
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యమైంది.ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు..యువతి వయస్సు 20 నుండి 25 మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు.యువతి వివరాలు తెలియలేదని, నగరం పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని లేక్ పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు.వివరాల కోసం 8712661598 ని సంప్రదించగలరని అధికారులు విజ్ఞప్తి చేశారు.












