
1575 వార్తలు

Team India Players: ఐపీఎల్ 2026 జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎంతోమంది యువ ప్లేయర్లు తమ సత్తా చాటుతూ భారత జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ లిస్ట్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 44వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై చేధించింది. హాఫ్ సెంచరీతో చెన్నై విజయంలో రుత్రాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు.

నెలల తరబడి కష్టపడి బరువు తగ్గడం అనేది ఒక గొప్ప విజయం. అయితే వేగంగా బరువు తగ్గడం వల్ల చాలామందిలో చర్మం సాగిపోయి వేలాడుతుంటుంది. ఈ లూజ్ స్కిన్ సమస్య శరీరాకృతిని దెబ్బతీస్తుంది. వయసు, జన్యువులు, బరువు తగ్గిన వేగం వంటి అంశాలు చర్మం మళ్లీ పూర్వస్థితికి రావడాన్ని ప్రభావితం చేస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న సైన్స్, పరిష్కారాలు చూద్దాం.

బెంగాల్లోని పల్తా నియోజకవర్గంలో రీపింల్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

మనం ఇల్లు, కారు లేదా బ్యాంకు డిపాజిట్ల వంటి భౌతిక ఆస్తులకు వారసులను నియమించుకుంటాం. కానీ ప్రస్తుతం మన జీవితాలు ఆన్లైన్తో ముడిపడి ఉన్న నేపథ్యంలో, మన మరణం తర్వాత డిజిటల్ ఆస్తుల పరిస్థితి ఏమిటనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ‘డిజిటల్ లీగల్ హైర్’ (డిజిటల్ వారసుడు) అనే సరికొత్త ఫ్రేమ్వర్క్పై కసరత్తు చేస్తోంది.

మన దేశం విభిన్న సంప్రదాయాల సమాహారం. ఇక్కడ మతాలు వేరైనా, మనసులన్నీ ఒక్కటే అని నిరూపించారు కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా. హిందూ-ముస్లింల మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీకగా తన సొంత స్థలంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి, కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి చాలామంది ఇళ్లు, ఆఫీసులలో నిరంతరం ఏసీలను వాడుతుంటారు. అయితే ఏసీ హానికరం కాకపోయినప్పటికీ, ఎక్కువ సమయం చల్లటి గాలిలో గడపడం వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏసీ రూముల్లోని పొడి పరిస్థితులు, మురికి ఫిల్టర్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఏపీ సీఐడీ మాజీ బాస్ పీవీ సునీల్ కుమార్ చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం రెండేళ్ల సస్పెన్షన్లో ఉన్న ఈ కీలక అధికారి.. తొలిసారిగా టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా విమర్శల సునామీపై నోరు విప్పారు. రఘురామ అరెస్టు నుంచి తనపై వస్తున్న స్టేట్ టెర్రరిజం ఆరోపణల వరకు.. ఆయన కీలక విషయాలు తెలిపారు.

వేసవిలో ఐఫోన్లు వేడెక్కడం సాధారణ సమస్యగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, భారీ యాప్లు, వైర్లెస్ ఛార్జింగ్ దీనికి ప్రధాన కారణాలు. స్క్రీన్ మసకబారడం, ఛార్జింగ్ ఆగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్ను చల్లటి ప్రదేశంలో ఉంచడం, కవర్ తొలగించడం, కేబుల్ ఛార్జింగ్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

భారత ప్రైవేట్ భీమా కంపెనీలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) కేంద్రం అనుమతించింది. ఆటోమేటిక్ రూట్ ద్వారా వచ్చే ఈ పెట్టుబడులు భీమా రంగంలో పోటీని పెంచి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తాయి. LICకి మాత్రం 20 శాతం FDI పరిమితి కొనసాగుతుంది.

మద్యం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మీరు మద్యం ముట్టుకోకపోయినా.. మీరు తినే అరటిపండులో, తాగే జ్యూస్లో, చివరకు రోజూ తినే బ్రెడ్లో కూడా ఆల్కహాల్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం.. అసలు మనం తినే ఆహారంలో ఆల్కహాల్ ఎలా చేరుతోంది? అనే విషయాలు తెలుసుకుందాం..

