9812 వార్తలు


దేశంలోని 12 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రస్తుతం ఉన్న బలం కంటే ఒక సీటు తగ్గే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి మూడు సీట్లు పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైర్ అవుతున్న సభ్యుల్లో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్, జార్జ్ కురియన్ కూడా ఉన్నారు. జూన్ 21 నుంచి జూలై 19 మధ్య పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లనున్న 26 స్థానాల్లో ఎన్డీఏకు 18 సీట్లు, కాంగ్రెస్కు నాలుగు సీట్లు ఉన్నాయి. ఒక స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా వద్ద ఉండగా, మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే తాజా రాజకీయ గణాంకాల ప్రకారం ఎన్డీఏకు 17 సీట్లు మాత్రమే దక్కే అవకాశముండగా, కాంగ్రెస్కు ఐదు సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జేఎంఎంకు రెండు స్థానాలు, టీవీకేకు ఒక స్థానం దక్కే అవకాశముందని సమాచారం. ప్రస

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ దాదాపు ముగింపుకు వచ్చింది. ఆదివారంతో లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. ఇక శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇలా అదునుగా చేసుకొని కొందరు ఇష్టారీతిన బ్లాక్ దందా నడుపుతున్నారు. సాధారణ ధరల కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ధరకి ఐపిఎల్ టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.1,500 టికెట్ను రూ.8వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో విఐపి బాక్సు టికెట్లు రూ.లక్షలు చెప్తున్నట్లు సమాచారం. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ యువకులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. దీంతో సిపి సుమతి ఆదేశాలతో పోలీసులు బ్లాక్ టికెట్ల విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను ఎస్వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నలుగురు యువకులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఇక రాత్రి 7.30 గంటలకు ఆర్సిబి, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

కుల సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్నవతెలంగాణ – మల్హర్ రావుమండలం వల్లెంకుంట గ్రామపరిధి మానేరు ఒడ్డున సాగు నీరు కోసం నిర్మాణ దశలో ఉన్న ఎత్తిపోతల పథకాన్నీ వెంటనే ప్రారంభించాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక డిమాండ్ చేశారు. శుక్రవారం కొయ్యుర్లో కుల సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాట్లాడారు ఓసిపి బ్లాక్-1 మైన్లో కోల్పోయిన కాపురం ఆదివాసులకు ఏఎమ్మార్ కంపెనీ ఇండ్లు నిర్మించి, అర్హులైన వారికి […] The post వల్లెంకుంట ఎత్తిపోత పథకాన్ని వెంటనే ప్రారంభించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుమండలం కొయ్యుర్ గ్రామానికి చెందిన తోట బాల లచ్చక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ శుక్రవారం బాధితురాలు కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం 25 కిలోల సన్నబియ్యం బస్తా,నిత్యావసర సరుకులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. The post బాధిత కుటుంబానికి సర్పంచ్ రాజమ్మ చేయూత appeared first on Navatelangana.

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్నవతెలంగాణ – కాటారంకాటారం మండలం విలాసాగర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కాటారం డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా, పర్యావరణానికి హానికరంగా, భవిష్యత్ తరాలకు నష్టం కలిగించే విధంగా గ్రామంలోని నివాస గృహాలకు అత్యంత సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటుక […] The post విలాసాగర్ ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.

వడ్ల నిల్వకు గోడౌన్ల పరిశీలననవతెలంణ – కాటారంకాటారం మండలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్ల నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం ఆర్డీవో రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల శుక్రవారం మండలంలోని శ్రీ రుద్రా జిన్నింగ్ మిల్, మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ గోడౌన్లను పరిశీలించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో ఉన్న గోడౌన్ల […] The post రైతులు ఆందోళన చెందొద్దు.. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.



నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గంధమల్ల అశోక్ను శర్బణాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైదాపురం సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు అశోక్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన సమర్థవంతంగా కృషి చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […] The post కాంగ్రెస్ మండలాధ్యక్షునికి ఘన సన్మానం appeared first on Navatelangana.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ పెళ్లి వార్త మరోసారి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కావ్య పెళ్లి గురించిన వార్తలు చాలానే వచ్చాయి. ఈ సారి ఆ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్తో కావ్య ప్రేమలో ఉందని ఎప్పటి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకసారి వీరిద్దరు అమెరికాలో జంటగా కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వైరల్ అయ్యాయి. అయితే వీటికి అనిరుధ్ అప్పుడే చెక్ పెట్టేశాడు. అలాంటిదేమీ లేదని సోషల్మీడియా వేదికగా స్పష్టత ఇచ్చాడు. అయితే తాజాగా వీరిద్దరి వివాహ వార్తలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఈసారి పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్ నడుస్తోంది. తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్లో వీరి వివాహం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి వార్తలే రావడం అవి అవాస్తవాలు అని తేలడంతో ఈ వార్తలు కూడా అలాంటివే అని కొందరు నెటిజన్లు అభిప



భారత టెక్ మార్కెట్లో రియల్మీ 16T తో పాటు రియల్మీ వాచ్ S5 కూడా అధికారికంగా విడుదలైంది. సాండ్ వైట్, రాక్ గ్రే వంటి రంగులలో లభిస్తోన్న ఈ వాచ్ అనేక హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాదు, 110 స్పోర్ట్స్ మోడ్లకు, బ్లూటూత్ కాలింగ్కు మద్దతు ఇస్తుంది. దీని ధర గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్వాచ్ రూ.7,999కు కొనుగోలు చేయవచ్చు. జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి దీని సేల్స్ కంపెనీ వెబ్సైట్లో ప్రారంభమవుతాయి. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్వాచ్లో 1500 నిట్స్ ప్రకాశం, 60Hz రిఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ ఆమోలెడ్ డిస్ప్లే సపోర్ట్తో కూడిన 1.97-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. బ్లూటూత్ కాలింగ్కు సపోర్ట్ చేస్తూ, ఈ వాచ్ బ్లూటూత్ ద్వారా ఫోన్కు కనెక్ట్ అవుతుంది. తద్వారా, ఈ వాచ్ నుంచే కాల్స్ చేయవచ్చు, స్వీకరించవచ్చు. ఇది రన్నింగ్, సైక్లింగ్, యోగా, బ్యాడ్మింటన్తో సహా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్లను అందిస్తుంది. నావిగేషన్ కోసం, ఈ వాచ్లో 5-సిస్టమ్ GNSS పొజిషనింగ్తో కూడిన GPS ఫీచర్ ఉంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్తో వస్తున్న ఈ వాచ్ టచ్ ఇన్పుట్కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి, తడి

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డివొగా పని చేసిన వంశీ మోహన్.. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఆ తర్వాత రియల్టర్కు ధారదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు ఎసిబి గుర్తించింది. దీంతో వంశీ మోహన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.

ఈరోజుల్లో చాలమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీర బరువు నియంత్రణలో లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రధానంగా, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే, దాని తగ్గించడం చాలా కష్టం అవుతుంది. అయితే, ఇంటి దగ్గరే తయారు చేసుకునే కొన్ని హెల్తీ డ్రింక్స్ కొవ్వును సులభంగా తగ్గిస్తాయి. వీటిని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, జీవక్రియను గణనీయంగా పెంచుతాయి. అంతేకాకుండా, ఈ పానీయాలు కేలరీలను సులభంగా కరిగిస్తాయి. శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేస్తాయి. ఈ పానీయాలను సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ తీసుకుంటే కేవలం ఒక నెలలోనే 4 నుండి 5 కిలోగ్రాముల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి బరువు తగ్గించే పానీయాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గోరువెచ్చని నిమ్మరసం సులభంగా బరువు తగ్గాలనుకుంటే గోరువెచ్చని నిమ్మరసం ఉత్తమమైన ఎంపిక! ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేస్తాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. నిమ్మరసంతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతు




నవతెలంగాణ-హైదరాబాద్: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్లు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం అవసరమా అన్న సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల ద్వారా సామాజిక స్థితిలో మార్పు సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలి’అని స్పష్టం చేసింది రిజర్వేషన్లలో కొనసాగితే ఈడబ్ల్యూఎస్కు, క్రిమిలేయర్కు తేడా ఏముంటుంది?. ఆ రెండింటి మధ్య తేడా ఉండాల్సిందేనని తెలిపింది. ఓబీసీ […] The post తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్లు..పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా..? appeared first on Navatelangana.

కొయ్యుర్లో నిరవధిక సమ్మె ప్రారంభంనవతెలంగాణ – మల్హర్ రావుతమ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం మండలంలోని ఐకెపి విఓఏ జాయింట్ యాక్టివ్ మండల (జెఏసి సెర్ప్) కమిటీ ఆధ్వర్యంలో 27 మంది విఓఎలు కొయ్యుర్ మండల సమాఖ్య కార్యాలయంలో ముందు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా విఓఎలు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర విఓఏ జెఏసి కమిటీ ఆదేశాల మేరకు శాంతియుత నిరవధిక సమ్మె చేపట్టినట్లుగా పేర్కొన్నారు. విఓఏ సమస్యలైన కనీస వేతనం రూ.20 […] The post విఓఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.

