9910 వార్తలు

ముంబై: బాలీవుడ్ నటి, ఎంపి కంగనా రనౌత్కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆమె తన ఇంటి నుంచి కారు ఎక్కేందుకు వస్తున్న వీడియో అది. అయితే అందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా..? ఈ వీడియో కంగనా మెడలో నల్లపూసల దండతో కనిపించింది. నల్లపూసలు, మట్టిగాజులతో కంగనా కనిపించడంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కంగన సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్ చేయగా.. ఆమె పెళ్లి జరిగితే తప్పకుండా గ్రాండ్గా చేసుకుంటారని మరొకరు అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే, అది సినిమా షూటింగ్ కోసం వేసుకున్న గెటప్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా ముంబైలో ఉంటున్నారు. తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సీక్వెల్లో నటిస్తున్నారు. ‘క్వీన్-2’ అనే టైటిల్తో ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమాలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా సంప్రదాయబద్ధంగా తయారైనట్లు తెలుస్తోంది. zzz

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన పర్యాటకులతో నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందారు. ఘటన సమయంలో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది బస్సులో ఉన్నారు. ప్రయాణికులందరికీ స్వల్పగాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. The post యూపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఏపీవాసులు మృతి appeared first on Navatelangana.

నోకియా ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ తాజాగా భారత టెక్ మార్కెట్లో సరసమైన ధరకే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ పరికరం హెచ్ఎండీ వైబ్ 2 5G పేరిట విడుదల అయింది. ఇది గత సంవత్సరం వచ్చిన హెచ్ఎండీ వైబ్ 5Gకి అప్గ్రేడ్ వెర్షన్. ఇందులో 6.7-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. చాలారోజుల నుంచి తక్కువ ధరకే మంచి ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ కొనాలని చూస్తుంటే, ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. హెచ్ఎండీ వైబ్ 2 5G ధర భారతదేశంలో ఈ హ్యాండ్సెట్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ అయింది. 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. కాగా, ఈ పరికరం నార్డిక్ బ్లూ, కాస్మిక్ లావెండర్, పీచ్ పింక్ రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లతో పోటీ? పోటీ పరంగా, ఈ తాజా ఫోన్ Ai+ నోవా 2 5G, శాంసంగ్ M06 5G, లావా షార్క్ 5G, పోకో C81 వంటి మోడళ్లతో పోటీపడుతుంది. హెచ్ఎండీ వైబ్ 2 5G ధర ఈ ఫోన్ 6.7-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పరికరం 2.3GHz

ఐక్యూ సంస్థ తాజాగా చైనాలో సరికొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని ఐక్యూ ప్యాడ్ 6 ప్రో పేరిట విడుదల చేసింది. చైనాలో వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు వస్తోన్న ఈ కొత్త టాబ్లెట్ మూడు రంగుల ఎంపికలలో లభిస్తోంది. ఈ పరికరం 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్, ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్, 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 13,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఐక్యూ ప్యాడ్ 6 ప్రో ధర, లభ్యత ఐక్యూ ప్యాడ్ 6 ప్రో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,499 (సుమారుగా రూ. 64,000) 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,999 (సుమారుగా రూ. 71,000) 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,799 (సుమారుగా రూ. 83,000) 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 6,699 (సుమారుగా రూ. 95,000) ఈ కొత్త టాబ్లెట్ గ్రే క్రిస్టల్, ఐల్ ఆఫ్ మ్యాన్, సిల్వర్వింగ్ రంగులలో లభిస్తుంది. ఐక్యూ ప్యాడ్ 6 ప్రో ఫీచర్లు ఈ టాబ్లెట్లో 13.2-అంగుళాల 4K LCD టచ్స్క్రీన్ ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం,

అడవిలో బిడి ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఒకేసారి పులి దాడి చేసింది. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. దీంతో సిందేవహి తాలుకాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లడం అక్కడ సర్వసాధారణం. శుక్రవారం ఉదయం కూడా గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు వెళ్లారు. దాదాపు ఉదయం 8 గంటల సమయంలో ఓ పులి మాటువేసి వారిపై దాడి చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బాధితులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అది భయంకరంగా విరుచుకుపడింది. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, సునీతా కౌశిక్ మొహర్లేగా గుర్తించారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారే.

