🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3320 వార్తలు

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు
పాత
తెలంగాణ

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు

రోహిణి కార్తె రాకముందే రాష్ట్రంలో సూర్యుడు మంటెక్కిస్తున్నాడు. వడ గాలులు తీవ్రతతో ఎండ వేడిమి తారా స్థాయి చేరుకుంది. అనేక ప్రాంతాల్లో గత పది రోజులుగా 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. ఆదివారం భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం రాష్ట్రంలోని విచిత్ర వాతావరణ పరిస్థితికి అద్దం పడుతుంది. మరో రెండు రోజుల పాటు ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, తరువాత క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీట

వెస్ట్ బెంగాల్ కౌంటింగ్ లో ఉద్రిక్తత... టీఎంసీ ఆఫీసు దగ్ధం..పోలీసుల లాఠీఛార్జ్..
పాత
రేపు సిరిసిల్లకు డిప్యూటీ సీఎం భట్టి
పాత
తెలంగాణ

రేపు సిరిసిల్లకు డిప్యూటీ సీఎం భట్టి

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేర్కొన్నారు. ఈనెల 5న ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల పర్యటన ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12:15 గంటలకు గంభీరావుపేట గ్రామానికి మంత్రుల బృందం చేరుకుని, గంభీరావుపేటలో […] The post రేపు సిరిసిల్లకు డిప్యూటీ సీఎం భట్టి appeared first on Navatelangana.

ఓటమికి బాటలేసుకున్న దీదీ..
పాత
తెలంగాణ

ఓటమికి బాటలేసుకున్న దీదీ..

ఆర్‌జి కర్ ఘటన, సందేశ్ ఖలీ అమానుషాలతో జనంలో పలచననేతల అవినీతి, నిరుద్యోగ యువతలో నైరాశ్యం సర్‌తో టిఎంసి మరింత చతికిల బిజెపికి కలిసి వచ్చిన ప్రభుత్వంపై సహజ వ్యతిరేకత కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా మూడు పర్యాయాలు ఏలిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసిని అధికారం నుంచి భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు గద్దె దించగలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకుల ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఈ కాషాయ పార్టీ, అత్యధిక కాలం వామపక్ష రాజకీయాల ఆధిపత్యం కొనసాగిన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఇంతగా ఆదరణ కోల్పోవడానికి మమతా బెనర్జీ చేసిన తప్పులే ఆమె పార్టీ మెడకు చుట్టుకున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమికి తానే స్వయంగా దారులు పరుచుకున్నరాని పేర్కొంటున్నారు. ఆర్‌జి కర్ ఘటన నుంచి మొదలు పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పతనానికి నాంది పడింది. ఒక యువ వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం: ఎంకే స్టాలిన్‌
పాత
తమిళనాడు ఎన్నికల్లో ఓటమిపై స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్
పాత
10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరిక
పాత
తెలంగాణ

10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరిక

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పదవ వార్డు కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి, మాజీ కౌన్సిలర్ బోల్గాం నాగరాజు లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారక రామారావు వారికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ తుల ఉమ, గూడూరి ప్రవీణ్, గాజుల శ్రీనివాస్, గుండ్ల పెళ్లి పూర్ణచందర్, సంపత్, కొండ […] The post 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరిక appeared first on Navatelangana.

‘ప్రెప్‌మంకీ’ యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
పాత
తెలంగాణ

‘ప్రెప్‌మంకీ’ యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

యుపిఎస్‌సి సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను రాష్ట్ర ఐటి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. డిజిటల్ విద్యా విప్లవంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. విద్యా నిపుణులు,సాంకేతిక నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్‌లో స్మార్ట్ నోట్స్, సమాధానాల మూల్యాంకనం, అనుకూల ప్రశ్నా బ్యాంకులు, తక్షణ పనితీరు విశ్లేషణ, మెంటార్ సహాయం వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రెప్‌మంకీ వ్యవస్థాపక బృందంలో తలశిల రంజిత్, సుధాకర్, రామ్ అభినవ్ తేజ్, పావని, ఆకాశ్, మేఘనా రెడ్డి ఉన్నారు.

