24152 articles

Telangana’s 23 Members of Parliament have utilised only about ₹94 crore out of ₹394.8 crore allocated under the Members of Parliament Local Area Development Scheme over the past two years. The utilisation rate stands at 23.8%, below the reported national average of 33%. MPs recommended 3,703 development works, of which 2,347 have been recorded as completed, leaving 1,356 works pending.

Telangana is stepping up efforts to transform Hyderabad into a global knowledge, research and innovation hub by attracting leading international universities. The University of London is working towards setting up a campus in Hyderabad, while Northeastern University is exploring an offshore campus at Bharat Future City. Harvard University is considering short-term executive education programmes, while Oxford, Cambridge, MIT, LSE, SOAS and Imperial College London are among the institutions engaged in discussions with the Telangana government on education, research, innovation and industry collaboration.

Jayaraju and Jyothi from Vepalasingaram village in Huzurnagar Mandal, Suryapet district, have only one daughter, Himabindu. Working in America, Himabindu met Rohit Kumar, who is from NTR district, and their friendship eventually blossomed into love.

గురుకులం లో చదివి, పేదరికాన్నిజయించి నర్సుగా సే వలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గు రికావడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాల ఘటనలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే రేవంత్ ప్రభుత్వం మేల్కొంటుంది. మహిళలకు భద్రత కల్పించలేని ఆయనకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా..? అని నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని అన్నారు. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచే

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు మెస్సీ సోమవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీ కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య ఆటగాడిగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో అర్జెంటీనాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. కెప్టెన్గా, ఆటగాడిగా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. అతని సారథ్యంలో అర్జెంటీనా ప్రపంచకప్ ట్రోఫీని సాధించింది.2022లో జరిగిన ఫుట్బాల్ వరల్డ్కప్లో మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచింది. అంతేగాక 2021, 2024లలో మెస్సీ కెప్టెన్సీలో రెండు కోపా అమెరికా ట్రోఫీలను సయితం గెలుచుకుంది. కెరీర్లో అర్జెంటీనా తరఫున 207 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మెస్సీ 125 గోల్స్ చేశాడు. కాగా, ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నానని, అయితే సరైన సమయం కోసం ఎదురు చూసి దీన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించానని మెస్సీ వెల్లడించాడు.

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: ‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే తమ లక్ష్యం’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో పార్టీని ఏర్పాటుచేశానని తెలిపారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదుకు ఐదు సీట్లు గెలుస్తామని ప్రకటించారు. పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారి నిజామాబాద్ వచ్చిన కవితకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ను ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ కూడా మౌనం వహిస్తోందని విమర్శించారు. వేముల ప్రశాంత్రెడ్డిని క్షమించను... బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, తన తండ్రి కేసీఆర్ను రాజకీయం గా దెబ్బతీయడంలో ఆయనదే ప్రధాన పాత్

బిష్కెక్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి ముగింపు దిశగా సాగాలి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కోరారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం యావత్ మానవాళి ఉమ్మడి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సు సందర్భంగా పుతిన్తో మోదీ సోమవారంనాడు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో మోడీ-పుతిన్ మధ్య ఈ కీలక భేటీ జరిగింది.మానవాళి సంక్షేమం కోసం యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమస్యలకు త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలన్నదే మానవాళి ఆకాంక్ష అని, అదే భారతదేశ సందేశం అని మోడీ అన్నారు. భారత్ శాంతి మార్గాన్ని గుర్తుచేస్తూ, గాంధీ పుట్టిన నేల, బుద్ధిని నేల రెండు ఒకే సందేశాన్ని పంచుకుంటాయని, ఆ సందేశం శాంతిమార్గమని అన్నారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతుగా న


పాకిస్థాన్తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ హేగ్లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ) సోమవారం ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన ఈ న్యాయస్థానానికి ఎలాంటి అధికార పరిధీ లేదు అని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.జమ్మూకశ్మీర్లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులో కొన్ని నిర్మాణాలను చేపట్టకుండా న్యూఢిల్లీపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర చర్యలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని కూడా భారత్ తిరస్కరించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం యథాతథంగా అమల్లో ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం వెలువరించిన తీర్పులను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పలు దౌత్య, ఆర్థిక చర్యలను ప్రకటించింది. అందులో భాగంగానే 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని సోమవారంనాడు అహ్మదాబాద్కు మళ్లించారు. విమానంలోని వాష్రూమ్లో ‘బాంబు’ ఉందంటూ రాసిన టిష్యూ పేపర్ను సిబ్బంది గుర్తించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు సందేశం గుర్తించడంతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని మళ్లించాలని పైలెట్లు నిర్ణయించుకున్నారని, సాయంత్రం 4.30 గంటల సమయంలో అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని ‘జీ’ డివిజన్ ఏసీపీ వీఎన్ యాదవ్ తెలిపారు. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారని, ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు వివరించారు. ఘనటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, అవసరమైన భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాన్నితిరిగి కార్యకాలాపాలకు అనుమతిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.


చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.శివజ్ఞానం నేపాల్లో ఆగస్టు 26 నుంచి అదృశ్యమైనట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు మద్రాస్ బార్ అసోసియేషన్ (ఎంబిఎ) సోమవారంనాడు తెలియజేసింది. తక్షణం జోక్యం చేసుకువాలని కోరింది. నేపాల్లో సంభవించిన భారీ వరదల అనంతరం ఆయన కనిపించకుండా పోయినట్టు సమాచారం ఉందని తెలియజేసింది. విపత్తు సంభవించిన సమయంలో జస్టిస్ శివజ్ఞానం తమిళ యాత్రికుల బృందంతో కలిసి నేపాల్లో పర్యటిస్తున్నారని ఎంబిఎ ఆఫీస్బేరర్ ఒకరు తెలిపారు.‘ఈ అత్యంత క్లిష్ట సమయంలో జస్టిస్ శివజ్ఞానం కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆయన ఆచూకీ కనుగొని సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత ప్రభుత్వం సమన్వయంతో, వేగంగా, నిరంతరం చేపట్టే చర్యలు ఎంతో కీలకమైన సహాయన్ని అందించగలవు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో కూడా బార్ అసోసోయేషన్ పేర్కొంది. జస్టిస్ శివజ్ఞానం కోసం గాలించి, రక్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలు వినియోగించాలని, ఆ ప్రక్రియలో సాధించిన పురోగతిని ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎంబిఎ కోరింది. జస్టిస్ శివజ్ఞానం న్యాయవ్యవస్


హైదరాబాద్: కెసిఆర్కు, నాకు పోలికనా..? నందికి, పందికి ఉన్నంత తేడా ఉందని సిఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. 1,000 రోజుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్తో నిరసనలు తెలపాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈనెల 6వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎదురుగానే అన్ని విషయాలు చెబుతానని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కెసిఆర్ రావాలని ఆయన సూచించారు. 1,000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కెసిఆర్ తీసుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారని, మరి కెసిఆర్ను ఏం చేయాలని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.ప్రతిపక్ష నేత హోదాలో కెసిఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు

ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిప్రి పోలీస్ స్టేషన్ ఏరియాలోని మనోరి గ్రామంలో బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగినట్టు జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ పాల్ తెలిపారు. 11 మందిని ప్రయాగ్రాజ్లోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. మృతులను ప్రియాంజలి (5), ప్రవీణ్ సింగ్ (13), జాహ్నవి (12), ఆదితయ (12), రవి (8), అంజు (32), జ్ఞాన్ సింగ్ (40), విక్రమ్ సరోజ్ (35), అన్ష్ (6), నానా (4)గా గుర్తించారు. మృతులంతా ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలోనే నివసించే వారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదారు ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కాగా, పేలుడు తీవ్రత కారణంగా ఘటనా ప్రాంతం సమీపం నుంచి వెళ్లే ఢిల్లీ-హౌరా రైల్వే లైన్పై వెళ్లే రైళ్ల రాకపోకలను సుమారు గంటసేపు నిలిపివేశారు. అజ్మీర్-సీల్దా ఎక్స్ప్రెస్ను మనోరి రైల్వే స్టేషన్కు వెనక్కి పంపించారు. ఢిల్ల

నార్త్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సౌత్ జోన్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. నార్త్ జోన్ మొదటి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఓవర్నైట్ స్కోరు 40/2తో సోమవారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన సౌత్ జోన్కు కెప్టెన్ తిలక్ వర్మ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్తో తిలక్ అలరించాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సమరన్ రవిచంద్రన్ అండతో తిలక్ స్కోరును ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడిన రవిచంద్రన్ 4 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.అనంతరం బ్యాటింగ్కు వచ్చిన హిమతేజ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో తిలక్, శ్రేయస్ గోపాల్ అద్భుత బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను కుదుట పరిచారు. ఇద్దరు నార్త్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఒకవైపు వికెట్ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 169 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి అర్ష్దీప్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో తిలక్ వర్మతో కలిసి ఆరో వికెట్కు 175 పరుగులు జోడించాడు. మరోవైపు కెప


