24265 వార్తలు

నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఎపి ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఎపి ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు కృష్ణా బేసిన్లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్తో సంబంధం లేని ప్రాంతాలకు ఎపి నిబంధనలు ఉల్లంఘిస్తూ, యదేఛ్చగా నీటిని తరలిస్తోందని విమర్శించారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాటా నీటిని ఎపి తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు..? అని ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది


న్యూఢిల్లీ: ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం విడుదలైంది. మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లలో 47.56 లక్షల మందికి పైగా పేర్లు ఈ జాబితాలో లేవు. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరి పేరు తొలగించినట్లయింది. పేర్లు గల్లంతైన వారు సెప్టెంబరు 30 వరకు ఫారం-6, సంబంధిత ఆధారాలను సమర్పించి ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలని కోరవచ్చు. తుది ఓటర్ల జాబితాను నవంబరు 4న ప్రకటించనున్నట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులు తెలిపారు.సవరించిన ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అభ్యంతరాలు, దావాలను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతుంది. నోటీసులు జారీ చేయడం, వాటిపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ అక్టోబరు 29 వరకు కొనసాగనుంది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే.. ముసాయిదా దశలో ఢిల్లీలోనే అత్యధికంగా 33 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు అధికారులు తెలిపారు. సంఖ్యాపరంగా చూస్తే ఢిల్లీలో తొలగించిన 47 లక్షలకుపైగా ఓటర్ల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్న వాటిలో ఒకటని అధికారులు పేర్కొన్నారు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీలో వలసలు, రాకపోకలు ఎక్కువగా ఉండే జనాభా అధికంగా ఉంటుందని,

ప్రజలు ఇచ్చిన తీర్పుతో వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వెలిగొండ తొలిదశ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని రెండు సొరంగాల నుంచి ప్రవహించిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి.. జలహారతితో స్వాగతించారు. సీఎం చంద్రబాబు నీళ్లలోకి దిగి పసుపు, కుంకుమ, చీర సమర్పించి ..సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 1996లో ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేశానని, 30 ఏళ్ల తరువాత ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నానని తెలిపారు. మార్కాపురం గడ్డకు.. కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్ బాధలను భరించిన కుటుంబాలకు.. నీటి కోసం ఎదురు చూసి చూసి అలసిన తరాలకు... కృష్ణా జలాలతో కొత్త ఊపిరినిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్ట్కు భూములు, ఇళ్లు, ఊళ్లు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రైతుల త్యాగం లక్షలాది మంది జీవి

ఖాట్మండూ: నేపాల్ను అతలాకుతులం చేసిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య సోమవారం నాటికి 903కు చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతుండగా, మరో 4,247 మంది ఇప్పటికీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ఇంతవరకూ చిత్వాన్లో 272, నావల్పరాసి ఈస్ట్లో 207, నావల్పరాసి వెస్ట్లో 151, గోర్ఖా జిల్లాలో 62 మృతదేహాలను వెలికితీసినట్టు జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ (ఎన్డిఆర్ఆర్ఎంఏ) ప్రకటించింది. నువాకోట్లో 95, ధాదింగ్లో 55, తనహులో 37, రసువాలో 24 మృతదేహాలు సైతం లభ్యమయ్యాయి. ఈ విపత్తులో 99 మంది భద్రతా సిబ్బంది, 591 మంది విదేశీయులు సహా 4,247 మంది గల్లంతైనట్టు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచరియలు విరిగిపడి దిగువన ఉన్న బోటేకోషికి చేరుకోవడంతో వరద ప్రవాహం ఊళ్లను ఊళ్లు ముంచెత్తింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. చైనా వైపు కూడా ఈ విపత్తులో 16 మంది మరణించగా, టిబెట్లో దాదాపు 550 ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని చైనా మీడియా చెబుతోంది.మళ్లీ పొంగుతున్న బోటేకోషిమరోవైపు, బోటేకోషి నదిలో నీటిమట్టం పెరిగిందని ఎన్డిఆర్ఆర్ఎంఎ హెచ్చరించింది. ఆదివారం వరకూ వరద ప్రభావ