కేరళం సీఎం పినరయి విజయన్ రాజీనామా
పాత
విజయ్ సంచలన విజయం.. పికె ఏడాది క్రితమే చెప్పాడు
పాత
తెలంగాణ

విజయ్ సంచలన విజయం.. పికె ఏడాది క్రితమే చెప్పాడు

న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం మరోసారి నిజమైంది. తమిళనాడులో సారి విజయ్ సారధ్యంలోని టివికె 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని గత ఏడాది మార్చిలో కుండబద్ధలు కొట్టారు. పికె ఏడాది క్రితమే చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఈ వీడియో దాచి పెట్టుకోండి. ఫలితాల తరువాత ప్లే చేయండి’ అని ఆ వీడియోలో ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. ప్రశాంత్ కిషోర్ గత ఏడాది మార్చిలో తంతి టివికి ఇంటర్వ్యూ ఇచ్చారు. టివికెకు ఏడాది నిండిన సందర్భంగా ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ ఆ మేరకు సమాధానమిచ్చారు. విజయ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారని, అదే జరుగుతుందని అనుకుంటున్నానని పికె అప్పుడు పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ ‘ఐ-ప్యాక్’ పొలిటికల్ వ్యూహాత్మక సంస్థ తమిళనాడులో టివికెతో కలిసి పనిచేసిందనే వార్తలు కూడా వచ్చాయి.కానీ వాటిని ఆయన తోసిపుచ్చారు. తాను విజయ్ మంచి స్నేహితులమని తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి
పాత
మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం: గాదె ప్రభాకర్ రెడ్డి
పాత
తెలంగాణ

మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం: గాదె ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ – పరకాల రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ఆయన, వరి, మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు […] The post మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం: గాదె ప్రభాకర్ రెడ్డి appeared first on Navatelangana.

రాజుల కొత్త పెల్లిలో కాంటాలు ప్రారంభించాలి
పాత
తెలంగాణ

రాజుల కొత్త పెల్లిలో కాంటాలు ప్రారంభించాలి

సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటాలు ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు డిమాండ్ చేసినట్లు తెలిపారు.  సోమవారం సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసం పెల్లి సైదులు మాట్లాడుతూ.. ఎండనక వాననక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు దాటిన ఇంతవరకు కాంటాలు ప్రారంభించకపోవడం […] The post రాజుల కొత్త పెల్లిలో కాంటాలు ప్రారంభించాలి appeared first on Navatelangana.

టివికె అభ్యర్థి బాబు చేతిలో సిఎం స్టాలిన్ పరాజయం
పాత
తెలంగాణ

టివికె అభ్యర్థి బాబు చేతిలో సిఎం స్టాలిన్ పరాజయం

తమిళనాడు లోని అత్యంత కీలకమైన కొళత్తూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. అయితీ ఈ ఎన్నికల్లో సిఎం స్టాలిన్ ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో పరాజయం పొందారు. ఈ ఫలితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ద్రవిడమున్నేట్ర కజగం అధినేత స్టాలిన్ కన్నా బాబుకు 9492 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2011 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో కొళత్తూరు నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పుడు డిప్యూటీ సిఎంగా ఉన్న స్టాలిన్ కేవలం 2734 ఓట్ల తేడాతో ఏఐఎడిఎంకె అభ్యర్థి సైదై దురైస్వామిని ఓడించారు. 2016,2021 ఎన్నికల్లో కూడా క్రమంగా 37730,70384ఓట్ల ఎక్కువ మెజార్టీలతో స్టాలిన్ గెలుపొందారు. అంతకు ముందు తౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ పోటీ చేసేవారు. ఆ తరువాత కొళత్తూరు నియోజకవర్గం మారారు. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన పాత నియోజకవర్గం నుంచి గెలిచారు.

అజిత్ పవార్ సతీమణి ఘన విజయం
పాత
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించేందుకు ఏర్పాటు
పాత
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించేందుకు ఏర్పాటు

రెండు కేసులు నమోదు : డిటిఓ జైపాల్ రెడ్డి నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను డీసీఎంలను పంపించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మహబూబాద్ డిటిఓ జైపాల్ రెడ్డి, ఎం వి ఐ సాయి చరణ్, వెంకటరెడ్డి, తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం వాహనాలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో తనిఖీలు చేస్తున్నామని ఇందులో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాహనాలను పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని […] The post ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించేందుకు ఏర్పాటు  appeared first on Navatelangana.

నందిపాడులో ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”
పాత
తెలంగాణ

నందిపాడులో ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”

– పంట మార్పిడితో సుస్థిర ఆదాయం సాధ్యం– సేంద్రియ విధానాలతో నేల సారాన్ని కాపాడాలినవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నందిపాడు లో సోమవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పంటల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం, వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన విభాగం ప్రొఫెసర్, హెడ్ […] The post నందిపాడులో ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” appeared first on Navatelangana.

