9886 వార్తలు



నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగట్కు ఊరట లభించింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్లో ఆమె ఫిట్నెస్పై నిపుణుల కమిటీ నియమించాలని డబ్ల్యూఎఫ్ఐ(Wrestling Federation of India)ని ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారం విచారణ సందర్భంగా దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, వేడుకగా జరుపుకుంటారని, కాబట్టి ఇలాంటి పరిస్థితులను న్యాయంగా పరిష్కరించాలని కోర్టు సూచించింది. ఫెడరేషన్లోని వివాదాల కారణంగా క్రీడలు దెబ్బతినకూడదని కోర్టు హితువు పలికింది.. మే 9న ఫోగాట్కు డబ్ల్యూఎఫ్ఐ షో-కాజ్ నోటీసు జారీ […] The post ఢిల్లీ హైకోర్టులో రెజ్లర్ వినేష్ ఫొగట్కు ఊరట appeared first on Navatelangana.

– సీఎం సహాయనిధి దరఖాస్తుల సిఫార్సు– స్థానికంగా ఉంటే ప్రజల్లోఎమ్మెల్యే జారె ఆదినారాయణ రోజువారీ దినచర్యనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానికంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, హైదరాబాద్కు వెళ్లిన సందర్భాల్లో నియోజకవర్గ ప్రజలకు వైద్య, సంక్షేమ సేవలు అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న సమయంలో నియోజకవర్గానికి చెందిన రోగులు ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో తెలుసుకుని వారిని పరామర్శించడం, అవసరమైన వారికి ఉచిత వైద్య […] The post హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన appeared first on Navatelangana.

-మూడు గంటల పాటు బైఠాయింపు-కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్నవతెలంగాణ-రాయికల్ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజుల తరబడి అలాగే పేరుకుపోతుండగా, తరలింపు లేక రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతుండగా, మరోవైపు లారీలు, కూలీల కొరత రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. “ప్రతి గింజ కొనుగోలు చేస్తాం”అని ప్రభుత్వం చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల కన్నీటి గాధ ఆగడం లేదు. గత […] The post ధాన్యం తరలింపులో జాప్యం..రోడ్డెక్కిన రైతులు appeared first on Navatelangana.




బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. కొద్ది రోజుల క్రితమే సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. దీనికి అశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ పాటలో చరణ్తో కలిసి శృతి హాసన్ చిందులు వేశారు. చీర.. చొక్కా.. చిక్కెడిపోవాలో.. అంటూ సాగే ఈ పాటలో ఇరువురు డ్యాన్స్ అదరగొట్టారు. ఈ పూర్తి పాటను రేపు భోపాల్లో జరగనున్న ఎఆర్ రెహమాన్ కాన్సర్ట్లో విడుదల చేయనున్నారు.






హైదరాబాద్: కల్వకుంట్ల తిక్కల్ రావు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. కెటిఆర్ పనికిమాలిన మాటలు మానుకోవాలని అన్నారు. అద్దంకి కెటిఆర్ కు కౌంటర్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం అని సిఎం కావాలని కెటిఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటి కొనసాగుతుందని.. ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. బండి భగీరథ్ కేసులో ప్రభుత్వం సరిగా స్పందించిందని నిందితుడిని అరెస్ట్ చేశారని తెలియజేశారు. దొంగలను కాపాడాల్సిన అవసరం సిఎం రేవంత్ రెడ్డికి లేదని అద్దంకి దయాకర్ రావు పేర్కొన్నారు.

దేశ సర్వోన్నత న్యాయస్థానం… సామాన్యుడి ఆఖరి ఆశాదీపం. రాజ్యాంగ నిబంధనలకు, పౌర హక్కులకు రక్షణ కవచం. అటువంటి అత్యున్నత పీఠం నుండి వెలువడే ప్రతి మాట సమాజానికి ఒక దిక్సూచి కావాలి. కానీ, అదే న్యాయస్థానం వేదికగా సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజాస్వామ్యవాదుల గుండెల్లో మంటలు రేపాయి. దేశంలో నిరుద్యోగ యువత ‘బొద్దింకల్లా’ తయారయ్యారని, పనిపాట లేకుండా సోషల్ మీడియాలో తిరుగుతున్నారని, ఆర్టీఐ […] The post నిజమైన పరాన్నజీవులెవరు? appeared first on Navatelangana.

హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ధర్నా చేశారు. వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని.. అన్నదాతను అరిగోసలు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల గోస ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలనే సచివాలయం ఎదుట ధర్నా చేపట్టినట్లు కవిత తెలిపారు. రెండున్నర ఏళ్లలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కవితతోపాటు ఆ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు ఫలక్నుమా పీఎస్కు తరలించారు.



వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ “దర్శకుడు కమల్.. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే చెప్పాడు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పా డు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం సిద్ధమయ్యాక షూటింగ్కి వెళ్లాం. కం టెంట్ కూడా కొత్తగా ఉంటుంది. జూన్ 19న బలమైన కంటెంట్తో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తు లు’ ఆడియెన్స్ ముం దుకు వస్తోంది”అని అన్నారు. దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ “నా డెబ్యూ మూవ

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై జైలులో ఉన్న మాజీ జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి శస్త్రచికిత్స కారణంగా జూన్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆయన విడుదల కానున్నారు. రూ.1 లక్ష ష్యూరిటీ చెల్లించడంతో పాటు, ఈ మూడు రోజుల్లో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది. […] The post మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్కు తాత్కాలిక బెయిల్ appeared first on Navatelangana.

అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని ఎపి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి పుట్టిందే అబద్ధాలపై అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒక అపరిచితుడు అని జగన్ కుటుంబం చేసిన దారుణాలను పార్థశారధి రెడ్డి బయటపెట్టారని, ఆనాడు పులివెందులలో ఘటనలకు బాధ్యుడైన వారు ఇప్పుడు వైసిపిలో ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆనాడు కాంగ్రెస్ నాయకులు, బొత్స కూడా మాట్లాడారని, ఆనాడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో.. అదే తాను చెప్పానని అన్నారు. తన తండ్రి చావుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కారణమని జగన్ ఆనాడు చెప్పారని, రిలయన్స్ సంస్థలపై ఆనాడు జగన్ అనుచరులు దాడులు చేశారని విమర్శించారు. వివేకానందరెడ్డి ఎలా చనిపోయారంటే చిన్న పిల్లాడు కూడా చెబుతాడని, గొడ్డలి పార్టీ అంటే జగన్ కు ఎందుకు అంతబాధ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని, వైసిపి పాలనలో పరిపాలన గాడి తప్పిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పెట్టామని, కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి బాట పట్టామని అన్నారు. ఎవరూ రెండేళ్లలో ఊహించ

షియోమీ 17 మ్యాక్స్ చైనాలో విడుదలైంది. ఈ పరికరం షియోమీ 17 లైనప్లో ఐదవ మోడల్గా నిలిచింది. షియోమీ 17 మ్యాక్స్ మోడల్లో, లైనప్లోని ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే అదే ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ 8-సిరీస్ చిప్సెట్ను కలిగి ఉంది. ఇది లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర ఎంత, ముఖ్య ఫీచర్లు గురించి తెలుసుకుందాం. షియోమీ 17 మ్యాక్స్ ధరఈ సరికొత్త షియోమీ స్మార్ట్ఫోన్ నాలుగు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 12GB + 256GB వేరియంట్ ధర CNY 4,799 (సుమారుగా రూ. 68,000) 16GB + 256GB వేరియంట్ ధర CNY 5,099 (సుమారుగా రూ. 72,000) 12GB + 512GB వేరియంట్ ధర CNY 5,399 (సుమారుగా రూ. 76,000) 16GB + 512GB వేరియంట్ ధర CNY 5,799 (సుమారుగా రూ. 82,000). ప్రస్తుతం ఈ పరికరం చైనాలో ప్రీ- ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.మే 25 నుంచి ఆన్లైన్ స్టోర్ ద్వారా సేల్ కు రానుంది. ఈ ధర వద్ద భారత మార్కెట్లో విడుదల చేస్తే, ఇది ఐఫోన్ 17, శాంసంగ్ S25 ప్లస్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది. షియోమీ 17 మ్యాక్స్ ఫీచర్లుఈ డ్యూయల్-సిమ్ ఫోన్లో 6.9-అంగుళాల 1.5K (1,200×2,608 ప