9847 వార్తలు

స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. తాజాగా సాంకేతిక రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. పుణేకు చెందిన నిబే సంస్థ అభివృద్ధి చేసిన ‘వాయు అస్త్ర-1’ లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా సాంకేతిక పరీక్షలను పూర్తి చేసింది. ఈ పరీక్షలను భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో నిర్వహించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ తయారీ, ఖచ్చితమైన దాడి సామర్థ్యాల అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.భారత సైన్యం 100 కిలోమీటర్ల పరిధిలో గల లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ కోసం జారీ చేసిన ఆర్ఎఫ్పీకి స్పందనగా ఈ ప్రదర్శన నిర్వహించారు. పరీక్షల సమయంలో ‘వాయు అస్త్ర-1’ 10 కిలోల వార్హెడ్తో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఒక్క ప్రయత్నంలోనే విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ వ్యవస్థ ఒక మీటర్ కంటే తక్కువ సీఈపీ (సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్) ఖచ్చితత్వాన్ని సాధించిందని సంస్థ వెల్లడించింది. దీంతో అత్యంత ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉన్నట్లు నిరూపితమైంది. అలాగే


హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యమైంది.ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు..యువతి వయస్సు 20 నుండి 25 మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు.యువతి వివరాలు తెలియలేదని, నగరం పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని లేక్ పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు.వివరాల కోసం 8712661598 ని సంప్రదించగలరని అధికారులు విజ్ఞప్తి చేశారు.

వృద్ధులైన తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిన వ్యక్తికి 60 రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జి. శ్రీనివాస్ అనే వ్యక్తి తన వృద్ధ తల్లిదండ్రులను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 70B సిపి యాక్ట్ (సిపి యాక్ట్), 115(2) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించడంతో వాటిని పరిశీలించిన నాంపల్లిలోని గౌరవ ఐదవ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి రెండు నెలల జైలు శిక్ష(60 రోజులు), రూ.50 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై జె. శ్రీకాంత్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. తల్లిదండ్రులను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, సీనియర్ సిటిజన్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.


మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) ముద్దం రమణారెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్కు సంబంధించిన దాదాపు రూ.3.13 లక్షల విలువైన 11 వర్క్ బిల్లులను క్లియర్ చేసి, మెదక్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజినీర్ (DE) కార్యాలయానికి ఫార్వార్డ్ చేయడం కోసం ఏడీఈ రమణారెడ్డి సదరు బాధితుడి నుండి రూ.25,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఎసిబి డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్లాన్తో నర్సాపూర్ విద్యుత్ కార్యాలయంలో నిఘా పెట్టారు.కార్యాలయంలో బాధితుడి నుండి ఏడీఈ రమణారెడ్డి రూ.25,000 నగదును లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలిగా మారారు. తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వివరాలను విష్ణుప్రియ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ట్విషా కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది. భోపాల్లోని తన అత్తింట్లో ట్విషా మృతి చెందిన ఘటనను కుటుంబ సభ్యులు మొదటి నుంచే అనుమానాస్పదంగా పేర్కొంటున్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తు అవసరమని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే దిగువ కోర్టు రెండో పోస్టుమార్టం అభ్యర్థనను తిరస్కరించడంతో ట్విషా కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు రెండో పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది.ఈ పోస్టుమార్టాన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల బృందం నిర్వహించనుంది. అయితే పరీక్ష భోపాల్లోనే జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఎయిమ్స్ ఢిల్లీ వైద్యులను ప్రత్యేక విమానంలో భోపాల్కు తీసుకురానున్నారు. ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.ఇదే సమయంలో ట్విషా భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న




దేశంలోని 12 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రస్తుతం ఉన్న బలం కంటే ఒక సీటు తగ్గే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి మూడు సీట్లు పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైర్ అవుతున్న సభ్యుల్లో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్, జార్జ్ కురియన్ కూడా ఉన్నారు. జూన్ 21 నుంచి జూలై 19 మధ్య పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లనున్న 26 స్థానాల్లో ఎన్డీఏకు 18 సీట్లు, కాంగ్రెస్కు నాలుగు సీట్లు ఉన్నాయి. ఒక స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా వద్ద ఉండగా, మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే తాజా రాజకీయ గణాంకాల ప్రకారం ఎన్డీఏకు 17 సీట్లు మాత్రమే దక్కే అవకాశముండగా, కాంగ్రెస్కు ఐదు సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జేఎంఎంకు రెండు స్థానాలు, టీవీకేకు ఒక స్థానం దక్కే అవకాశముందని సమాచారం. ప్రస