నవతెలంగాణ – హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 89 రన్ష్ తేడాతో విజయం సాధించింది. దీంతో అయిదు సార్లు చాంపియన్ అయిన చెన్నై ప్లే ఆఫ్స్కు అర్హత కోల్పోయింది. చెన్నై జట్టు రెండో అఫెన్స్గా భావిస్తూ .. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ […] The post రుతురాజ్ గైక్వాడ్కు భారీ జరిమానా appeared first on Navatelangana.

– డాక్టర్ కె.వి. రమణాచారికి అంకితోత్సవంనవతెలంగాణ -సుల్తాన్ బజార్ ప్రముఖ రచయిత డాక్టర్ వై. రామకృష్ణారావు రచించిన తరంగిణి నవల ఆవిష్కరణ సభ వంశీ ఆర్ట్ థియేటర్స్, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానంద రావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు ఐఏఎస్ (రి) డా. కె.వి. రమణ చారికి అంకితం […] The post ‘తరంగిణి’ నవల ఆవిష్కరణ… appeared first on Navatelangana.

హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని అన్నారు. అమెరికాలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని, ఫార్మాసిటీని కొనసాగిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని తెలియజేశారు. రేవంత్ ప్రభుత్వం కేవలం జిమ్మిక్కు చేస్తోందని, ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. 75 శాతం ఫార్మాసిటీ 25 శాతం మిగతావి ఉండాలని చూశామని, ఈ సర్కార్ 75 శాతం వ్యాపారం, 25 శాతమే ఫార్మా ఉండేలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం..ఫార్మా సిటీని రీసోర్ట్ చేస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు ప్రారంభించామని, ఈ ప్రభుత్వం ఏం చేసినా నడవదని.. కోర్టులో నిలబడదని హరీష్ రావు అన్నారు.

ఒప్పో భారత టెక్ మార్కెట్లో తన అత్యంత ప్రీమియం అయిన ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాను లాంచ్ చేసింది. అంతేకాదు సంస్థ ఈ పరికరంతో మరో రెండు కొత్త 5G ఫోన్లను విడుదల చేసింది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ పరికరం ఫైండ్ ఎక్స్9 శ్రేణిలో అగ్రశ్రేణి మోడల్. ఈ పరికరంతో పాటు కంపెనీ ఫైండ్ ఎక్స్9ఎస్ ను కూడా విడుదల చేసింది. ఈ పరికరాలు ఇప్పుడు దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రో మోడళ్ల శ్రేణిలో చేరాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకునే ముందు, ముందుగా దీని ధరను చూద్దాం. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ధర, లభ్యతఒప్పో ఫైండ్ X9 అల్ట్రా 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.169,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, ఈ పరికరం కాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ను ప్రీ-బుక్ చేసుకుంటే రూ.11,000 వరకు విలువైన ఒక ఉచిత ప్రీమియం గిఫ్ట్ బాక్స్ను పొందవచ్చు. ఈ గిఫ్ట్ బాక్స్లో ఒప్పో ఎంకో ఎయిర్ 5 ప్రో TWS, ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కోసం ఒక అధికారిక కవర్ కేస్ ఉంటాయి.

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్సిటీని రద్దు చేస్తామన్నారు. ‘‘ కేంద్ర పర్యావరణశాఖ ఫార్మాసిటీకే అనుమతిచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉంది. ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ సర్కార్ కోర్టుకు చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని […] The post ఫ్యూచర్సిటీని రద్దు చేస్తాం: హరీశ్రావు appeared first on Navatelangana.

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఒకే రోజు నలుగురు రైతులు చనిపోయారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్స్ దొరుకుతున్నాయని, డబ్బుల సంచులపై ఉన్న శ్రద్ధ ధాన్యం సంచులపై లేదని విమర్శించారు. భూదోపిడీపై పెట్టే శ్రద్ధ రైతులపై లేదని, రెండున్నర ఏళ్లయినా ఇంకా తమపైనే ఏడుస్తున్నారని మండిపడ్డారు. రేపటి కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కెటిఆర్ కోరారు. రేపు ప్రభుత్వ స్పందన చూసి కార్యాచరణ ప్రకటిస్తామని, బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ధ్వజమెత్తారు. 9 రోజులు రాచమర్యాదలు చేసిందెవరు? అని ప్రశ్నించారు. ఎవరైనా దొరికితే కేసు పెట్టు అని ఆ బాలిక వివరాలు బయటపెట్టిన వారిపై కేసు పెట్టాలని సూచించారు. కేంద్రమంత్రి కొడుకు అయితే ఏమైనా మినహాయింపు ఉంటుందా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

