
1631 వార్తలు

పాన్ కార్డు అనేది దేశంలోనే నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఆర్ధిక వ్యవహారాలకు ఇది ఉపయోగపడుతుంది. నగదు ట్రాన్సాక్షన్లను వేగవంతంగా చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇటీవల పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు కూడా చోటుచేసుకున్నాయి.

నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ ను ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రై ఇలా పలు వంటకాలను ఆస్వాదిస్తారు. అయితే.. దీనికి భిన్నంగా.. షాహీ చికెన్ కుర్మా రెసిపీతో ఇంట్లోనే రుచికరమైన వంటకాన్ని తయారుచేసుకోవచ్చు. అన్నం, చపాతీ, పూరీ వంటి వాటితో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.. అయితే.. ముందుగా చికెన్ ను మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది.

నేటి కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, ప్రకృతి ప్రసాదించిన అవకాడో పండు ఈ సమస్యలకు అద్భుతమైన పరిష్కారమని డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు. 14 రోజుల పాటు ఈ పండును డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పండు ప్రతి రోజూ తినటం వల్ల జీర్ణవ్యవస్థ నుండి మెదడు ఆరోగ్యం వరకు ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వివరంగా తెలుసుకుందాం..

మనం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మి పంచదారకు బదులు బెల్లాన్ని వాడుతుంటాం. కానీ, ఇప్పుడు ఆ తీపి పదార్థమే మన ప్రాణాల మీదకు వస్తోంది. ఆకర్షణీయంగా కనిపించే పసుపు రంగు బెల్లం వెనుక ప్రమాదకరమైన రసాయనాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా..? మీరు తింటున్నది స్వచ్ఛమైన బెల్లమేనా లేక తీపి విషమా? కల్తీ బెల్లాన్ని ఇంట్లోనే చిటికెలో ఇలా కనిపెట్టేయండి..

Abhishek Sharma Century: అభిషేక్ శర్మ 15వ ఓవర్లో తన సెంచరీని పూర్తి చేశాడు. నితీష్ రాణా వేసిన మొదటి రెండు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి, అతను 47 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి రెండవ ఐపీఎల్ సెంచరీ, దీంతో టీ20 క్రికెట్లో అతని సెంచరీల సంఖ్య తొమ్మిదికి చేరింది.

2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రారంభమైంది. కొత్త ITR ఫారాలు విడుదలయ్యాయి. చివరి నిమిషం తొందరపాటును నివారించడానికి, పాన్, ఆధార్ లింకింగ్, ఫారం 16, 26AS, AIS, పెట్టుబడి రుజువులు వంటి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ముఖ్యం.

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరి కళ్లు మామిడి పండ్ల కోసమే వెతుకుతుంటాయి. పండ్ల రాజుగా పిలువబడే మామిడిని ఇష్టపడని వారుండరు. అయితే, మామిడి పండును నేరుగా తినడానికి ఇష్టపడని పిల్లలకు లేదా అతిథులకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనుకుంటే 'మామిడి పుడ్డింగ్' ఒక బెస్ట్ ఆప్షన్. దీని తయారీకి చాలా తక్కువ పదార్థాలు సరిపోతాయి. ఎటువంటి గుడ్లు (Eggless) అవసరం లేదు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ రుచికరమైన మామిడి పుడ్డింగ్ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

రైల్వే శాఖ దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ప్రత్యేక కోచ్లపై కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇతర ప్రయాణికులు వీటిల్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రైల్వేశాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

మీ మొబైల్ ఫోన్ను ఎక్కడ పెడతారు? అంటే.. ప్యాంట్ జేబులో అని చాలామంది సమాధానం చెబుతారు. అయితే ఈ చిన్న అలవాటు మీకు పెద్ద సమస్యగా మారుతుందని తెలుసా? జేబులోని మొబైల్ నుండి వెలువడే రేడియేషన్, వేడి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్య నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. అసలు మొబైల్ ఫోన్ వీర్య కణాలను ఎలా హరిస్తుంది? అనేది తెలుసుకుందాం..

హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఇంటి డాబాపై గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. నాచారానికి చెందిన శశిధర్ అనే ఇంజినీర్ గంజాయికి బానిసై ఉద్యోగం వదిలేశాడు. డబ్బు లేక సొంతంగా 17 గంజాయి మొక్కలు పెంచుతుండగా.. ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు కూడా పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వేదాంత లిమిటెడ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలోనే ఈ కంపెనీ 5 స్వతంత్ర సంస్థలుగా విడిపోనుంది. ఈ డీమెర్జర్ ప్రక్రియకు సంబంధించి రికార్డు తేదీ ఖరారు కావడంతో ఒక్కసారిగా వేదాంత షేరు ధర ఆకాశాన్ని తాకింది. అసలు ఈ విభజన వల్ల ఇన్వెస్టర్లకు వచ్చే లాభమేంటి? ఏప్రిల్ 29 లోపు షేర్లు కొంటే కలిగే ప్రయోజనాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

ఏప్రిల్ 2025లో పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో డాక్టర్ సుజాత భర్త భరత్ భూషణ్ మరణించారు. అప్పట్లో ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్ భూషణ్ తన 4 ఏళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి ప్రాధేయపడినా, ఉగ్రవాదులు అతని మతం, ఆధార్ కార్డు చూసి కాల్చి చంపారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సుజాత, ప్రస్తుతం తన కుమారుడి భవిష్యత్తు కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. వృత్తిరీత్యా పీడియాట్రీషియన్ అయిన ఆమె, తన బాధను అదిమిపెట్టుకుని కొడుకుకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచుతున్నారు. ఆనాటి భీకర దృశ్యాలు..