ఖాట్మండూ: సున్నితమైన హిమాలయ ప్రాంతాన్ని ప్రభావితం చేసే విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, సహకారాన్ని బలపేతం చేసేందుకు ఐదు దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలని భారత ఆధ్యాత్మిక గురువు సద్గురు జగదీశ్ వాసుదేవ్ పిలుపునిచ్చారు. భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్లతో ఈ హిమాలయ బోర్డు ఏర్పాటు కావాలన్నారు. ఖాట్మండులో జరిగిన ‘ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని ఈషా పౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా-నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాలను భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో వందలాది మంది మరణించగా, ఈషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికుల ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సద్గురు...ఐదు దేశాలతో హిమాలన్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అన్ని దేశాలు పంచుకునే పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయ అనుబంధం తెలియదు. మీరు మాట్లాడే భాష ఏమిటో కూడా వాటకి తెలియదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణ స

నిజామాబాద్: సొంత కుటుంబమే తనను బయటకు పంపిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం జిల్లాల్లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ.. జిల్లాలో బిఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిల గెలుపు కోసం కష్టపడ్డానని.. కానీ, వారు కుట్ర చేసి తనను ఓడగొట్టారని అన్నారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోగానే.. ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరపారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. కానీ సొంత కుటుంబం తనను బయటకు పంపిందంటూ చెబుతూ కవిత భావోద్వేగానికి గురయ్యారు."ఏం తప్పు చేశానని నన్ను తీహాడ్ జైలులో పెట్టారు?. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి కర్కశంగా నన్ను బయటకు పంపారు. అమ్మ ఇంటివాళ్లు నిర్దాక్ష్యణ్యంగా తరిమేస్తే అత్తింటి వాళ్లు కన్న బిడ్డలా నన్ను అక్కున చేర్చుకున్నారు. సొంతూరుకు వచ్చాక ఆపుకుందామన్న కన్నీళ్లు ఆగడం లేదు. అలాగని నేను పిరికిదాన్ని కాదు. నాలుగేళ్లు ఈడీ, సీబీఐ ఇబ్బంది పెట్టినా ధైర్యం సడలలేదు.. దారి తప్పలేదు. ఏ తప్పు చేయకుండానే జైల్లో పెట్టారు.. అప్పుడే నేను ఏ తప్పు చేయలేదని చెప్పా. నా పెట్టిన

కైరో: కదులుతున్న ట్రక్కు నుంచి 105 కిలోల చికెన్ని ఓ దొంగల ముఠా చోరీ చేసింది. సినిమాల్లో లాగా ట్రక్కు రన్నింగ్లో ఉండగానే చోరీ చేశారు. ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ జరుగుతుండగా మరో వాహదారుడు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు నాలుగు టన్నుల ఫ్రీజ్ చేసిన చికెట్ తరలిస్తున్న ట్రక్కును ఈ ముఠా టార్గెట్ చేసింది. కారు వెనకే వెళ్లిన దుండగులు అనుమానం రాకుండా ట్రక్కుపైకి ఎక్క వెనుకవైపు ఉన్న డోర్ తెరిచారు. అనంతరం కదులుతున్న వాహనాల నుంచి చికెన్ డబ్బలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీన్ని మరో వ్యక్తి వీడియో తీయగా.. అది చూసిన డ్రైర్ అసలు చోరీ జరిగినట్లు తనకు తెలియదని అన్నాడు. మొత్తంగా తన ట్రక్కు నుంచి 105 కిలోల చికెన్ను ఎత్తుకెళ్లినట్లు డ్రైవర్ చెప్పాడు. వీడియో ఆధారంగా కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు అనుమానితులను గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులు మరణించగా.. మరో ముగ్గురిని అదు



నిజామాబాద్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ తప్పూ చేయకున్నా తిహాడ్ జైలులో పెట్టారని అన్నారు. తండ్రిని బిడ్డను వేరు చేయడంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిదే మొదటి పాత్ర అని దుయ్యబట్టారు. ఆయన శకుని పాత్ర పోషించినట్లు ఆరోపించారు. నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్య సభలో కవిత మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ‘‘హరీశ్రావునో, సంతోష్రావునో క్షమిస్తాను కానీ, ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించను. ఆయనకు నా ఉసురు తగులుతుంది. ప్రశాంత్ రెడ్డిని కెసిఆర్ కుమారుడిలా చూసుకుంటే.. ఆయన మా మధ్య చిచ్చుపెట్టారు. కెసిఆర్ ప్రభుత్వం దిగిన రెండో రోజే ఆయన కాంగ్రెస్ పార్టీతో మాట్లాడారు. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నెల రోజులు అమెరికాలో ఉండి వేం నరేందర్రెడ్డితో సంప్రదింపులు జరిపారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజా జీవితం లేదు. ఆయన బాల్కొండ నుంచి పారిపోవాలి. ఆయన వైఖరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంది. ఆక్ష్న మంత్రి కావడానికి నేను ఎంతో ప్రయత్నం చేశా. ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజి రెడ్డి, ఆనాటి బోధన్ ఎమ్మెల్యేను గెలిపించడానికి ఎంతో కష్టపడ్డాను. అయితే వారందరూ నన్ను పరాజి


