🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3901 వార్తలు

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం
పాత వార్త
తెలంగాణ

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం

వాషింగ్టన్‌ : అమెరికా ప్రతినిధి సభకు నార్త్‌ డకోటా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లిజ్‌ కాన్మీ (67) శనివారం మిన్నెపొలిస్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్‌ కూడా చనిపోయాడు. ఒకే ఇంజిన్‌ కలిగిన ఈ చిన్న విమానం ‘బీచ్‌క్రాఫ్ట్‌ బీఈ 33’ మిన్నెసోటాలోని క్రిస్టల్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పేలిపోయింది. లిజ్‌ తన రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవ చేశారని నార్త్‌ డకోటా గవర్నర్‌ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ […] The post విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 27, 2026 - సోమవారం👁 5
క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి
పాత
తెలంగాణ

క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి

ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో ప్రమాదంభారీ ఈదురుగాలులు వీచడంతోనే..రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలో ఘటననవతెలంగాణ-శంకర్‌పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో తీవ్ర విషాదం నెలకొం ది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీలో సోమవారం భారీ ఈదురుగాలులకు క్రేన్‌ కూలి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులపై పడింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ సిమెంట్‌ బ్రిక్స్‌ కంపెనీ ప్రాజెక్టులో పనులు […] The post క్రేన్‌ కూలి ఐదుగురు కూలీలు మృతి appeared first on Navatelangana.

లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి
పాత
నెతన్యాహూను ఓడిస్తాం
పాత
తగ్గుతున్న ‘ఉపాధి’ పనిదినాలు
పాత
సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు
పాత
తెలంగాణ

సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు

ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలున్యూఢిల్లీ : భారత్‌, న్యూజీలాండ్‌ దేశాలు సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చు కున్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులను పెంపొందిం చేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, న్యూజీలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్‌ క్లే సంతకాలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే ఎగుమతులపై వంద శాతమూ సుంకాలు లేకుండా వుండేం దుకు ఈ […] The post సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్‌ ఎగుమతులు appeared first on Navatelangana.

మంగళవారం రాశి ఫలాలు (28-04-2026)
పాత
తెలంగాణ

మంగళవారం రాశి ఫలాలు (28-04-2026)

మేషంభూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కర్కాటకం సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత

మా లెక్కలు వేరు
పాత
తెలంగాణ

మా లెక్కలు వేరు

ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ -చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని ట్రంప్‌ బెదిరింపులు-రష్యాలో ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వాషింగ్టన్‌..టెహ్రాన్‌: రెండో విడత శాంతి చర్చల వేళ వడ్రోజుల్లో ఒప్పందం కుదుర్చు కోవాలని, లేకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తాని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు […] The post మా లెక్కలు వేరు appeared first on Navatelangana.

అజహర్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
పాత
తెలంగాణ

అజహర్, కోదండరామ్ ప్రమాణస్వీకారం

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌తో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పిసిసి అధ్యక్షుడు మహేకుమార్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట స్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి తిరుమలేశుని దర్శించుకున్న బిజెపి చీఫ్ రాంచంద్రరావు మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు తెలిపారు. రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందిం

చాలా పార్టీలు వస్తుంటయ్.. పోతుంటయ్
పాత
పట్టాలు తప్పిన వందేభారత్
పాత
తెలంగాణ

పట్టాలు తప్పిన వందేభారత్

మహారాష్ట్రలోని పుణే వద్ద ముంబై షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి 7.30 ప్రాంతంలో ఈ ప్రీమియం ఏసి టైన్ నెంబరు 22225 పట్టాలు తప్పడంతో కలకలం చెలరేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అదికారులు తెలిపారు. పుణే రైల్వేస్టేషన్‌లోకి చేరుకునే దశలో కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సిఎస్‌ఎంటి) నుంచి షోలాపూర్‌కు వెళ్లుతుండగా ప్రధానమైన పుణే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. రైలులో ఓ బోగీ చక్రాలు డైమండ్ క్రాసింగ్ వద్ద పక్కకు జరిగాయని గుర్తించారు.

పు’నీతు’లు
పాత
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదల
పాత
తెలంగాణ

ఎప్‌సెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదల

రాష్ట్రంలో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా తమ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 4, 5 తేదీల్లో జరిగే అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షకు 106, మే 9 నుంచి 11 వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి ఏప్రిల్ 22 వరకు 2,10,308 మంది, అగ్రికల్చర్ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

శివాజీ విగ్రహాల వెనుక…
పాత
కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి?
పాత
తెలంగాణ

కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి?

మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్స్‌ను కార్మికుల మీద రుద్దడం ద్వారా పోరాటాలను ఆపగలి గిందా? కాంట్రాక్టీకరణ, తమ వలస కార్మిక వ్యవస్థ కార్మికులు పోరుబాట పట్టకుండా నిలప గలిగిందా? సంప్రదాయాల పేరుతో ‘శ్రమశక్తి -2025’ కార్మికోద్యమాన్ని అణచివేయ గలదా? ఏప్రిల్‌ మొదటి రెండువారాలలో, ఉత్తర భారత దేశంలో కార్మికుల ఆకస్మిక పోరాటం అందరి దృష్టి ఆకర్షించింది. ఫలితాలను, పరిమితులను కూడా కండ్ల ముందుంచింది. తెలంగాణలో జరిగిన విద్యుత్‌ ఆర్టిజన్ల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా అనేక అనుభవాలను […] The post కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి? appeared first on Navatelangana.