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ దాదాపు ముగింపుకు వచ్చింది. ఆదివారంతో లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. ఇక శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇలా అదునుగా చేసుకొని కొందరు ఇష్టారీతిన బ్లాక్ దందా నడుపుతున్నారు. సాధారణ ధరల కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ధరకి ఐపిఎల్ టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.1,500 టికెట్ను రూ.8వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో విఐపి బాక్సు టికెట్లు రూ.లక్షలు చెప్తున్నట్లు సమాచారం. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ యువకులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. దీంతో సిపి సుమతి ఆదేశాలతో పోలీసులు బ్లాక్ టికెట్ల విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను ఎస్వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నలుగురు యువకులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఇక రాత్రి 7.30 గంటలకు ఆర్సిబి, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

కుల సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్నవతెలంగాణ – మల్హర్ రావుమండలం వల్లెంకుంట గ్రామపరిధి మానేరు ఒడ్డున సాగు నీరు కోసం నిర్మాణ దశలో ఉన్న ఎత్తిపోతల పథకాన్నీ వెంటనే ప్రారంభించాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక డిమాండ్ చేశారు. శుక్రవారం కొయ్యుర్లో కుల సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాట్లాడారు ఓసిపి బ్లాక్-1 మైన్లో కోల్పోయిన కాపురం ఆదివాసులకు ఏఎమ్మార్ కంపెనీ ఇండ్లు నిర్మించి, అర్హులైన వారికి […] The post వల్లెంకుంట ఎత్తిపోత పథకాన్ని వెంటనే ప్రారంభించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుమండలం కొయ్యుర్ గ్రామానికి చెందిన తోట బాల లచ్చక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ శుక్రవారం బాధితురాలు కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం 25 కిలోల సన్నబియ్యం బస్తా,నిత్యావసర సరుకులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. The post బాధిత కుటుంబానికి సర్పంచ్ రాజమ్మ చేయూత appeared first on Navatelangana.

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్నవతెలంగాణ – కాటారంకాటారం మండలం విలాసాగర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కాటారం డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా, పర్యావరణానికి హానికరంగా, భవిష్యత్ తరాలకు నష్టం కలిగించే విధంగా గ్రామంలోని నివాస గృహాలకు అత్యంత సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటుక […] The post విలాసాగర్ ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.

వడ్ల నిల్వకు గోడౌన్ల పరిశీలననవతెలంణ – కాటారంకాటారం మండలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్ల నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం ఆర్డీవో రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల శుక్రవారం మండలంలోని శ్రీ రుద్రా జిన్నింగ్ మిల్, మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ గోడౌన్లను పరిశీలించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో ఉన్న గోడౌన్ల […] The post రైతులు ఆందోళన చెందొద్దు.. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.



నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గంధమల్ల అశోక్ను శర్బణాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైదాపురం సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు అశోక్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన సమర్థవంతంగా కృషి చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […] The post కాంగ్రెస్ మండలాధ్యక్షునికి ఘన సన్మానం appeared first on Navatelangana.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ పెళ్లి వార్త మరోసారి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కావ్య పెళ్లి గురించిన వార్తలు చాలానే వచ్చాయి. ఈ సారి ఆ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్తో కావ్య ప్రేమలో ఉందని ఎప్పటి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకసారి వీరిద్దరు అమెరికాలో జంటగా కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వైరల్ అయ్యాయి. అయితే వీటికి అనిరుధ్ అప్పుడే చెక్ పెట్టేశాడు. అలాంటిదేమీ లేదని సోషల్మీడియా వేదికగా స్పష్టత ఇచ్చాడు. అయితే తాజాగా వీరిద్దరి వివాహ వార్తలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఈసారి పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్ నడుస్తోంది. తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్లో వీరి వివాహం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి వార్తలే రావడం అవి అవాస్తవాలు అని తేలడంతో ఈ వార్తలు కూడా అలాంటివే అని కొందరు నెటిజన్లు అభిప