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి భయాలతో, MSC వంటి షిప్పింగ్ సంస్థలు సౌదీ అరేబియా ద్వారా భూమార్గాలకు మారుతున్నాయి. ఇది సరఫరా గొలుసులను నెమ్మదింపజేసి, రవాణా ఖర్చులను పెంచుతుంది, అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుంది.

India vs England: ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్ జట్లతో తలపడనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఈ సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జీవనోపాధి కోసం వీధిలో చిన్న బండి పెట్టుకుని బతుకుతున్న వారి కష్టాలు వర్ణనాతీతం. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో సామాన్యుల పోరాటానికి అద్దం పడుతోంది. నగర్ నిగమ్ సిబ్బంది తన బండిని తీసుకెళ్తుంటే, ఆ మహిళ ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మరికొన్ని జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఆదివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మనందరి జీవితాలు ఎంత వేగంగా మారిపోయాయో కదా! ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఏదో ఒక టెన్షన్, పని ఒత్తిడి, ఫోన్ల హోరు. ఈ పరుగుల జీవితంలో మనం అందరం మెల్లగా కోల్పోతున్నది ఒకటి ఉంది.. అదే 'ప్రశాంతమైన నిద్ర'. సరిగ్గా నిద్ర పట్టక, రాత్రంతా పక్కల మీద దొర్లుతూ, మరుసటి రోజు భారంగా నిద్రలేవడం మనలో చాలా మందికి అలవాటైపోయింది. నాకూ ఒకప్పుడు ఇలాగే అనిపించేది. కానీ, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆరోగ్య రహస్యాల గురించి ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఈ మధ్య కాలంలో కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి ప్రతి వాడుకునే వస్తువుల నుంచి తినే ఆహారం వరకు అన్నింటిని కల్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం మార్కెట్లో ఏవైనా ఆహార వస్తువు కొనే ముందు అవి తాజాగా ఉన్నాయా లేదా పాడైపోయాయా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మనం కొన్న గుడ్లు తాజావా పాడైపోయాయా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు సినిమాలకు ఉండే ప్రత్యేక క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు సినిమాలు తగ్గించినప్పటికీ ఆయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆయన ఓ చిత్రాన్ని కేవలం 38 రోజుల్లో తీసిన విధానం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లోనే ఆ సినిమా 4 కోట్ల వసూళ్లు రాబట్టిందని.. నేటి 5000 కోట్ల విలువతో సమానమని తెలిపారు.

India Women's T20 World Cup Squad: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం పటిష్టమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఆల్ రౌండర్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా కనిపించనున్నారు. ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తొలిసారి ప్రపంచకప్ ముద్దాడాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నాన్ వెజ్ ప్రియులకు చేపలు అంటే మస్త్ ఇష్టం. వైద్యులు కూడా గుండె జబ్బులు ఉన్నవారికి, కంటి చూపు మెరుగుపడాలనుకునే వారికి చేపలు తినమని సలహా ఇస్తుంటారు. అయితే నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా.. చేపలు అందరికీ, అన్ని వేళలా మేలు చేయవు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేపలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చేపలు ఎప్పుడు విషంగా మారుతాయి? ఎవరెవరు వీటికి దూరంగా ఉండాలి? అనేది తెలుసుకుందాం..

అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి కన్నవారి కష్టాలను తీర్చాలనుకున్న ఒక యువకుడి కలలు అర్థాంతరంగా ముగిశాయి. కర్నూలు నగరం గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నకొడుకు ఉన్నత స్థితిలో తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు, చందు విగతజీవిగా వస్తున్నాడనే వార్త తీరని వేదనను మిగిల్చింది.

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో భూ వివాదాల కారణంగా గ్రామ తాగునీటి బోరుకు కొందరు తాళం వేయడంతో గ్రామస్తులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో తాగునీరు లేక అల్లాడుతున్నారు. పంచాయతీ అధికారులు తాళాలు తీసినా, మళ్ళీ వేస్తున్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ పాదాలు మీ అంతర్గత ఆరోగ్యానికి అద్దం వంటివి. పాదాల్లో వాపు, తిమ్మిర్లు, చల్లబడటం, పొడిబారడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి కిడ్నీ, గుండె, మధుమేహం, థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం.