ఏపీ సీఐడీ మాజీ బాస్ పీవీ సునీల్ కుమార్ చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం రెండేళ్ల సస్పెన్షన్‌లో ఉన్న ఈ కీలక అధికారి.. తొలిసారిగా టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా విమర్శల సునామీపై నోరు విప్పారు. రఘురామ అరెస్టు నుంచి తనపై వస్తున్న స్టేట్ టెర్రరిజం ఆరోపణల వరకు.. ఆయన కీలక విషయాలు తెలిపారు.