25161 articles

నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి సాయా గౌడ్, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతలుగా బ్యాంకు ఖాతాలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో మరికొన్ని నూతన ఇండ్ల నిర్మాణాలకు మార్కౌట్ వేశామనీ, నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మిస్తేనే బిల్లులు చెల్లిస్తామని […] The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాఖీ పండుగను పురస్కరిచుకుని అంతాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నాచెళ్లెళ్ళ బంధానికి ప్రతీకగా స్థానిక సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బన్సి పటేల్, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారస్ సురేష్, మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంగాధర్, మండల నాయకులు హనుమంత్ పటేల్, అప్పారావు పటేల్, […] The post అంతాపూర్ లో రాఖీ పండుగ వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఆగస్టు 29 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ […] The post తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు appeared first on Navatelangana.

. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : రక్షాబంధన్ పండుగ సందర్భంగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబాల్లోనే కాకుండా సమాజంలోనూ సోదరభావం, పరస్పర గౌరవం, రక్షణ భావనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గురువారం బ్రహ్మకుమారీ సోదరీమణులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే […] The post ఆత్మీయతకు రాఖీ ప్రతీక: ఎమ్మెల్యే కడియం appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేరుగా చేరాలనే లక్ష్యంతో, అర్హులైన వారికి సుమారు 87వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మార్వో మారుతి, ప్రజాప్రతినిధులు బొంపెలి […] The post పేదల సంక్షేమమే ధ్యేయం: జుక్కల్ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

అహ్మదాబాద్: 76 ఏళ్ల బిచ్చగత్తెను ఎత్తుకెళ్లి అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చంపేసి మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేసిన సంఘటన గుజరాత్లోని రాష్ట్రం రాజ్కోట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... 76 ఏళ్ల వృద్ధురాలు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. పది రోజుల క్రితం ఆమె మనవడు ఓ దేవాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అదే రోజు ఆమెను రమేష్ వాదుకియా అనే వ్యక్తి (33) కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై కర్రతో దాడి చేయడంతో స్పృహతప్పిపడిపోయింది. ఆమెపై అతడు అత్యాచారం చేసి చంపేశాడు. మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేశాడు. వృద్ధురాలు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో సిసి కెమెరాలో రమేష్ తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. రమేష్పై గతంలో పలు కేసులు ఉన్నట్టు సమాచారం. 2018లో మూడేళ్ల బాలికపై కిడ్నాప్ చేయడంతో హత్యాచారం చేశాడు. 2010లో చోటిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన

హైదరాబాద్: ఏడాది లోపే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆడబిడ్డల పేరుమీద ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ ఇళ్లు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ లాటరీ కార్యక్రమం జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోని లక్కీ డ్రాలో పొంగులేటి పాల్గొన్నారు. మొదటి దఫాలో 7,340 ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు ప్రభుత్వం అందించనుంది. ఆయా నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకంగా లక్కీ డ్రాతోనే ఇళ్లను కేటాయిస్తున్నామని, అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నామని తెలియజేశారు. మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామని, ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చామని అన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేశామని, రెండు, మూడ్రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారని పొంగులేటి పేర్కొన్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని అన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు ఉందని, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాటిని తాకట్టు పెట్టుకునేందుకు






చెన్నై: బెలూన్ ఊదుతూ గొంతులో ఇరుక్కోవడంతో ఆరేళ్ల బాలుడు చనిపోయిన సంఘటన తమిళనాడులోని వచ్చూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వస్త్ర వ్యాపారి సత్యకుమార్ అనే వ్యక్తికి కవల పిల్లల ఉన్నారు. సోమనాథ్ అనే ఆరేళ్ల బాలుడు బెలూన్తో ఆడుకుంటున్నాడు. బెలూన్ గాలి ఉదుతూ నోట్లోకి లాగుతున్నాడు. బెలూన్ ఒక్కసారిగా గొంతులోకి వెళ్లింది. ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. బాలుడి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

న్యూఢిల్లీ : ఈ20 పెట్రోల్ స్థానంలో ఈ10ను తీసుకొస్తున్నారనే వార్తలను భారత్ పెట్రోలియం (బిపిసిఎల్) ఖం డించింది. బిపిసిఎల్ చైర్మన్ సంజయ్ ఖన్నా మాట్లాడుతూ ఈ20ని తీసివేసి ఈ10 అమలు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశా రు. అయితే 7.5 నుండి 8 కోట్ల పాత ద్విచక్ర వాహనాల కోసం ఈ10 పెట్రోల్ను అదనపు ఆప్షన్గా ఇవ్వాలా వద్ద అనే చర్చ మాత్రమే జరుగుతోందన్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నా సరఫరాలో ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ ఈ20తో పాటు ఈ10ను వేరుగా అమ్మడం సవాలుతో కూడుకున్నదని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది.




హైదరాబాద్: వెరా వీటా లివింగ్ సంస్థ హైదరాబాద్ ఒఆర్ఆర్ కండ్లకోయ వద్ద 55 ఏళ్లు దాటిన సీనియర్ల కోసం అమయా ప్రాజెక్ట్ను ప్రారంభించింది. సంస్థ వ్యవస్థాపకులు ఆరుద్రదేవ్ రావు, ధ్రువ్ బద్రుకా, తనయ్ సబూ ఈ ప్రాజెక్ట్ లోగోను ఆవిష్కరించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో 3 ఎకరాల్లో రూ.250 కోట్లతో 256 ఇళ్లను (950-2,400 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. యూనిట్ల ధర చ.అడుగుకు రూ.8,000- నుంచి రూ.8,999 కాగా, నెలసరి నిర్వహణ ఛార్జీ రూ.25 వేలుగా ఉంది. సీనియర్లకు స్వేచ్ఛ, గౌరవం, మనశ్శాంతి ఇవ్వడమే తమ లక్ష్యమని ఆరుద్రదేవ్ రావు తెలిపారు. స్వతంత్రంగా జీవించాలనుకునే వారికి ఇది అనుకూలమని ధ్రువ్ బద్రుకా వెల్లడించారు.