ఆగస్టు 19న చిన్నారి మర్మావయాలపై గాయాలు ఉండటాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలులో ఒక ‘బ్యాడ్ అంకుల్’ తనకు రోజూ చాక్లెట్లు ఇచ్చి తనను ఇబ్బంది పెడుతున్నట్టు తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో వారు బవానా పోలీస్ స్టేషన్, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 24న స్కూలులోని సీసీటీవీ వీడియో దృశ్యాలు, ఫోటోగ్రాఫ్లు చూపించడంతో ఆ నిందితుడిని చిన్నారి గుర్తించింది. అతనిని 8 నెలలుగా ఇదే పాఠశాలలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న వికాస్గా గుర్తించారు. ఫిర్యాదు అందిన రోజునే నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు ఛాకెట్లు ఇస్తున్నట్టు అతని ఫోన్లో ఉన్న వీడియాల్లో గుర్తించామని, పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ‘సిట్’ను ఏర్పాటు చేశారు.

నేపాల్లో వరదల అనంతరం మృతదేహాల గుర్తింపు అధికారులకు, బాధిత కుటుంబాలకు పెను సవాల్గా మారింది. పోఖరాలోని ఓ ఆసుపత్రిలో ఒకే మృతదేహాన్ని మూడు కుటుంబాలు తమ బంధువుదేనని ప్రకటించుకున్నారు. ఈ ఒక్క సంఘటన అక్కడ మృతదేహాల గుర్తింపులో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లకు అద్దం పడుతోంది. పోఖరా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోని మృతదేహం నంబర్ 1003ను బర్దియాకు చెందిన హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికుడు గోపాల్ దహిత్, రూపందేహికి చెందిన టూరిస్ట్ గైడ్ దామోదర్ బస్యాల్ కుటుంబాలు తమ బంధువుదేనని పేర్కొన్నాయి. మరో కుటుంబం కూడా తొలుత అదే మృతదేహంపై హక్కు వ్యక్తం చేసినట్లు నేపాల్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దహిత్, బస్యాల్ కుటుంబాల మధ్య మృతదేహం గుర్తింపుపై వివాదం కొనసాగుతుండగా, తుది నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు చేయించుకునేందుకు రెండు కుటుంబాలు అంగీకరించాయి. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చేరడంతో వాటిని గుర్తించడం మరింత క్లిష్టంగా మారింది. మృతుల గుర్తింపులో ఫొటోలు, శారీరక లక్షణాలు, పళ్లు, చెవులు, పెదాలు, ముఖం, చేతులు, ఛాతీ, శరీర నిర్మాణం, వ్యక్తిగత వస్తువులు వంటి ఆధారాలను అధికారులు, కు


గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు ఎన్కౌంటర్ అయ్యారు. హర్యానాలోని సోనిపట్కు చెందిన మోహిత్ (22), సుమిత్ (24) అనే ఇద్దరు నిందితులు షామ్లీ పట్టణంలోని కైరానా రోడ్డులో ఉన్న ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం వారు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ ఘటనకు కొన్ని గంటల ముందు ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ..అంకిత్ బల్యాన్ హత్య ముందస్తు కుట్రలో భాగమని వెల్లడించారు. గోగి గ్యాంగ్తో సంబంధాలున్న నెట్వర్క్ ఈ హత్య వెనుక ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఎన్కౌంటర్పై అంకిత్ తండ్రి సత్వీర్ సింగ్ స్పందించారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూనే తమకు సగం న్యాయం జరిగిందన్నారు. మిగిలిన సగం న్యాయం కూడా త్వరలో జరగాలని కోరారు. అంకిత్ సోదరి రీనా మాత్రం కుటుంబానికి ‘పూర్తి న్యాయం’ కావాలని స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరగడం తమకు ఇష్టం లేదని, మిగిలిన నిందితుల విషయంలోనూ ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.


యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో పెను సంచలనం నమోదైంది. సెర్బియా యోధుడు, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జకోవిచ్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్లో 25వ టైటిల్ సాధించాలని తహతహలాడుతున్న జకోవిచ్కు మరోసారి నిరాశే మిగిలింది. యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్లో అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనెతో జరిగిన పోరులో జకోవిచ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. దాదాపు నలుగున్నర గంటలకు పైగా సాగిన మారథాన్ సమరంలో నవోనె 76, 57, 46, 62, 61తో నాలుగో సీడ్ జకోవిచ్పై సంచలన విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన తొలి సెట్లో నవోనె జయకేతనం ఎగుర వేశాడు. అయితే తర్వాత పుంజుకున్న జకోవిచ్ వరుసగా రెండు సెట్లు గెలిచి పైచేయి సాధించాడు. కానీ తర్వాతి సెట్లలో నవోనె అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. జకోవిచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో అలవోకగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. దీంతో జకోవిచ్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. మరో మ్యాచ్లో కజకిస్థాన్కు చెందిన 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ విజయం సాధించాడు. అమెరికా ఆటగా