25092 articles


టి-20 ప్రపంచకప్ను టీం ఇండియాకు అందించిన సరే.. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్కు జట్టు తప్పగాలు అప్పగించారు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ విషయంపై సూర్య స్పందించాడు. తనను కెప్టెన్సీ తప్పించారని తెలిసి నవ్వుకున్నాను అని సూర్య అన్నాడు. ఒలింపిక్స్తో పాటు వచ్చే టి-20 ప్రపంచకప్లోనూ జట్టును నడిపిస్తానని తాను తొలుత అనుకున్నట్లు వెల్లడించాడు. కానీ, సెలక్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు. ‘‘జట్టు సారథిగా నా పేరు లేదని తెలిసినప్పుడు నవ్వానంతే. క్రికెట్ ఆడుతున్నప్పుడు.. ఒత్తిడి ఉన్న ప్రతి సందర్భంలో నవ్వుతూనే ఉన్నా. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. అలాగే నాకు ఆడే అవకాశాలు లభించిన ప్రతిసారీ కృతజ్ఞతతోనే ఉన్నా. నిజానికి.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. 2026లో కప్ గెలిచిన తర్వాత.. మరో రెండేళ్లూ ఈ జట్టును నేనే నడిపిస్తానని అనుకున్నా. రాబోయే ఒలింపిక్స్లోనూ జట్టుకు సారథ్యం వహిస్తానని భావించా. అయితే, ఇతరుల ఆలోచరనలు వీటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి నిర్ణయాలను మనం గౌరవించాలి. ఈ జట్టు మరొకరి సారథ్యంలో రాణిస్తే మంచిదే కద


హైదరాబాద్: ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్పై ఎంఐఎం వేటు వేసింది. వెంటనే ఎంఎల్ సికి రాజీనామాకు చేయాలని ఆదేశించింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్పై ఆ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఎంఐఎం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తన ఎక్స్ ఖాతాలో పార్టీ ప్రకంటించింది. వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మండలి ఛైర్మన్కు లేఖ పంపాలని ఆదేశించింది. 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్ బేగ్ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మీర్జా రహ్మత్ బేగ్ పట్టుబడడడంతో ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తాపూర్లో కొందరు యువకులు ఎంఎల్ సిని పట్టుకుని కొట్టడంతో పాటు వీడియోలు తీసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపణలు చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. ఎంఎల్ఎకు సంబంధించిన వీడియో సోషల్ మీ





బౌరంపేట ఇందిరమ్మ కాలనీ కబ్జాలపై దుండిగల్ మున్సిపల్ అధికారుల చర్యలుకుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ లో కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను దుండగల్ సర్కిల్ అధికారులు కాపాడారు. ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను డిప్యూటీ కమిషనర్ వెంకట మణికిరణ్ ఆధ్వర్యంలో, టౌన్ ప్లానింగ్ ఎసిపి శ్రీనివాస్ నేతృత్వంలో దుండిగల్ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత లు చేపట్టారు. అక్రమ షెడ్ల కుల్చివేతపై ఇందిరమ్మ కాలనీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



న్యూఢిల్లీ : భారత విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 12.42 బిలియన్ డాలర్లు పెరిగి 729.3 బిలియన్ డాలర్లతో జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆర్బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) వెల్లడించింది. అంతకుముందు వారం ఇవి 11.23 బిలియన్ డాలర్లు పెరిగి 716.88 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సిఎ) 9.17 బిలియన్ డాలర్లు పెరిగి 620.57 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో బంగారం నిల్వలు 2.87 బిలియన్ డాలర్లు పెరిగి 85.31 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశ ఆర్థిక స్థిరత్వానికి, రూపాయి విలువకు మద్దతుగా ఈ నిల్వల పెరుగుదల ఎంతో దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.

హైదరాబాద్: ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా గృహలక్ష్మి లక్కీ డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అధికారుల తీరుపై దానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికకు లక్కీ డ్రా తీశారు.


అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మల్లా ప్రవీణ్ అనే వ్యక్తి భార్య, కుమార్తె, కుమారుడుకు విషమిచ్చి తాను ఊరేసుకుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.




నవతెలంగాణ-హైదరాబాద్ : అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున కెరీర్లోని ప్రతిష్టాత్మక 100వ సినిమా సందడి మొదలైంది. ‘కింగ్ 100’గా ప్రచారంలో ఉన్న ఈ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. సినిమా టైటిల్ని ‘కింగ్ 100’ అని పెట్టడం గమనార్హం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ నిర్మాణంలో తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ […] The post నాగార్జున ‘కింగ్ 100‘ గ్లింప్స్ విడుదల.. appeared first on Navatelangana.



నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణం జరిగింది. ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం గొడ్డళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువర్గాలను ఆపే క్రమంలో మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. The post వేప చెట్టు వివాదం..ఇద్దరి దారుణహత్య appeared first on Navatelangana.
