
3334 వార్తలు
నవతెలంగాణ – ముధోల్ మండలంలోని గన్నోర గ్రామానికి చెందిన కమలబాయి(65) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్ఐ కధనం ప్రకారం…కమలబాయి తన మనవడితో కలిసి సోమవారం ద్విచక్ర వాహనంపై కుబీర్ మండలంలోని బెల్గాం గ్రామానికి వెళ్తున్న క్రమంలో విట్టోలి గ్రామం వద్ద అడవి పందులు అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కమల బాయికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందజేయడంతో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్ […] The post చికిత్స పొందుతూ మహిళ మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – పరకాల రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన ఆయన, వరి, మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు […] The post మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం: గాదె ప్రభాకర్ రెడ్డి appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటాలు ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. సోమవారం సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసం పెల్లి సైదులు మాట్లాడుతూ.. ఎండనక వాననక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు దాటిన ఇంతవరకు కాంటాలు ప్రారంభించకపోవడం […] The post రాజుల కొత్త పెల్లిలో కాంటాలు ప్రారంభించాలి appeared first on Navatelangana.

తమిళనాడు లోని అత్యంత కీలకమైన కొళత్తూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. అయితీ ఈ ఎన్నికల్లో సిఎం స్టాలిన్ ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పొందారు. ఈ ఫలితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ద్రవిడమున్నేట్ర కజగం అధినేత స్టాలిన్ కన్నా బాబుకు 9492 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2011 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో కొళత్తూరు నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పుడు డిప్యూటీ సిఎంగా ఉన్న స్టాలిన్ కేవలం 2734 ఓట్ల తేడాతో ఏఐఎడిఎంకె అభ్యర్థి సైదై దురైస్వామిని ఓడించారు. 2016,2021 ఎన్నికల్లో కూడా క్రమంగా 37730,70384ఓట్ల ఎక్కువ మెజార్టీలతో స్టాలిన్ గెలుపొందారు. అంతకు ముందు తౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ పోటీ చేసేవారు. ఆ తరువాత కొళత్తూరు నియోజకవర్గం మారారు. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన పాత నియోజకవర్గం నుంచి గెలిచారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాల్లో దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ 2,18,034+ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన న్యూ రాష్ట్రీయ సమాజ్ పార్టీ అభ్యర్థి ఘుత్కడేకు కేవలం 935 ఓట్లు వచ్చాయి. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్, శివసేన పోటీ చేయలేదు. చిన్న పార్టీలు పోటీలో ఉండటంతో ఎన్నిక జరిగింది. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. The post అజిత్ పవార్ సతీమణి ఘన విజయం appeared first on Navatelangana.
రెండు కేసులు నమోదు : డిటిఓ జైపాల్ రెడ్డి నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను డీసీఎంలను పంపించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మహబూబాద్ డిటిఓ జైపాల్ రెడ్డి, ఎం వి ఐ సాయి చరణ్, వెంకటరెడ్డి, తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం వాహనాలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో తనిఖీలు చేస్తున్నామని ఇందులో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాహనాలను పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని […] The post ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించేందుకు ఏర్పాటు appeared first on Navatelangana.
– పంట మార్పిడితో సుస్థిర ఆదాయం సాధ్యం– సేంద్రియ విధానాలతో నేల సారాన్ని కాపాడాలినవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నందిపాడు లో సోమవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పంటల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం, వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన విభాగం ప్రొఫెసర్, హెడ్ […] The post నందిపాడులో ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” appeared first on Navatelangana.

