
3759 వార్తలు
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సర్పంచ్లు బండి స్వామి, జంగిడి […] The post నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బొమ్మ రజిత, సిఈఓ సంతోష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ 17 శాతం మించకుండా పాక్యూ వచ్చిన తరువాత టోకెన్ తీసుకొని విక్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. The post ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. ముందస్తుగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని, అదేవిధంగా ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి రెవిన్యూ డివిజనల్ […] The post ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, పల్లెర్ల మధు, […] The post నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ appeared first on Navatelangana.

ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కొత్త ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.86,999. ఈ కొత్త మోడల్ పాత వెర్షన్ కంటే రూ.2,099 ఎక్కువ ఖరీదైనది.అయితే, కంపెనీ రోజువారీ వినియోగానికి సులభతరం చేసేలా అనేక మార్పులు చేసింది. కొత్త ఆంపియర్ మాగ్నస్ నియోలో 3.5-అంగుళాల LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది స్పీడ్, బ్యాటరీ శాతం, ఇతర సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో LED హెడ్లైట్, టెయిల్ల్యాంప్, ఇండికేటర్లతో సహా పూర్తి LED లైటింగ్ సెటప్ కూడా ఉంది. ఈ స్కూటర్లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా ప్రయాణంలో మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది సీటు కింద 22-లీటర్ల ఉపయోగకరమైన స్టోరేజ్ను కూడా అందిస్తుంది. సౌకర్యవంతమైన సీటు డిజైన్కంపెనీ ఈ స్కూటర్లోని సీటును అప్డేట్ చేసింది. ఈ కొత్త సీటు సుదూర ప్రయాణాలలో కూడా రైడర్కు మరింత సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు. దీని ఎర్గోనామిక్ డిజైన్ రైడింగ్ను సులభతరం చేస్తుంది. తక్కువ అలసట కలిగిస్తుంది.
– యూనియన్ మరింత బలోపేతంనవతెలంగాణ – కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘాల్లో కీలక పరిణామంగా, ఏఐటీయూసీ అధ్యక్షుడు నర్సింగరావు తన అనుచరులతో కలిసి మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ( సిఐటీయూ ) యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కందారం రాజనర్సు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వారికి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కందారం రాజనర్సు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ నుంచి […] The post సిఐటీయూలోకి ఏఐటీయూసీ నాయకుల చేరిక appeared first on Navatelangana.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యనవతెలంగాణ – ఆలేరు రూరల్గోలనుకొండ గ్రామం భక్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపనతో పాటు అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆయన […] The post భక్తికొండగా మారుతున్న గోలనుకొండ appeared first on Navatelangana.




ప్రతి ఏడాది భారత ఆటో మొబైల్ మార్కెట్లో లక్షలాది వాహనాలు అమ్ముడవుతుంటాయి. ముఖ్యంగా, కార్ల విషయానికి వస్తే తయారీదారులు వివిధ సాంకేతికతలతో కార్లను విక్రయిస్తున్నారు. అనేక కార్లు సీఎన్జీతో కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో ఏ కార్లకు అత్యధిక డిమాండ్ ఉంది. టాప్ 5 CNG కార్లలో ఏ తయారీదారుల కార్లు చోటు దక్కించుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మారుతి ఎర్టిగామారుతి సిఎన్జి ఇంజిన్లతో అనేక కార్లను విక్రయిస్తుంది. ఈ తయారీదారు బడ్జెట్ MPV విభాగంలో ఎర్టిగాను విక్రయిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ MPV సిఎన్జి వేరియంట్లలో 1.45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 2. మారుతి డిజైర్ మారుతి కాంపాక్ట్ సెడాన్ అయిన డిజైర్ను కూడా సిఎన్జితో అందిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ కారు సిఎన్జితో 1.35 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. 3. మారుతి వాగన్ ఆర్ భారత మార్కెట్లో మారుతి వాగన్ ఆర్ చాలా కాలంగా సిఎన్జితో అందుబాటులో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సిఎన్జి వేరియంట్లలో తయారీదారు 96,000 యూనిట్లకు పైగా విక్




ఐపిఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ విజయ పరంపరకి రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్రేక్ వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ(43) కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ ఈ సీజన్లో 400 పరుగుల మైలురాయిని చేరుకొని లీడింగ్ స్కోరర్గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు జైస్వాల్ నుంచి వైభవ్ ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. ఈ సందర్భంగా జైస్వాల్ని ఓ సీనియర్గా వైభవ్తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించారు. సీనియర్ అనడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన యశస్వి ఆ తర్వాత స్పందించాడు. ‘‘నేను పెద్దవాడిని అని అనుకోవడం లేదు. నేను ఇంకా చాలా చిన్నవాడినే. కాకపోతే నాకంటే వైభవ్ చాలా చిన్నోడు. దీని గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అవతలి ఎండ్లో నిలబడి ఈ కుర్రాడు నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్నిచూసి నేను ఎప్పుడూ సంతోషిస్తాను’’ అని జైస్వాల్ అన్నాడు.


లెనోవో తన కొత్త ప్రీమియం టాబ్లెట్ లెనోవో ఐడియాట్యాబ్ ప్రో జెన్ 2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ అద్భుతమైన డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ లైఫ్ను కలిగి ఉంది. ఇది అనేక ఆన్-డివైస్ AI ఫీచర్లను కూడా కలిగి ఉంది. వినోదం, స్టడీస్, వృత్తిపరమైన పనుల కోసం ఒక ఆల్-రౌండర్ పరికరాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ టాబ్లెట్ అనువైనది. కంపెనీ దీనిని ఆకర్షణీయమైన ధరకు విడుదల చేసింది. ఇది ప్రీమియం టాబ్లెట్ విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 ధర, లభ్యతకొత్త లెనోవో టాబ్లెట్ 8GB RAM + 256GB స్టోరేజ్తో కూడిన ఏకైక వేరియంట్ కోసం రూ.39,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ టాబ్లెట్ సేల్స్ వచ్చే నెల మే 1వ తేదీన కంపెనీ వెబ్ సైట్, ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 పై రూ.3,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ను కూడా పొందవచ్చు. ఈ టాబ్లెట్ క్లౌడ్ గ్రే, జెల్లీ మింట్ మరియు లూనా గ్రే రంగులలో లభిస్తుంది. లెనోవో ఐడియా ట్యాబ్



స్మార్ట్ ఫోన్ సంస్థ పోకో ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని పోకో C81 ప్రో పేరిట విడుదల చేసింది. వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉన్న ఈ పరికరాన్ని కంపెనీ తన C-సిరీస్ కింద పరిచయం చేసింది. ఇందులో యూనిసోక్ T7250 చిప్సెట్ కూడా ఉంది. ఈ పరికరం 6.9-అంగుళాల HD+ LCD డిస్ప్లే, 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు పోకో C81 ప్రోకు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. పోకో C81 ప్రో ధరకంపెనీ ఈ పరికరాన్ని మూడు స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర $99 (సుమారు ₹9,300) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 4GB RAM + 128GB, 4GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరుసగా $109 (సుమారు ₹10,000)గా, $129 (సుమారు ₹12,000)గా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఇది భారత టెక్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై పోకో ఇండియా ఇంకా అధికారిక ప్రకటన లేదు. పోకో C81 ప్రో ఫీచర్లుఈ ఫోన్లో 6.9-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది.