విజయం విజయ్‌దే అంటే అంతా నవ్వారు..
పాత
తెలంగాణ

విజయం విజయ్‌దే అంటే అంతా నవ్వారు..

లెక్కల శాస్త్రం గెలిచిందన్న మై యాక్సిస్ ప్రదీప్తమిళనాడు ఎన్నికల ఫలితాలపై తాజా స్పందన టివికె తొలి ఓటు బ్యాంకులు అత్యంత గణనీయం న్యూఢిల్లీ ః తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టివికె గెలుస్తుందని తాము చెపితే అందరూ నవ్వారని యాక్సిస్ మై ఇండియా సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా తెలిపారు. ఇప్పుడు నవ్విన నాపచేసే పండినట్లు అయిందని సోమవారం ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అనూహ్య రీతిలో టివికె విజయం సాధించడంపై గుప్తా స్పందించారు. పలు ఇతర సంస్థలు ఈ ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకె కూటమి గెలుస్తుందని, అన్నాడిఎంకె గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషించాయి. అయితే ఒక్క యాక్సిస్ మై ఇండియానే ఇందుకు భిన్నంగా విజయ్‌దే గెలుపు అని స్పష్టం చేసింది. ఇది జోస్యం అనుకునేరు. లెక్కలు గణాంకాల శాస్త్రం దక్కించుకున్న విజయం అని గుప్తా తెలిపారు. 234 స్థానాల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి కూడా డిఎంకెకు పెద్దగా పోటీ ఉండబోదని పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేల దశలో తెలిపాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఒక్కటే విజయ్ తొలి ప్రవేశంతోనే అద్భుతాలు సృష్టిస్తాడని, టివికెకు 98 నుంచి 120 వరకూ స్థానాలు వస్తాయని తెల

ప్రయివేట్ పాఠశాలల మధ్య పోటీ..
పాత
కేరళం ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారు: మంత్రి శ్రీధర్‌బాబు
పాత
తెలంగాణ

కేరళం ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారు: మంత్రి శ్రీధర్‌బాబు

అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని అన్నారు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం, ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం అని, విద్వేష రాజకీయాలపై వివేకపు గెలుపు అని పేర్కొన్నారు. విభజన రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యత, లౌకిక విలువలకే ప్రజలు పెద్దపీట వేస్తారని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని చెప్పారు. కేరళం ప్రజలు విద్వేషానికి తావులేకుండా, అభివృద్ధిని, ఐక్యతను ఎంచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్యానించారు. కేరళంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు, తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాం

ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
పాత
తెలంగాణ

ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ

పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించిందని.. బంగాల్‌లోని ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించిన నేపథ్యంలో మోడీ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో బిజెపి బలమైన ఎన్నికల ప్రదర్శన కనబరిచినందని.. ఆ రాష్ట్రాల ప్రజలకు తాను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. "లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి బీజేపీ కార్యకర్త మరోసారి అద్భుతాలు సృష్టించారని.. వారు కమలాన్ని వికసింపజేశారని అన్నారు.బిజెపికి బెంగాల్‌ ప్రజలు మద్దతుగా నిలిచారని.. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. బెంగాల్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. కాగా, బెంగాల్ లో మొత్తం 294 స్థానాల్లో బిజెపి 206 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి జూనియర్ అసిస్టెంట్
పాత
తెలంగాణ

ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి జూనియర్ అసిస్టెంట్

ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా జిహెచ్‌ఎంసి, ఖైరతాబాద్ సర్కిల్ జూనియర్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిహెచ్‌ఎంసి, ఖైరతాబాద్ జోన్, బోరబండ 37 సర్కిల్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో బి. శ్రీలత జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. బాధితుడు ఇంటి నిర్మాణానికి మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఇంటి నిర్మాణ అనుమతి కోసం జూనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించగా, రూ.5లక్షలు ఇస్తే అనుమతి ఇస్తామని చెప్పింది. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మొదటి విడతగా లక్ష రూపాయలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద బాధితుడు జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీలతకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జూనియర్ అసిస్టెంట్‌కు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు పంపించారు.

పశ్చిమ్ బెంగాల్, అస్సాంలో బిజెపి ఘన విజయం
పాత
Advertisement