లెక్కల శాస్త్రం గెలిచిందన్న మై యాక్సిస్ ప్రదీప్తమిళనాడు ఎన్నికల ఫలితాలపై తాజా స్పందన టివికె తొలి ఓటు బ్యాంకులు అత్యంత గణనీయం న్యూఢిల్లీ ః తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టివికె గెలుస్తుందని తాము చెపితే అందరూ నవ్వారని యాక్సిస్ మై ఇండియా సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా తెలిపారు. ఇప్పుడు నవ్విన నాపచేసే పండినట్లు అయిందని సోమవారం ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అనూహ్య రీతిలో టివికె విజయం సాధించడంపై గుప్తా స్పందించారు. పలు ఇతర సంస్థలు ఈ ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకె కూటమి గెలుస్తుందని, అన్నాడిఎంకె గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషించాయి. అయితే ఒక్క యాక్సిస్ మై ఇండియానే ఇందుకు భిన్నంగా విజయ్దే గెలుపు అని స్పష్టం చేసింది. ఇది జోస్యం అనుకునేరు. లెక్కలు గణాంకాల శాస్త్రం దక్కించుకున్న విజయం అని గుప్తా తెలిపారు. 234 స్థానాల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి కూడా డిఎంకెకు పెద్దగా పోటీ ఉండబోదని పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేల దశలో తెలిపాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఒక్కటే విజయ్ తొలి ప్రవేశంతోనే అద్భుతాలు సృష్టిస్తాడని, టివికెకు 98 నుంచి 120 వరకూ స్థానాలు వస్తాయని తెల
– జవహర్ స్కూల్ దే పైచేయి– నాలుగు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత– 129 మందికి 129 మంది పాస్– ప్రయివేట్ విభాగంలో జవహర్ స్కూల్ విద్యార్థిని కాత్యాయని టాపర్నవతెలంగాణ – అశ్వారావుపేటప్రయివేట్ పాఠశాలలంటేనే పోటీ ఆ పోటీ కేవలం ఫలితాల పరంగానే కాకుండా నాణ్యమైన బోధన, మెరుగైన ప్రతిభ, విద్యార్థుల సాధనలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అశ్వారావుపేట మండలంలోని నాలుగు ప్రయివేట్ పాఠశాలలు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించి తమ […] The post ప్రయివేట్ పాఠశాలల మధ్య పోటీ.. appeared first on Navatelangana.

అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని అన్నారు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం, ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం అని, విద్వేష రాజకీయాలపై వివేకపు గెలుపు అని పేర్కొన్నారు. విభజన రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యత, లౌకిక విలువలకే ప్రజలు పెద్దపీట వేస్తారని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని చెప్పారు. కేరళం ప్రజలు విద్వేషానికి తావులేకుండా, అభివృద్ధిని, ఐక్యతను ఎంచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్యానించారు. కేరళంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు, తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాం

పశ్చిమ బెంగాల్లో కమలం వికసించిందని.. బంగాల్లోని ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించిన నేపథ్యంలో మోడీ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో బిజెపి బలమైన ఎన్నికల ప్రదర్శన కనబరిచినందని.. ఆ రాష్ట్రాల ప్రజలకు తాను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. "లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి బీజేపీ కార్యకర్త మరోసారి అద్భుతాలు సృష్టించారని.. వారు కమలాన్ని వికసింపజేశారని అన్నారు.బిజెపికి బెంగాల్ ప్రజలు మద్దతుగా నిలిచారని.. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. బెంగాల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. కాగా, బెంగాల్ లో మొత్తం 294 స్థానాల్లో బిజెపి 206 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా జిహెచ్ఎంసి, ఖైరతాబాద్ సర్కిల్ జూనియర్ అసిస్టెంట్ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జిహెచ్ఎంసి, ఖైరతాబాద్ జోన్, బోరబండ 37 సర్కిల్లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో బి. శ్రీలత జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. బాధితుడు ఇంటి నిర్మాణానికి మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఇంటి నిర్మాణ అనుమతి కోసం జూనియర్ అసిస్టెంట్ను సంప్రదించగా, రూ.5లక్షలు ఇస్తే అనుమతి ఇస్తామని చెప్పింది. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మొదటి విడతగా లక్ష రూపాయలు యూసుఫ్గూడ చెక్పోస్టు వద్ద బాధితుడు జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీలతకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యాడెడ్గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జూనియర్ అసిస్టెంట్కు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు పంపించారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్.. బిజెపి, సిఎం మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి)ని చిత్తుగా ఓడించింది. మొత్తం 294 స్థానాలకు 206 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉండగా.. టిఎంసి కేవలం 81 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. దీంతో తొలిసారి బెంగాల్ లో కషాయ జెండా ఎగరనుంది. ఇక, అస్సాంలో బిజెపి 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 102 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.


ఐపిఎల్ 2026లో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా లక్నోను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ముంబై బరిలోకి దిగుతోంది.జట్ల వివరాలు:లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్ఫర్, రఘు శర్మ


తమిళనాడులో యువతరాన్ని టివికె చీఫ్ విజయ్ ఆకట్టుకున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టివికె గెలుస్తుందని తాము చెపితే అందరూ నవ్వారని.. ఇప్పుడు నవ్విన నాపచేసే పండినట్లు అయిందని అన్నారు. యువతతోపాటు మహిళలు కూడా విజయ్ వాగ్దానాలను నమ్మారని ప్రదీప్ గుప్తా టివికె విజయ రహస్యం గురించి విశ్లేషించారు. 18 నుంచి 39 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా టివికెకు ఓటేస్తారని తాము తెలిపామని గుర్తు చేశారు. తమిళనాడులో ఈ పరిధిలోని వారు దాదాపుగా 42 శాతం దాకా ఉన్నారని వివరించారు.25 నుంచి 30 శాతం దాకా ఉన్న 40 సంవత్సరాలు దాటిన వారు కూడా టివికెకు ఎక్కువగా ఓటేశారని తమ లెక్కలు తెలిపారు. డిఎంకె తరువాత ఎక్కువగా మహిళలు టివికెకు ఓటేస్తారని తాము విశ్లేషించామని, అయితే ఇందుకు భిన్నంగా ఈ కేటగిరిలో కొంచెం ఎక్కువగానే మహిళల ఓట్లు టివికెకు పడ్డాయని గుప్తా వెల్లడించారు.

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వజ్రేష్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మల్కాజిగిరి ఎంపి ఈటేల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ముప్పు రామారావు, జేఏసి ప్రతినిధులు శంకర్ నారాయణ, పద్మచారి, ఎనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, గావిని స్వర్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.


సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ 2026 -27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టిజిఎస్డబ్లుఆర్జెసి సెట్ హాల్టికెట్లు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష మే 15న శుక్రవారం నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్లు మే 5 నుండి 14 వరకు అధికారిక వెబ్సైట్ rjcet.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట(D) కుకునూర్పల్లి(M) లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గమధ్యలో లకుడారం స్టేజీ వద్దకు రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. The post లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు appeared first on Navatelangana.

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం పరాజయం పాలవడంతో, ఐదు దశాబ్దాల తర్వాత భారత్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడింది. 2016లో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, దేశంలో మిగిలిన చివరి కమ్యూనిస్టు పాలనగా నిలిచింది.సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వానికి కేరళలో ఎదురైన ఈ ఓటమి, తరతరాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కార్యకర్తలు ఇప్పటివరకు చూడని రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు. ఈ ఫలితంతో దేశ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది.చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ నిరంతరంగా అధికారంలో కొనసాగింది. త్రిపురలో 1993 నుంచి 2018 వరకు లెఫ్ట్ పాలన కొనసాగింది. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారంలోకి వచ్చి, 2021లో ఆ ట్రెండ్ను అధిగమిస్తూ వరుసగా రెండోసారి గెలిచి ప్రత్యేకతను సాధించింది. అయితే 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు తెరదించింది. అదే విధంగా 2018లో త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ పాలనను బీజేపీ అప్రతిహతంగా ముగించింద

వస్తూ వస్తూనే తమిళనాడులో హిట్ కొట్టిన విజయ్ వెనువెంటనే తమ టివికె పార్టీ ఎన్నికల వాగ్దానాలపై దృష్టి సారించారు. ముందుగా తమిళ ఆడపడుచులకు ప్రకటించిన కానుకల విషయంపై పట్టుదలతో ఉన్నారని వెల్లడైంది. పెళ్లి సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, కుటుంబంలో మహిళ పేరిట ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాసు సిలిండర్లు, 60 ఏండ్ల లోపు మహిళలకు మాసానికి రూ 2500 వరకూ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన విజయ్ ఇప్పుడు దీనిని నిలబెట్టుకునే దిశలో ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగారు. 22 క్యారట్ల బంగారం ధర ఇప్పుడు గ్రాముకు రూ 14000 వరకూ పలుకుతుంది. పెళ్లి అప్పుడు మహిళలకు అందించే బంగారం అపార విశ్వాసం పాదుకునేలా చేస్తుంది. వధువుకు నాణ్యమైన పట్టు చీర, తమిళ సాంప్రదాయాల మధ్య అందించడం జరుగుతుందని కూడా విజయ్ పార్టీ హామీ ఇచ్చింది. బంగారం, పట్టుచీర సెంటిమెంట్ ఎన్నికలలో బాగా పండిందనే విషయాన్ని విజయ్ తెరవెనుక వారు తేల్చిచెపుతున్నారు.సోమవారం మధ్యాహ్నానికి వెలువడ్డ ఫలితాలతో విజయ్ పార్టీ సాధారణ మెజార్టీ బలం 118 కన్నా అతి కొద్దిగా తక్కువ స్థానాలు వచ్చాయి. అయితే తరువాతి ముఖ్యమంత్రి విజయ్ అనేది స్పష్టం అయింది. ఎన్నికల పత్రంలో విజయ్ పార్టీ అందరికి నా