హైదరాబాద్: హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని.. ప్రపంచంతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సిఎం అన్నారు. సోమవారం సిఎం రేవంత్ అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మూసారాంబాగ్లో మూసీ నదిపై కొత్తగా నిర్మించి హైలెవల్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. తర్వాత అంబర్ పేటలోని జిహెఎంసి స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్ గిరి.. మూడు కార్పొరేషన్ల కొత్త లోగోలను రేవంత్ ఆవిష్కరించారు.అనంతరం సిఎం మాట్లాడుతూ.. "అంబర్పేట నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మూసీ పక్కన నివసించే పేదలను చూడలేని పరిస్థితి. కాస్త వర్షం పడితే చాలు బ్రిడ్జిపైనుంచి నీరు ప్రవహిస్తుంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ వంతెనను ఎందుకు కట్టలేదు. గత సర్కారు అంబర్పేటలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు" అని విమర్శించారు.హైదరాబాద్ మహా నగరం గొప్పగా అభివృద్ధి చెందుతోందని... అన్ని వర్గాల వారికి ఈ నగరం ఆశ్రయమిచ్చిందన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగడం లేదన్నారు. ప్రణాళికబద్ధం

దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్తో జరుగుతున్న సెమీ ఫైనల్ పోరులో సౌత్ జోన్ ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 40/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు సోమవారం ఆటను కొనసాగించిన సౌత్ జోన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 285/9 స్కరో చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 90 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ తిలక్ వర్మ (106 నాటౌట్) శతకం సాధించాడు. ఏడో స్థానంలో వచ్చిన శ్రేయస్ గోపాల్ (88) సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ జోడీ ఆరో వికెట్కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.


హైదరాబాద్: మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పాత వంతెన కూల్చివేసి మరింత ఎత్తులో కొత్త వంతెనను ప్రభుత్వం నిర్మించింది. రూ.52 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 400 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి అంబర్పేట-మూసారాంబాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తూ, వాహనదారులకు సురక్షితమైన రాకపోకలకు మార్గం సుగమం చేయనుంది. పాదచారుల కోసం 3.5 మీటర్ల ఫుట్పాత్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, వర్షకాలంలో పాత వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై దృష్టిపెట్టిన ప్రభుత్వం కొత్త వంతెనను నిర్మించింది. దీంతో మూసీ వరద మూసీ వరదల సమయంలోనూ రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్మించిన ఈ హైలెవల్ బ్రిడ్జితో 365 రోజులూ మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.


ఆకస్మికంగా వచ్చిన జల ప్రళయంతో నేపాల్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ఉపద్రవంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. దీని కారణంగా నేపాల్ ఇప్పట్లో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా నేపాల్కు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తాజాగా కొరియన్ పాప్స్టార్ లీ నో తన దాతృత్వం చాటుకున్నారు. నేపాల్ వరద బాధితులకు 100 మిలియన్ వన్ల(భారత కరెన్సీలో రూ.69 లక్షలు) విరాళమిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపించారు. ‘‘ఈ కష్ట సమయంలో నేపాల్ను ఆదుకునేందుకు నా వంతు ప్రయత్నం చేశా. వీలైనంత త్వరగా ఆ దేశ ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని లీ నో ఈ సందర్భంగా వెల్లడించారు. సామాజిక సేవలో లీ నో ఎప్పుడూ ముందుంటారు. 2014 నుంచి వరల్డ్ విజన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల సంరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తున్నారు. 2024లో ఆహార సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు 100 మిలియన్ వన్ల విరాళం అందించారు. గతేడాది కూడా తన పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ



భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ 57 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో అర్థ శతకం సాధించిన అతడు.. దులీప్ ట్రోఫీలో అతి చిన్న వయస్సులోనే (15 ఏళ్ల 157 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉండేది. 1969లో ఆయన దులీప్ ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు. 2005లో పీయూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 81 బంతులు ఎదురుకున్న వైభవ్ 92 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈస్ట్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఈస్ట్ జోన్ బ్యాటింగ్లో వైభవ్ 92 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (69) రాణించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (16) నిరాశపరిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు.