IPL 2026: ముంబైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి మిచెల్ శాంటర్న్ ఔట్
పాత
ఢిల్లీపై ఆర్‌సిబి ఘన విజయం
పాత
తెలంగాణ

ఢిల్లీపై ఆర్‌సిబి ఘన విజయం

ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సిబి 6.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జాకబ్ (20) పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లి 15 బంతుల్లో 23 (నాటౌట్), దేవ్‌దుత్ పడిక్కల్ 13 బంతుల్లో 34 (నాటౌట్) దూకుడుగా ఆడి జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లు హాజిల్‌వుడ్,భువనేశ్వర్‌ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక దశలో ఢిల్లీ 8 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అంతేగాక పవర్ ప్లే ముగిసే సమయానికి 13 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోరు చేయలేదు.హాజిల్‌వుడ్ నాలుగు, భువనేశ్వర్ మూడు వికెట్లు తీసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. అభిషేక్ పొరెల్ (30), మిల్లర్ (19), జేమీసన్ (12) పరుగులు చేయడంతో ఢిల్లీ కాస్త గౌరవప్రద స్కోరును సాధ

రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు
పాత
తెలంగాణ

రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు

రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పుట్టినరోజు, వివాహవార్షికోత్సవ రోజు సెలవులకు అనుమతిస్తున్నట్లు సోమవారం రాష్ట్ర డిజిపి శివధర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సిబ్బంది పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కఠినతరమైన విధులు నిర్వహిస్తూ సమాజ భద్రత కోసం వ్యక్తిగత జీవితాన్ని ధారపోస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాస్థాయి అధికారుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని, సెలవులు దరఖాస్తుకు ముందుగా సర్వీస్ రిజిస్ట్రర్‌లో అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని జత చేయాలని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల మినహ సెలవులను మంజూరు చేయాలని యూనిట్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

‘ఖాళీ ఖజానా’ అని ఇంకెంతకాలం చెబుతారు?
పాత
హైడ్రాకు ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ
పాత
తెలంగాణ

హైడ్రాకు ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ

హైడ్రాకు ‘సుప్రీం’లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంబర్‌పేట బతుకమ్మకుంట విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైడ్రా ఆధీనంలో బతుకమ్మ కుంట ఉందనే సంకేతాలు తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కుంటకు ఉన్న నేమ్‌బోర్డ్ హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వ భూమిగా గుర్తించి కుంటను హైడ్రా అభివృద్ధి చేసింది. చిల్డన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తో పాటు అనేక ఏర్పాట్లు చేసింది. సిఎం చేతుల మీదుగా ప్రజలకు హైడ్రా అంకితం చేసింది. మొత్తం 7 ఎకరాల విషయమై కోర్టులో వివాదం నలుగు తోంది. కుంట స్థలం తనదంటూ ఎప్పట్నించో ఎడ్ల సుధాకర్‌రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. కోర్టులో వ్యవహారం ఉండగానే డెవలప్ చేశారని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశా రు. హైడ్రా పేరును తీసేయాలని ఆదేశిస్తూ 3 వారాలు హైకోర్టు గడువు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు హైడ్రా వెళ్లింది. అయి తే, అక్కడ హైడ్రాకు చుక్కెదురైంది. తదుపరి విచారణ జరిగే వరకూ హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా బతుకమ్మ కుంట దగ్గర పేర్లు, శిలాఫలకాల హైడ్రా తొలగించింది.

RCB చేతిలో ఘోర ఓటమి.. చెత్త రికార్డును మూటగట్టుకున్న ఢిల్లీ
పాత
IPL 2026: ఎవరికీ అందనంత ఎత్తులో కింగ్: ఐపీఎల్‎లో కోహ్లీ నయా రికార్డ్
పాత
‘కర’.. అద్భుతాలు సృష్టించడం ఖాయం : హీరో ధనుష్‌
పాత
బంగ్లాదేశ్‌కు భారత తదుపరి హైకమిషనర్‌గా దినేష్ త్రివేది
పాత
తెలంగాణ

బంగ్లాదేశ్‌కు భారత తదుపరి హైకమిషనర్‌గా దినేష్ త్రివేది

దినేష్ త్రివేదిని బంగ్లాదేశ్‌లో భారత తదుపరి హైకమిషనర్‌గా సోమవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢాకాకు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిని పంపాలన్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ తీసుకుంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ కాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.పశ్చిమ బెంగాల్‌కు చెందిన 75 ఏళ్ల దినేష్ త్రివేది సీనియర్ రాజకీయ నాయకుడు. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బారక్‌పూర్ లోక్‌సభ ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2021 ఫిబ్రవరిలో ఆల్ ఇండియా తృణమూల్‌కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అమెరికాలో ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ప్రస్తుతం బ

Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)