
3532 వార్తలు
మామూలు నాయకులను పట్టించుకోరా? నాన్న చావు కంటే..కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే బాధిస్తోంది!సాయం అందించాలని గ్రామ శాఖ అధ్యక్షుడు వేడుకోలు!నవతెలంగాణ-అక్కన్నపేట ఓట్లప్పుడు మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారా, పనిచేసిన వారికి గుర్తింపు ఉండదా అంటూ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. ఒక గ్రామానికి అధ్యక్షున్ని అయి ఉండి, పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ నాకు, కష్టం వస్తే కన్నెత్తి చూసిన నాయకులు లేరు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుంటే ఇంకెప్పుడు […] The post కాంగ్రెస్ లో పనిచేసి మనోవేదనకు గురవుతున్నా.? appeared first on Navatelangana.
నవతెలంగాణ-తుంగతుర్తివిద్యా,వైద్యాభివృద్ధిలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని డిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన,ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర గీతం ఆలపించి,సీఎం సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.ఉచిత బస్సు ప్రయాణం,గృహజ్యోతి,రైతు భరోసా,రైతు భీమా,సన్నబియ్యం,ఇందిరమ్మ ఇండ్లు,500కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి […] The post విద్యా, వైద్యాభివృద్దిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యం: ఎమ్మెల్యే appeared first on Navatelangana.

హైదరాబాద్: తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఉద్యోగ సంఘాలకు సిఎం స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపుల కోసం రూ.6వేల కోట్లు ఇస్తామని చెప్పారు. పిఆర్సిపై తక్షణమే రిపోర్టు ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని.. ఆ రిపోర్టు ఆధారంగా పిఆర్సిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. రెండు నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు సంఘాలు నివేదిక ఇవ్వాలని సూచించారు.
నవతెలంగాణ-తుంగతుర్తిప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ అశోక్ కుమార్ అన్నారు.10వ తరగతి ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం సాధించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కటకం కావ్య శ్రీ ని సన్మానించి మాట్లాడారు.ఈ మేరకు కార్పొరేట్ స్కూళ్లలాగా కాకుండా,ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,అమ్మలాంటి శిక్షణ, నాన్నలాంటి రక్షణ ఉందని,స్నేహపూర్వక బోధనతో విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయడం జరుగుతుందన్నారు.పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులను సద్వినియోగం చేసుకుని,మట్టిలో […] The post పదిలో మెరిసిన ప్రభుత్వ పాఠశాల ఆణిముత్యం కావ్య శ్రీ appeared first on Navatelangana.



న్యూఢిల్లీ: గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళుతున్న బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జునాగఢ్ సివిల్ ఆసుపత్రులకు తరలించారు. అధికారులు సహాయక, తోడ్పాటు చర్యలను కొనసాగిస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. భావనగర్ నుంచి ద్వారక, సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. మంగ్రోల్ పట్టణానికి సమీపంలోని రాహిజ్ గ్రామం వద్ద మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ జంతువు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో డ్రైవర్ వాహనంపై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించగా.. చెన్నై ఎనిమిది మ్యాచుల్లో మూడింటిలో మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. తుది జట్లు: ఎంఐ: విల్ జాక్స్, రియాన్ రికల్టన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఎఎం గజన్ఫర్. సిఎస్కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి.
నవతెలంగాణ – మల్హర్ రావుఅంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా శనివారం గాంధీ భవన్లో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటేడ్ రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారని భరోసా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ […] The post జీపీ ఎంప్లాయిస్ జెఏసి క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.
ఎవరెస్ట్ లక్ష్యంగా అడుగులు… యువతకు స్ఫూర్తిగా సిమ్ లయన్ ఫిట్నెస్ వ్యవస్థాపకుడునవతెలంగాణ-నాచారం సిమ్ లయన్ ఫిట్నెస్ వ్యవస్థాపకుడు, ఐరన్మ్యాన్, ఎండ్యూరెన్స్ అథ్లెట్ మరియు మౌంటెనీర్ అయిన కలాలి జయసింహ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ భారతదేశానికి గౌరవాన్ని తీసుకువస్తున్నారు. కఠినమైన పరిస్థితుల్లో సాహస యాత్రలు చేపడుతూ ఆయన క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్లోని ఎల్బ్రస్, అర్జెంటీనాలోని అకాంకాగువా వంటి ప్రపంచ ప్రఖ్యాత శిఖరాలను విజయవంతంగా అధిరోహించిన జయసింహ, నేపాల్ మరియు లడాఖ్ ప్రాంతాల్లో […] The post ప్రపంచ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ భారత గౌరవాన్ని చాటుతున్న జయసింహ appeared first on Navatelangana.
నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట పురపాలక సంఘ మూడో కమిషనర్గా తూడి దిలీప్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన కమిషనర్ బి. నాగరాజు నూతన కమిషనర్కు పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన టి. దిలీప్ రెడ్డి వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందినవారు. 2024–25 సంవత్సరానికి నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఎంపికై, అశ్వారావుపేట గ్రేడ్–II కమిషనర్గా నియమితులయ్యారు. ఇంతకుముందు 2019–20లో ఎస్ఐగా ఎంపికైన దిలీప్ రెడ్డి, […] The post అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్గా దిలీప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ appeared first on Navatelangana.
కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు!నవతెలంగాణ – పరకాల పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అష్టకష్టాలు పడి పండించిన మక్కలను అమ్ముకుందామంటే అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత రెండు వారాలుగా ఈ కేంద్రంలో కాంటాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హమాలీల కొరత వేధిస్తుండటంతో అటు తూకాలు జరగక, ఇటు లారీలు రాక మార్కెట్ యార్డులోనే ధాన్యం కుప్పలపై రైతులు పడిగాపులు కాస్తున్నారు. […] The post హమాలీల కొరతతో నిలిచిన ‘కాంటాలు’.. appeared first on Navatelangana.

హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త కార్తీక్ ఉరి వేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
– ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డినవతెలంగాణ – ఊరుకొండతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ చక్కని విద్యను అందిస్తున్న తరుణంలో మండలంలో మొదటి ర్యాంకు సాధించిన నౌషిన్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి పదవ తరగతిలో చక్కని ప్రతిభ కనబరిచి ఊరుకొండ మండలంలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి […] The post భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలి.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్మండలంలోని లొంగన్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చేప వల చిక్కుకుపోయి మరణించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని లొంగన్ పెద్ద చెరువులో ముదిరాజ్ మారుతి (45) మద్యం కృపా మినిస్ట్రీ గ్రామంలో కూలి పని చేసుకుని జీవితం గడిపే వాడని తెలిపారు. శుక్రవారం నుండి గ్రామంలో కనిపించడం లేదని, గ్రామంలో ఎక్కడైనా ఉండొచ్చని అనుకున్నామని వెల్లడించారు. అయితే మృతుడి భార్య కూడా గ్రామంలో ఉండట్లేదని, తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వస్తాడులే […] The post లొంగన్ చెరువులో వ్యక్తి అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆలేరు రూరల్ఉపాధి కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు డిమాండ్ చేశారు. ఆలేరు మండలంలోని కంది గడ్డ తండాలో ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న కూలీల సమస్యలను సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జూకంటి పౌలు మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. కూలీలను పనుల నుండి దూరం చేయడానికి కొత్త విధానాలను అమలు […] The post ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి: జూకంటి పౌలు appeared first on Navatelangana.




ముంబై: మహిళల టి-20 ప్రపంచకప్ ఈ ఏడాది జూలై 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కి ఇంగ్లాండ్ వేదిక కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. బిసిసిఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లతో సమావేశం అయింది. అనంతరం మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. టి-20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశ టెక్ మార్కెట్లో అనేక ప్రధాన స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ జనాదరణ పొందిన మోడళ్ల ధరలను పెంచాయి. వీటిలో వన్ప్లస్, రియల్మీ, రెడ్మీ, నథింగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉండటం విశేషం. ఈ ధరల పెరుగుదలకు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసులో అంతరాయాలు, మెమరీ చిప్ల కొరత కారణమని సమాచారం. స్మార్ట్ఫోన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రపంచ మార్కెట్ ప్రస్తుతం డీఆర్ఏఎం (DRAM), నాండ్ (NAND) స్టోరేజ్ వంటి కీలకమైన భాగాల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతున్నందున, ప్రధాన టెక్ కంపెనీలు డేటా సెంటర్ల కోసం పెద్ద మొత్తంలో ర్యామ్ (RAM), జీపీయూలను (GPUs) కొనుగోలు చేస్తున్నాయి. ఇది మెమరీ తయారీదారులను అధిక బ్యాండ్విడ్త్ మెమరీ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేసింది. ఫలితంగా, స్మార్ట్ఫోన్ కంపెనీలకు అవసరమైన భాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి. తయారీ ఖర్చులు పెరిగినప్పుడు, అవి నేరుగా తుది ధరపై ప్రభావం చూపుతాయి. అందుకే స్మార్ట్ఫోన్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ తయారీదార

