
3376 వార్తలు

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో యుడిఎఫ్ హవా కొనసాగుతోంది. యుడిఎఫ్ విజయ దుదుంభి మోగిస్తోంది. యుడిఎఫ్ పార్టీ 21 స్థానాలలో విజయం సాధించగా 76 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. ఎల్డిఎఫ్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాలలో గెలవడంతో పాటు 32 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఎన్డిఎ రెండు స్థానాలలో లీడ్ ఉన్నారు.

చెన్నై: కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఆయన తండ్రి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టివికె ప్రభంజనం సృష్టిస్తుండటంతో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గెలుపుపై విజయ్కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్కి ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు. విజయ్ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నకల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె(109), డిఎంకె(63), అన్నాడిఎంకె(60) స్థానాలలో ఆధిక్యంలో ఉంది. విజయ్కు యూత్, దళిత్ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. 2024 ఫిబ్రవరి 2న టివికె పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె చాలా నష్టపోయింది.
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు టీవీకేకు మరో 10 సీట్లు మాత్రమే అవసరం. పూర్తి మెజారిటీ రాకపోతే ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. మరోవైపు సినీ నటి త్రిష ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం తిరుమల […] The post విజయ్ నివాసానికి త్రిష.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియంలో నిలువెత్తు నిర్లక్ష్యం దాగి ఉందని, ప్రతి అంశంలో తప్పిదాలు జరిగాయని, కేంద్ర ఎన్నికల సంఘం పట్టింపు లేకుండా వ్యవహరించిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపారని సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియో విడుదల చేశారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశారని, […] The post ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణులకు మమతా బెనర్జీ కీలక పిలుపు appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జలపల్లి గ్రామ సమీపంలో అత్యవసర పరిస్థితులో హాస్పిటల్ వారు ఉపయోగించే ఆక్సిజన్ ట్యాంక్ బ్లాస్ట్ కావడంతో ముగ్గురు తీవ్ర గాయాలు. గాయపడ్డవారిని హాస్పిటల్ కి తరలించిన పహాడి షరీఫ్ పోలీసులు. ఒకేసారి రెండు ట్యాంకులు బ్లాస్ట్ కావడం. స్థానికంగా ఉన్న ఇంటి పైకప్పులు కూలడంతో భయాందోళనలో స్థానికులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఆక్సీజన్ ట్యాంకులు పేలి ముగ్గురికి గాయాలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ఓటమిని అంగీకరించకుండా, చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక వీడియో సందేశంలో దీదీ మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. “ఇది బీజేపీ పన్నిన కుట్ర. మొదటి రెండు మూడు రౌండ్లలో వారి ఫలితాలు ముందుగా, మనవి తర్వాత చూపిస్తారని నేను నిన్నటి నుంచే చెబుతున్నాను. సుమారు […] The post మమతా బెనర్జీ కీలక ప్రకటన.. appeared first on Navatelangana.

పశ్చిమ బెంగాల్: ఈ ఎన్నికల్లో టిఎంసి గెలవబోతుందని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాల సరళిపై మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల 14 నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి టిఎంసి నేతలు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటి వరకు 2నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని తెలియజేశారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని, పథకం ప్రకారమే బిజెపి ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని విమర్శించారు. చాలా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేశారని, టిఎంసి నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మండిపడ్డారు. సర్ ఆధారంగా ఓట్లు దొంగిలించే ప్రయత్నం జరిగిందని, టిఎంసి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా ప్రకటించట్లేదని ధ్వజమెత్తారు. అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఓట్ల లెక్కింపుతో ఇసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు.. ఇసితో కలిసి పనిచేస్తున్నాయని మమతా బెనర్జ
నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం ఎన్నికల కౌంటింగ్ వేళ బెంగాల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఎన్నికల ర్యాలీలు, విక్టరీ ర్యాలీలు, రోడ్ షోలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించకూడదని ప్రకటించారు. ఆయా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజంతా కొనసాగే అవకాశం ఉందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలగకూడదని, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా నిరోధించడమే తమ లక్ష్యమని పోలీసులు తెలిపారు. మొత్తం 294 […] The post బెంగాల్లో విక్టరీ ర్యాలీలు నిషేధం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపు న్యాయవాది వాదనలు వినిపించగా, రామోజీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని న్యాయవాది చెప్పగా, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించిందని, ఈ నేపథ్యంలో రామోజీరావు మరణంతో కేసు మెయింటైనబుల్ […] The post సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ.. appeared first on Navatelangana.





హైదరాబాద్: శేరిలింగంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అగ్నిప్రమాదం జరిగింది. జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కమిషనర్ చాంబర్ లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యింది. కార్యాలయం వెనకాల ఉన్న సబ్ స్టేషన్ లో ఏర్పడిన స్పార్క్ వల్ల వెనకాల ఉన్న చెట్లకు అగ్గి రాజుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలగుండా జోనల్ కార్యాలయంలోకి మంటలు వ్యాపించాయని సిఎంసి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఆస్తి నష్టం ఎంత జరిగిందోనని అంచనా వేస్తున్నారు.


నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితం పుదుచ్చేరిలో ఎన్నికల కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. తమిళనాడులో టీవీకే భారీ మోజార్టీలో ఉండగా, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ, కేరళ యూడీఎఫ్, బెంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. మరో వైపు సీఎం ఎవరూ అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఆయా నాయకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలకు టీవీకే అధినేత విజయ్ స్పష్టమైన మోజార్జీతో ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. టీవీకే […] The post ముమ్మరంగా కౌంటింగ్..సీఎం అభ్యర్థులపై చర్చ appeared first on Navatelangana.


