25116 articles





టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న 100వ చిత్రం ‘#KING100’ గ్లింప్స్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు.. రెండు డబ్బు లేని వాళ్లు’ అనే పవర్ఫుల్ డైలాగ్తో గ్లింప్స్ అదిరిపోయింది. నాగార్జున మరోసారి అదిరిపోయే లుక్లో కనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలిచింది. రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని కుటుంబం నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం ఎర్రగడ్డ తండాలో దారుణం చోటు చేసుకుంది. రెండు ఇళ్ల మధ్య ఉన్న వేపచెట్టు విషయంలో వివాదం జరగింది. గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాలను ఆపే క్రమంలో మేళ్ల చెరువు ఎస్ఐ నవీన్ కుమార్ కు గాయాలయ్యాయి.


బెంగళూరు: కర్నాటక రాష్ట్రం తుమకూరు ప్రాంతంలో చిక్కనాయకణహళ్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోడెకెరె గేటు సమీపంలో రెండు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తురువికిరి గ్రామానికి చెందిన దావుద్ పాషా, అన్నామ్, చిక్కనాయకణహళ్లి గ్రామానికి చెందిన వివేక్(31), అనిల్(32)గా గుర్తించారు. కియా కారు తురువికిరి నుంచి వెళ్తుండగా వోక్సవాగన్ కారు చిక్కనాయకణహళ్లి నుంచి వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.


నవతెలంగాణ-హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ను అందించారు. ఈ చిత్రం నుంచి రెండో సింగిల్గా మోస్ట్ పాపులర్ ఫోక్ సాంగ్ అయిన ‘యెష నాగుల కట్ట మీద’ పాటను డిజిటల్ వేదికగా విడుదల చేశారు. తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా సాగే ఈ జానపద గీతాన్ని సినిమాలో మరింత మాస్ […] The post నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ‘యెష నాగుల’ సాంగ్ వచ్చేసింది.. appeared first on Navatelangana.


శ్రీనగర్: అత్యాచార బాధితురాలు బాలిక మృతి కేసులో నర్సును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలికపై పంతులు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. ఈ సంఘటన జమ్ము కశ్మీర్ రాష్ట్రం కిష్ట్వార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గత కొన్ని నెలల నుంచి గిరిజన మైనర్ బాలికపై టీచర్ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి కావడంతో గర్భం తొలగించాలని టీచర్ నిర్ణయం తీసుకున్నాడు. తన సోదరుడితో కలిసి బాలికను చత్రూలోను పబ్లిక్ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి కిష్ట్వార్ లోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలిక గర్భం తొలగించేందుకు అక్కడ పని చేసే స్వీపర్ సాయంతో పాటు నర్సు సోనిక సాయం తీసుకున్నాడు. గర్భం తొలగించే క్రమంలో బాలిక చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీచర్తో పాటు అతడి సోదరుడు, స్వీపర్, నర్సును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టే సమస్యలేదని పోలీసులు ఘాటుగా హెచ్చరించారు.

నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 626కి చేరుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య రెండు వేలు దాటింది. టిబెట్లో ఏర్పడిన తాత్కాలిక సరస్సులో నీటి మట్టం పెరగడంతో చైనా ఆందోళన వ్యక్తం చేసింది. రెండోసారి భారీ బురద వరదలు వచ్చే అవకాశం ఉందని, నేపాల్, టిబెట్ బోర్డర్లోని గిరాంగ్ పోర్టు వద్ద రెస్క్యూ బృందం సరస్సుపై నిఘా పెట్టింది. చైనా […] The post నేపాల్ వరదలు..626కి చేరిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ సామాన్య ప్రజలను ఆకట్టుకునేందుకు రూ. 79,999 ప్రారంభ ధరతో కొత్త ఎస్1జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 46160 ఎల్ఎఫ్పి భారత్ సెల్ సాంకేతికతతో ఈ స్కూటర్ పనిచేస్తుంది. ఇది 3.1 కెడబ్లుహెచ్, 5.1 కెడబ్లుహెచ్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 3.1 కెడబ్లుహెచ్ మోడల్ సింగిల్ ఛార్జ్పై 179 కిలోమీటర్ల పరిధిని ఇస్తుండగా, దాని ధర రూ. 79,999 గా ఉంది. 5.1 కెడబ్లుహెచ్ మోడల్ 301 కిలోమీటర్ల పరిధిని అందిస్తూ రూ. 99,999 ధరకు లభిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత్ సెల్ సాంకేతికత ద్వారా విద్యుత్ వాహనాల తయారీ వ్యయాన్ని తగ్గించి, సామాన్యులకు సైతం నాణ్యమైన ఈవి రవాణాను అందుబాటులోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 3.1 కెడబ్లుహెచ్ వర్షన్ డెలివరీలు 2026 డిసెంబర్లో ప్రారంభం కానుండగా, 5.1 కెడబ్లుహెచ్ మోడల్ 2027 మార్చి నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ 2026 గోల్ఫ్ టైటిల్ను రషీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. వికారాబాద్లోని గోల్ఫ్ కౌంటీలో జరిగిన టోర్నీలో రషీద్ ఖాన్ మూడు స్టోక్ల తేడాతో టైటిల్ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ గోల్ఫ్ విజేతగా అవతరించాడు. అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని సాధించిన రషీద్ ఖాన్ రికార్డు స్థాయిలో రూ.15 లక్షల ప్రైజమనీని దక్కించుకున్నాడు. డిపి వరల్డ్ పిజిటిఐలో రషీద్కు ఇది 11వ విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అతని సీజన్ ఆదాయం రూ.44,95, 509కి చేరింది. మరోవైపు ఢిల్లీకే చెందిన హనీ బౌసోయా రన్నరప్గా నిలిచాడు. బైసోయాకు రూ.10 లక్షల ప్రైజ్మనీ లభించింది.