ఏసర్ భారత టెక్ మార్కెట్లో సరికొత్త ల్యాప్టాప్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని ఏసర్ ఆస్పైర్ 5 AI పేరిట తీసుకొచ్చింది. ఈ కొత్త ల్యాప్టాప్లో 14-అంగుళాల WUXGA డిస్ప్లే, 32GB వరకు LPDDR5 RAM, 1TB వరకు NVMe SSD స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది విండోస్ 11 హోమ్పై పనిచేస్తుంది. కంటెంట్ వినియోగం, తేలికపాటి గేమింగ్ కోసం ఆస్పైర్ 5 AIని సన్నగా, తేలికగా ఉండే ల్యాప్టాప్గా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఏసర్ ఆస్పైర్ 5 AI ధర, లభ్యతఏసర్ ఆస్పైర్ 5 AI ధర భారతదేశంలో ర్.79,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, కేవలం సిల్వర్ రంగులో మాత్రమే లభిస్తోన్న ఈ ల్యాప్టాప్ ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఇండియా ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఏసర్ ఆస్పైర్ 5 AI స్పెసిఫికేషన్లు ఏసర్ ఆస్పైర్ 5 AIలో 1,920 x 1,200 పిక్సెల్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 14-అంగుళాల WUXGA IPS డిస్ప్లే ఉంది. ఈ ల్యాప్టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ ప్రాసెసర్ల ద్వారా పనిచేస్తుంది. ఏసర్, ఇంటెల్ కోర్ అ

నవతెలంగాణ – హైదరాబాద్ : కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ను ఈడీ అధికారులు హర్యానాలోని గుర్గావ్లో అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవాలని, బెయిల్ రద్దు చేయాలని ఈడీ కోరడంతో ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో, నకిలీ ఆధార్ కార్డుతో గుర్గావ్లో దాక్కున్న నౌహీరాను అధికారులు పట్టుకున్నారు. ఆమెను శుక్రవారం హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు […] The post హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్ appeared first on Navatelangana.

తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. నటుడు జెడి చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మే 1న విడుదలైన ఈ సినిమా బోల్తాపడింది. హీరో అమెరికా వెళ్లాలని అనుకుంటే.. అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లా అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ట్రంప్పై కోపం పెంచుకున్న హీరో ఏం చేశాడు అనేదే సినిమా సారాంశం. అయితే రిలీజై నెల కూడా కాకముందే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

ఐకూ 15T బుధవారం చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ పరికరం ఐకూ 15, ఐకూ 15 అల్ట్రా కంటే దిగువన ఉన్న బ్రాండ్ ఫ్లాగ్షిప్ లైనప్లో చేరింది. ఈ హ్యాండ్సెట్లో 6.82-అంగుళాల 2K డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాన్స్టర్ ఎడిషన్ ప్రాసెసర్, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, బిగ్ 8,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఐకూ 15T కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఐకూ ధర, లభ్యత 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,099 (సుమారుగా రూ. 58,000) 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,499 (సుమారుగా రూ. 64,000) 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,799 (సుమారుగా రూ. 68,000) 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,199 (సుమారుగా రూ. 74,000) 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,999 (సుమారుగా రూ. 85,000) కాగా, ఈ హ్యాండ్సెట్ క్వింగ్యున్, ట్రాక్ ఎడిషన్, లెజెండ్ ఎడిషన్ రంగులలో లభిస్తుంది. ఐకూ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్తో 6.82-అంగుళాల 2K రిజల్యూషన్ LTPO ఆమోలెడ్ స్క్రీన్ను కలిగి ఉంది. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం, ఈ హ్యాం

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దిలీప్తో పాటు నేపాలీ వాచ్మన్ సునీల్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనకు మరో ఆరుగురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురు కలిసి దోపిడీ చేసి, హత్య అనంతరం బంగారాన్ని పంచుకుని పరారైనట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితులు నేపాల్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. The post మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య..మరో ఇద్దరు అరెస్ట్ appeared first on Navatelangana.

