
1629 వార్తలు

తెలంగాణలో వానలు.. ఆంధ్రప్రదేశ్లో సెగలు.. రాగల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఒకవైపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణను పలకరించనుండగా.. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీలకు చేరువవుతున్నాయి.

టాలీవుడ్కి, క్రికెట్కి మధ్య విడదీయరాని బంధం ఉంది. నలుగురికి సాయం చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారీ మన స్టార్స్కు ముందుగా గుర్తొచ్చేది క్రికెట్ మ్యాచ్. ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూనే, సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమీకరించడంలో సినిమా, క్రికెట్ ఎప్పుడూ ముందుంటాయి.

కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై తీవ్రంగా మండిపడ్డారు.

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 జోరుగా సాగుతోంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దూకుడు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ తర్వాత భారత జట్టులోకి ఎంపిక చేయాలంటూ మాజీలు కోరుతున్నారు. ముఖ్యంగా మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ వంటి దిగ్గజాలు ఈ కుర్రాడికి భారత జట్టులో చోటివ్వాలంటూ బీసీసీఐని కోరుకుతున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కైవాక్ నిర్మించనున్నారు. దీంతో రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో దిగాగానే నేరుగా రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు రాశుల పైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. గురుడు తన స్థానం మార్చుకోవడం రెండు రాశుల వారి జీవితం మారిపోనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

రాజమౌళి మగధీరలో శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్ర అద్భుతం. అయితే, ఈ పాత్ర చేయవద్దని డిస్కో శాంతి తన భర్త శ్రీహరికి మొదట చెప్పారట. హీరో స్థాయి వ్యక్తి సపోర్టింగ్ పాత్ర చేయకూడదన్నది ఆమె అభిప్రాయం. కానీ, ఆ పాత్ర ప్రాముఖ్యత, రాజమౌళి దార్శనికత తర్వాత ఆమెకు అర్థమయ్యాయి. ఈ ఆసక్తికర విషయాన్ని డిస్కో శాంతి ఇటీవల పంచుకున్నారు.

ఓటు అనేది ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతుంటారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముఖ్యంగా వృద్ధులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఓటు వేస్తారు. తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటారు. ఇక ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఓటు వేస్తే ఆయువు పెరుగుతుందంట. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఇలా తెలుసుకోండి!

నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనంగానే కాకుండా ఒక మినీ సెక్రటేరియట్గా మారిపోయింది. ఒకప్పుడు చిన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రం కావాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగడం, మధ్యవర్తులను ఆశ్రయించడం సామాన్యులకు తప్పనిసరి అయ్యేది. కానీ డిజిటల్ ఇండియా కార్యక్రమం దీనిని పూర్తిగా మార్చేసింది. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగంగా, నేరుగా ప్రజలకు చేరవేయడంలో ఐదు మొబైల్ యాప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Mutton Non Veg Recipes in Telugu: బాలింతలకు ఈ కూర ఓ వరం: డెలివరీ తర్వాత బాలింతలు ఈ మటన్ నెరడుకూర తింటే వెంటనే పాలు పడతాయి. ఇంకా వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. ఇంకా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Team India Playing XI: వన్డే ప్రపంచకప్ 2027కు సమయం ఆసన్నమైంది. ఇప్పటి అన్ని జట్లు తమ స్వ్కాడ్స్ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక భారత జట్టు విషయానికి వస్తే గంభీర్, అగార్కర్ ఓ జాబితాను ఇఫ్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

'ధురందర్ 2' భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సంచలనం సృష్టించింది. అనేక దేశాలలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సుమారు నెలన్నర గడిచింది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ లోకి యాంకర్ గా వచ్చిన సౌమ్యారావు కొద్ది రోజుల పాటు కామెడీ షోను బాగానే రన్ చేసింది. అయితే ఉన్నట్లుండి ఆమె షోకు దూరమైంది. దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి. అయితే జబర్దస్త్ వదిలేయడానికి అసలు కారణాన్ని ఇటీవలే బయట పెట్టింది సౌమ్యారావు

ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు అందక షూటింగ్ సిబ్బంది, డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్న విషయం అజిత్ దృష్టికి వచ్చింది. మొదట నిరాకరించినప్పటికీ, అజిత్ వారికి అండగా నిలిచారు. వారి సమస్యలను స్వయంగా పరిష్కరించడానికి ముందుకొచ్చి, షూటింగ్ కొనసాగడానికి సహాయపడ్డారు. ఇది అజిత్ గొప్ప మానవతా దృక్పథాన్ని వెల్లడిస్తుంది.

Hardik Pandya : ముంబై ఇండియన్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత కెమెరాలు హార్దిక్ పాండ్యా వైపే ఉన్నాయి. ఆ సమయంలో హార్దిక్ తన గర్ల్ఫ్రెండ్ మహికాతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నట్లు కనిపించింది. అక్కడే హార్దిక్ కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు.

జ్యోతిష్యశాస్త్రంలో రాహు కేతువుల ప్రభావం కొన్నిసార్లు చాలా సమస్యలను తీసుకొస్తుంది. అయితే అతి త్వరలో రాహు కేతువుల సంచారం జరగనుంది. ఇది కొన్ని రాశులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు (Tolls) విధించాలని ఇండోనేషియా యోచిస్తుంది. ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి పూర్బయ యుధి సదేవ వెల్లడించారు.

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. సరైన సమయంలో సరైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం వల్ల ఆ బంధం చిరకాలం నిలుస్తుంది. అయితే, పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఏది అనే విషయంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. భారతదేశ చట్టం ప్రకారం ఒక వయస్సు నిర్ణయించబడినప్పటికీ, సామాజిక, ఆర్థిక మానసిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ డైలాగ్తో టాలీవుడ్లో తెగ ఫేమస్ అయిపోయారు ప్రముఖ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్. ఈ డైలాగ్కు తగ్గట్లే సినిమా ఇండస్ట్రీలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి హీరోల సినిమాల్లో నటించారాయన.

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకు చేరుకోవడం విశేషం. ఈ నివాస భవనాల్లో అంతర్గత ఇంటియర్ పనులు కూడా వేగంగా పూర్తవుతూ, త్వరలోనే వినియోగానికి సిద్ధమవుతున్నాయి. జడ్జిల కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ కూడా అందంగా ముస్తాబవుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో ఇరాన్ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ నూతన సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28న అమెరికాతో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, అదే సమయంలో జరిగిన దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

సాధారణంగా మనం హోటళ్లలో తినే చికెన్ 65 ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒకే రకమైన రుచి కాకుండా, ఈసారి పాలకూరలోని పోషకాలను జోడించి వినూత్నంగా 'గ్రీన్ చికెన్ 65' ప్రయత్నించండి. పాలకూర వల్ల చికెన్ ముక్కలకు సహజమైన ఆకుపచ్చ రంగు రావడమే కాకుండా, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వంట చేయడం రాని వారు లేదా బ్యాచిలర్స్ కూడా కేవలం 10 నిమిషాల తయారీ సమయంతో ఈ వంటకాన్ని సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. అతిథులు వచ్చినప్పుడు లేదా సాయంత్రం వేళల్లో స్నాక్గా వడ్డించడానికి ఇది సరైన ఎంపిక. నోరూరించే ఈ పాలక్ గ్రీన్ చికెన్ 65 తయారీ విధానం ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్కతా పర్యటనలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 24) ఉదయం హుగ్లీ నది తీరాన ఆహ్లాదకరంగా గడిపారు. బోటులో విహరిస్తూ నదీతీర ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఆయన, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ మరియు విద్యాసాగర్ సేతు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా తీరంలోని మత్స్యకారులతో, మార్నింగ్ వాకర్స్తో మోదీ సరదాగా ముచ్చటించారు.