అమరావతి: టిడిపి ఎంఎల్ఎ కాగిత కృష్ణప్రసాద్ పెను ప్రమాదం తప్పింది. పెడిన నియోజకవర్గం ఎంఎల్ఎ కాగిత కృష్ణ ప్రసాద్ విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఎంఎల్ఎ కారును ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. కారు ముందు ధ్వంసమైంది. ఎంఎల్ఎతో పాటు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఆర్టిసి బస్సు ఉయ్యూరు డిపోకు చెందినదిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన అర్జున్ శర్మను ఆగ్రాలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్కి చెందిన నిఖిత గొడిశాల(27) ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. ఈ ఏడాది జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అమెరికాలోని పోలీసులకు కంప్లైంట్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. జనవరి 3న అతని […] The post అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య..తెలంగాణలో నిందితుడు అరెస్ట్ appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. కంపెనీ 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేసి రూ.37,700 కోట్లు సమీకరించనుంది. ఇది భారీ మొత్తం కావడంతో ఈ ఐపిఒ దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించనుంది. దీపావళి సమయంలో ఐపిఒ రావచ్చని అంచనా వేస్తున్నారు. 49వ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, జియో లిస్టింగ్ ద్వారా భారత్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని భావిస్తున్నారు. జియో వినియోగదారులు 52.4 కోట్లకు చేరారని, 1.3 కోట్ల గృహాలకు ఎయిర్ఫైబర్ కనెక్ట్ అయిందని, శాటిలైట్ ఇంటర్నెట్, జియో టెలిఫ్రేమ్ ప్లాట్ఫామ్లను తెస్తున్నామని ఆకాష్ అంబానీ వెల్లడించారు. జియోమార్ట్లో 3100 కి పైగా స్టోర్లు ఉన్నాయని, నమోదిత కస్టమర్లు 38.7 లక్షలకు చేరారని ఇషా అంబానీ వెల్లడించారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో తీవ్ర కలకలం రేపిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఐదు నెలల గర్భవతి అని తేలడంతో స్థానికంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాలికకు పాఠాలు చెప్పే ప్రయివేటు ట్యూటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మయూర్భంజ్ జిల్లాలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ వారం ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో […] The post 9వ తరగతి విద్యార్థినిపై లైంగికదాడి..ట్యూటర్ అరెస్ట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. త్రిశూలీ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నిలిపివేయబడ్డాయి. గండకీ బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. సహాయక చర్యల్లో 15 వేలకుపైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 4,400 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా తరలించింది. The post నేపాల్లో వరదలు..త్రిశూలీ నదిలో పెరిగిన నీటి మట్టం appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురాంతగం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. The post పేలిన కారు టైరు..నలుగురు విద్యార్థులు మృతి appeared first on Navatelangana.

‘ఇరుముడి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్బస్టర్ అందుకున్న టాలెంటెడ్ ఫిల్మ్మేకర్ వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టనున్నారు. ‘ఇరుముడి’ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక వేడుకలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని.. రవితేజను కలిసి బ్లాక్బస్టర్ విజయానికి అభినందనలు తెలిపారు. రవితేజ, వివేక్ ఆత్రేయ, లక్ష్మణ్, శ్రీని, బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. వివేక్ ఆత్రేయ తనదైన ట్రీట్మెంట్తో రూపొందించే ప్రపంచంలోకి రవితేజ అడుగుపెట్టడం ద్వారా సరికొత్త సినీ అనుభూతి అందించనున్నారు. దర్శకుడు హసిత్ గోలి తో రవితేజ చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది.

నవతెలంగాణ-హైదరాబాద్ : రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్లు, యంత్రాలకు ఇచ్చే రాయితీ నిధులను ఈసారి నేరుగా అన్నదాతల అకౌంట్లోనే జమ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ స్కీమ్ కోసం దాదాపు 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేవని, యూరియా 2.79L టన్నులు, డీఏపీ 22K టన్నుల స్టాక్ ఉందన్నారు. The post నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.