3 తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయం అనుమానాస్పదంగా మహిళ మృతి నవతెలంగాణ-అక్కన్నపేట అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బోయిని రాజవ్వ (60) అనే మహిళ గురువారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న టైంలో తలపై బలంగా కొట్టి, దారుణంగా గాయపరిచి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించినట్లు సమాచారం. గాయపడిన రాజవ్వను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ […] The post మంచినీళ్లబండలో దొంగల బీభత్సం appeared first on Navatelangana.

– గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతించకపోవడం చట్టరీత్యా నేరం– సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ నంబర్లు– జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ విజ్ఞప్తినవతెలంగాణ- అమీన్పూర్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్ ఆపరేషన్) ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి, సరైన సమాచారాన్ని అందించాలని అమీన్పూర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, సెన్సెస్ ఛార్జ్ ఆఫీసర్ డి. ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెన్సెస్ పురోగతిపై […] The post ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ. 9న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల […] The post రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలోని రామప్ప గుట్ట వద్ద విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సిరిసిల్ల శాంతినగర్కు చెందిన హరిచరణ్ గౌడ్(18), ఛీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మణికంఠ(17)గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి […] The post ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి appeared first on Navatelangana.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ భారత్లో ఇంధన నిల్వలు తగినంత ఉండడంవల్ల పెద్దగా సమస్య తెలియలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంధనంకోసం విదేశాలపై ఆధారపడడం ఎంత తగ్గిస్తే అంతమంచిదన్న భవిష్య దృష్టితో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గ్యాసిఫికేషన్ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈమేరకు కోల్గ్యాస్ఫికేషన్ కోసం రూ. 37,500 కోట్ల రాయితీ పథకాన్ని అంగీకరించడం చారిత్రాత్మకమైన మార్పు. దీని ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్గా మార్చి, విదేశాలనుండి దిగుమతి చేసుకునే ఎరువులు, రసాయనాల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్షం. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. భారత దేశ ఇంధన రంగంలో ఒక కొత్తశకానికి కేంద్ర ప్రభుత్వం పునాది వేసింది. మన దేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ రసాయనాలు, ఎరువులకోసం మనం ఇంకా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈ భారీ పథకానికి కేంద్రం ఆమోదముద్రవేసింది. కేవలం బొగ్గును మండించి వి

ప్రస్తుత తెలంగాణ ఎంపిల సంఖ్య 17, ఉత్తరప్రదేశ్ ఎంపిలు 80. అంటే మనకన్నా 63 సీట్లు ఎక్కువ. 50% పెంచాక తెలంగాణ ఎంపిలు 25, యుపి ఎంపిలు 120. అప్పుడు తెలంగాణ కన్నా యుపి ఎంపిలు 95 సీట్లు ఎక్కువ. డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి జనాభాను నియంత్రించుకున్న దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉదా॥ స్వతంత్ర భారత ఎంపిలలో దక్షిణ భారత ఎంపిలు 27% కాగా, 1973 డీలిమిటేషన్తో 24%కి తగ్గింది. 2026 డీలిమిటేషన్తో 19కి పడిపోతుంది. తద్వారా దక్షిణాది ఎంపిలతో పని లేకుండానే అధికా రాన్ని దక్కించుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలను మరింతగా పిండుకోటానికి వీలైన చట్టాలు చేసినా అడ్డుకోలేని బలహీన స్థితికి వాటిని నెట్టేయవచ్చు. అదే వాళ్ల లక్షం. ఇది ఊహ కాదు. 543 ఎంపిల ను 850కి పెంచుకోవాలన్నదే వాళ్ల ముందస్తు పథకమనీ 888 ఎంపిలు కూర్చునేంత విశాలంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించటమే అందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు. ‘విభజించు విస్తరించు పాలించు అన్న ప్రణాళికతో భారత్ను ఈస్టిండియా పాలకులు ఎలా పాలించగలిగారో తెల్సుకుందాం. పలు హిందూ, ముస్లిం రాజ్యాల సమాహారమే నాటి భారతదేశం! వాళ్లను విభజించేందుకు మత విద్వేషాలను రగిలించారు. తద్వా

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో 12,882 హెల్పర్ పోస్టులు, 3,100 టీచర్ పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. హెల్పర్ పోస్టులకు టెన్త్, టీచర్ పోస్టులకు ఇంటర్ అర్హతను నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. The post నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. appeared first on Navatelangana.