
హైడ్రాకు ‘సుప్రీం’లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంబర్పేట బతుకమ్మకుంట విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైడ్రా ఆధీనంలో బతుకమ్మ కుంట ఉందనే సంకేతాలు తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కుంటకు ఉన్న నేమ్బోర్డ్ హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వ భూమిగా గుర్తించి కుంటను హైడ్రా అభివృద్ధి చేసింది. చిల్డన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు అనేక ఏర్పాట్లు చేసింది. సిఎం చేతుల మీదుగా ప్రజలకు హైడ్రా అంకితం చేసింది. మొత్తం 7 ఎకరాల విషయమై కోర్టులో వివాదం నలుగు తోంది. కుంట స్థలం తనదంటూ ఎప్పట్నించో ఎడ్ల సుధాకర్రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. కోర్టులో వ్యవహారం ఉండగానే డెవలప్ చేశారని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశా రు. హైడ్రా పేరును తీసేయాలని ఆదేశిస్తూ 3 వారాలు హైకోర్టు గడువు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు హైడ్రా వెళ్లింది. అయి తే, అక్కడ హైడ్రాకు చుక్కెదురైంది. తదుపరి విచారణ జరిగే వరకూ హైకోర్టు ఆదేశాలనే పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా బతుకమ్మ కుంట దగ్గర పేర్లు, శిలాఫలకాల హైడ్రా తొలగించింది.
