Sunrisers Hyderabad vs Delhi Capitals, IPL 2026 Live Score Updates: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు బౌలర్లకు కూడా సహకరిస్తుంది. ఈ మైదానంలో తరచుగా అధిక స్కోరు నమోదవుతుంటుంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో 86 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. వాటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 37 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు 48 సార్లు గెలుపొందగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

పగలు అయినా.. రాత్రి అయినా.. ఆకలేస్తే వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టాల్సిందే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. ఇలా ఆర్డర్ పెట్టగానే.. అలా వచ్చేస్తుంది.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆ ఫుడ్ సేఫేనా.. అప్పుడే తయారు చేసిందేనా.. లేక ఎప్పటిదోనా.. వాసన, పురుగులు.. బొద్దింకలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది..

ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు సాయి అభ్యంకర్. వయసు 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పుడు యావత్ ఇండియాను తనవైపుకు తిప్పుకున్నాడు. ఇందుకు కారణం అతడు సృష్టించిన పాటలే. భాష అర్థం కాకపోయినా అతడు క్రియేట్ చేసిన పాటలకు చిన్నపెద్ద తేడా లేకుండా స్టెప్పులు వేస్తున్నారు. ఇంతకీ అతడు చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు మీరు విన్నారా.. ?

ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు మనం రకరకాల డ్రింక్స్ తాగుతుంటాం. అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన కూల్ డ్రింక్స్, జ్యూస్ల కంటే తక్కువ ధరలో లభించే అమృతం మన ఇంట్లోనే ఉంది. అదే మజ్జిగ. మజ్జిగ కేవలం దాహం తీర్చడమే కాదు, శరీరంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం..

సినీరంగంలో హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. హాస్య నటీనటులు సైతం ఎంతో పాపులర్ అవుతుంటారు. వెండితెరపై తమ నటనతో, కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తుంటారు. అయితే తెరపై కనిపించినట్లుగా తమ జీవితాలు మాత్రం సాగవు. ఈ నటుడు మాత్రం ఎంతో మందికి ఆదర్శం. 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాసిన నటుడి గురించి మీకు తెలుసా.. ?

హ్యాండ్పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. కానీ, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక చేతి పంపు పనితీరు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. భూగర్భ జలాలను తోడేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హ్యాండ్పంప్ సాంకేతికత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతదేశంలో మనం చూసే హ్యాండ్పంప్లకు పైన ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, దానిని పదేపదే కొట్టడం ద్వారా నీరు వస్తుంది. కానీ, ఇక్కడ కనిపించిన హ్యాండ్పంప్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఒక భారతీయుడు రష్యా పర్యటనలో ఈ వింత పంప్ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.

తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుంది. బస్సులు నిలిచిపోనున్నాయని సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరపగా.. అవి విఫలమయ్యాయి. దీంతో సమ్మె బాట పట్టడం తప్పడం లేదని చెబుతున్నారు.

Telugu Astrology: ఈ నెల (ఏప్రిల్) 23, 24, 25 తేదీల్లో గ్రహ సంచారంలో అరుదైన మాలికా యోగం ఏర్పడుతోంది. గ్రహాలన్నీ కుంభ రాశి నుంచి సింహ రాశి వరకు వ్యాపించి ఉండడాన్ని మాలికా యోగం అంటారు. మాలికా యోగం పట్టినవారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆ మూడు రోజుల్లో చేపట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. అయితే, ఈ మూడు రోజుల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రాధాన్యం, ప్రాభవం, ప్రాబల్యం పెరగడంతో పాటు సంపద కూడా బాగా వృద్ధి చెందుతుంది.

అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.

పూజా కార్యక్రమాల్లో మనం రకరకాల పూలను ఉపయోగిస్తుంటాం. అయితే, బంతి పూలకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసుపు, కేసరి రంగుల్లో వికసించే ఈ పూలు ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయని మీకు తెలుసా..? అవును, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి గ్రహానికి (గురువు) సంబంధించినది. బంతి పూలను పూజలో వాడటం వల్ల జాతకంలో గురు గ్రహం బలోపేతం అవుతుంది. ఇది వ్యక్తికి గౌరవాన్ని, జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది.

T20 World Cup 2026 : కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కథనం ప్రకారం.. జూలై 2025లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్లో జరిగిన సంఘటన ఈ కుంభకోణానికి పునాది వేసింది. అక్కడ భోజనం చేస్తున్న కెనడా జాతీయ జట్టు స్టార్ ప్లేయర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారట.