
3409 వార్తలు

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిని తన కొడుకు తో కలిసి అతని గొంతు కోసి చంపారు. 10 సంవత్సరాలనుండి ఒక వ్యక్తి తో ఓ మహిళా సహజీవనం చేస్తుంది. అనుమానం రాకుండా మృతదేహాన్ని కవర్లో చుట్టి అర్ధరాత్రి శవాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చింతల్ లోని అంబేద్కర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.










నువ్వు నాలోకి ఒరిగినప్పడు చిందిన అక్షరాలు తడిని అద్దుకున్నాయి నువ్వు దాటేసిన ఆ క్షణం అదే సిరా ఒలికి కొత్త భాష్యాలు నేర్పింది పాళీ నిట్టనిలువునా చీలిన చప్పుడు బద్దలైన హృదయానికి ప్రతీకగా నిలబడింది సరిగ్గా ఆ సమయంలో అప్పుడెప్పుడో వీచిన నీ ముంగురుల అలికిడి నాలో అలజడి రేపింది మోహం అనుకున్నావేమో అణువణువూ నిన్ను కలవరించిన దేహ విస్ఫోటనంలో వెతుకు మనసంటూ వుంటే కను కొసన ఓ బిందువైనా రాలుతుంది నీ శ్వాస నైనా అడుగు ఉచ్ఛ్వాస నిశ్వాసాల త్వరణ వ్యత్యాసాల లోగుట్టు నీ చెవినైనా అడుగు నా పాదాల సవ్వడిలోని మ్యూజింగ్స్ గుండె చప్పుడులో తప్పిన లయలనైనా పసిగట్టు ఊపిరి ఆగేలోపైనా మనిషిగా మసలుకో వసంతం శిశిరం శిథిలావస్థకు పునరుజ్జీవం పోస్తుంది - గిరి ప్రసాద్ చెలమల్లు

గాలి గుసగుస లాడుతూనే వుంది హృదయం మాత్రం నిశ్శబ్ద తీరాల కోసం ఆరాటపడుతుంది ప్రతి శ్వాసలోని సున్నితమైన తరంగాలు ఆత్మను గుర్తు చేస్తున్నాయి ఊపిరి సలపని పని నుండి కాస్సేపు నాకు సెలవు కావాలి ఎండిన ఆకుల చిరచిరలు గుండెను చికాకు పెడుతున్నా నా లోపల వసంతం ఇంకా పచ్చిగానే వుంది ఇప్పుడు కొంత సమయాన్ని దొరక బుచ్చుకోవాలి నిశ్చలంగా, నిశ్చయంగా నన్ను నేను పునరుద్ధరించుకునే క్షణాలు కావాలి - కుడికాల వంశీధర్
నవతెలంగాణ హైదరాబాద్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై వేగంగా వెళ్తున్న అంబులెన్స్ లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అంబులెన్స్ కోల్కతా నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Assembly Elections The post ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి appeared first on Navatelangana.

నేను, నా సాహితీ యాత్ర: మనం ఏకాంతంగా కూర్చుని రాసినా, అది లోకంతో జరిపే సంభాష ణే. నా లోపల జరిగే అంతర్మథనం, బయట ప్రపంచం చూపే స్పం దనల సంఘర్షణే నా అక్షర ప్రయాణం. ఇండో-, చైనా యుద్ధ వాతావరణంలో పుట్టానని శాంతి ప్రబోధ అని పేరు పెట్టారు నాన్న. వరంగల్ జి ల్లా గణపురంలో పుట్టి, ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామం బుద్దిపల్లిలో పెరిగాను. మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేశాక బిసిజె, సామాజిక శాస్త్రం, తెలు గు సాహిత్యం, ట్రాన్సిలేషన్లో పిజి డిప్లొమా చదివాను. పత్రికారంగంలో కొద్దికాలం, ఎక్కువ కాలం సామాజిక సేవారంగంలో క్రియాశీలంగా పనిచేశాను. క్షేత్రస్థాయిలో మనుషుల్ని, వారి కష్టాల్ని దగ్గరగా చూశాను. మనుషుల్ని, సమాజాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నా కార్యరంగం బాగా ఉపయోగపడింది. వృత్తి రీత్యా మన దేశంతో పాటు అమెరికా, స్వీడన్, ఫిన్లాండ్ లలో పాల్గొన్న సదస్సులు, సామాజిక కార్యక్రమాలు, అధ్యయనం, మనుష్యులు, సంఘటనలు ప్రపంచాన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి దోహదమయ్యాయి.మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న సామాజిక స్పృహ గల రచయిత. అమ్మ మంచి చదువరి. నా న్నమ్మకి సామాజిక చైతన్యం ఎక్కువ. ఆ వాతావరణమే పరోక్షంగా నా సాహితీ ప్రయాణ








నవతెలంగాణ హైద్రాబాద్ : తమిళనాడులో డీఎంకేని దాటేసి TVK పార్టీ దూసు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు TVK 63, డీఎంకే 50, AIADMK 39 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు పోటీ చేస్తున్న రెండు చోట్లా (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) TVK చీఫ్ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. The post తమిళనాడులో డీఎంకేని దాటేసిన విజయ్ పార్టీ appeared first on Navatelangana.