల్లో ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను అన్నింటినీ తొలగించినట్లు అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ గురువారం సాయంత్రం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం కీలకమైన మైలురాయిని సాధించిందన్నారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను అంతర్జాతీయ నౌకాయాన మార్గాల నుంచి విజయవంతంగా తొలగించామని కూపర్ చెప్పారు. దీంతో జలసంధిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రవాణా మార్గాలు ఇరాన్ సముద్రపు మైన్ల నుంచి పూర్తిగా విముక్తమయ్యాయని పేర్కొన్నారు. మైన్ల తొలగింపుతో హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షలు, పరిమితులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో ఇరాన్తో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి.

ఇస్లామాబాద్: జైలులో మా నాన్నను చంపేందుకు కుట్ర జరుగుతుందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన కుమారులు చేసిన ఆరోపణలు మరోసారి పాక్ లో రాజకీయ కుదుపును రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, ఖాసిం మాట్లాడుతూ.. అధికారులు తమ తండ్రి గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఆయన ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చని పేర్కొన్నారు. మాజీ ప్రధానికి అందిస్తున్న వైద్య చికిత్సపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారు. ఆయనను ఒక స్వతంత్ర వైద్యుడిచే పరీక్షించాలని డిమాండ్ చేశారు.ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో సులేమాన్, ఖాసిం పాల్గొన్నారు. ఇమ్రాన్ ఖాన్కు అవసరమైన వైద్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను కోరుతూ ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసిన 21 మంది ప్రముఖ మాజీ క్రికెటర్లలో అథర్టన్ కూడా ఒకరు.ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. "తన తండ్రిని ఉద్దేశపూర్వకంగానే జైలులో ఉంచారని ఖాసిం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆరోపించారు. ఆయన నిర్బంధానిక










అమరావతి: సర్ పై వైసిపి కోర్టుకు వెళ్లిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికలు జరగడం మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికు ఇష్టం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికలు జాప్యం జరిగేకొద్దీ.. అధికార పార్టీకి నష్టం కలుగుతుందని జగన్ ఆశ అని.. జగన్ ది దింపుడు కళ్లెం ఆశ అని చంద్రబాబు విమర్శించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే.. రాజకీయ స్థిరత్వానికి నాంది పలికినట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. బిసిలకు 34%రిజర్వేషన్లు అనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని, ప్రతి ఎన్నికల్లోనూ బిసిలకు టిడిపి ప్రాధాన్యం ఇస్తూనే ఉందని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను సిఇసి ఎప్పుడైనా ప్రకటించవచ్చునని చంద్రబాబు నాయుడు సూచించారు.





