
1624 వార్తలు

ఇరాక్లోని ఇరాన్ మద్దతుగల కతాయెబ్ సయ్యద్ అల్-షుహదా (KSS) మిలీషియా నాయకుడు హషీమ్ వాయెలీని పట్టిస్తే అమెరికా $10 మిలియన్ల భారీ నజరానా ప్రకటించింది. ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు వాయెలీ కారణమని ఆరోపించింది. ఇతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.

ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యుద్ధంలో తీవ్ర గాయపడి, కృత్రిమ కాలుతో అజ్ఞాతంలో ఉన్నారు. బహిరంగంగా కనిపించకుండా, కేవలం రాతపూర్వక సందేశాలతో పాలన సాగిస్తున్నారు. గాయాల కారణంగా బలహీనంగా కనిపించకూడదనే ఉద్దేశంతోనే ఆయన తెరవెనుక ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా, పాలన సైనిక జనరల్స్కు మళ్లుతోందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తన కాబోయే భార్యను గురుగ్రామ్లోని తన ఫ్లాట్కు కలుసుకోవడానికి ఆహ్వానించాడని, అయితే ఆమె అక్కడికి రాకముందే లైంగిక శక్తిని పెంచే మందు తీసుకుని.. మరణించిందని తేలిందని ఒక అధికారి తెలిపారు. అయితే.. అతని ఫ్రెండ్ ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో.. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

ప్రముఖ నటుడు పార్థిబన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచుతుడే.. పలు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించాడు. అలాగే విలన్ గాను మెప్పించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన డెకాయిట్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు పార్థిబన్. తాజాగా ఆయనకు నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్ లభించింది.

గత ఏడాది కన్నా ఈసారి వేసవి వేడి ఎక్కువగా ఉంది. ఉదయం 8గంటల వరకే సూర్యుడు భగ్గుమంటూ మండిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రజలు తమ పాత ఏసీలు , కూలర్లకు మరమ్మతులు చేయించడం ప్రారంభించారు. కొందరు కొత్త ఏసీలు, కూలర్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, అందరికీ కొత్త కూలర్, ఏసీలు కొనుగోలు చేసే స్థోమత ఉండదు. అలాంటి వారికి ఇది బెస్ట్ న్యూస్. ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మీ ఇంట్లోని సాధారణ ఎయిర్ కూలర్ (Air Cooler) కూడా AC లాగా చల్లటి గాలిని అందించడానికి పాటించాల్సిన సులభమైన చిట్కాలు మరియు మెయింటెనెన్స్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.

కర్ణాటకలోని చిక్కమగళూరులో సీఈటీ పరీక్షల్లో షాకింగ్ ఘటన జరిగింది. ముక్కుపుడకలు ధరించిన విద్యార్థినులను సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని తీయలేకపోవడంతో టేపులు అంటించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విద్యార్థినులు వీడియో విడుదల చేయడంతో నెట్టింట తీవ్ర చర్చ నడిచింది. పరీక్షల్లో అక్రమాలు నివారించడానికే నిబంధనలు పాటించామని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది, కానీ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కులపై ప్రశ్నలు లేవనెత్తారు.

35 ఏళ్ల క్రితం ఇంజిన్ లోపంతో నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ 720 విమానం అక్కడే వదిలేశారు. రన్వేకి అడ్డంకిగా మారడంతో, డీజీసీఏ హెచ్చరికల తర్వాత అధికారులు దానిని తొలగించారు. పార్కింగ్ ఛార్జీలు రూ.7 కోట్లకు చేరగా, ప్రస్తుతం విమానం శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు అమెరికా, యూరప్లలో సేవలందించి, ఇప్పుడు భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక బోయింగ్ 720 ఇది.

కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ కుమార్ లాహిరిని నీతి ఆయోగ్ తదుపరి వైస్-ఛైర్మన్గా నియమించారు. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్-ఛైర్మన్ సుమన్ బేరి స్థానంలో లాహిరి బాధ్యతలు స్వీకరిస్తారు. సుమన్ బేరి మే 2022లో ఈ పదవిని చేపట్టారు. కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను కలిగి ఉన్నారు.

తమిళ స్టార్ హీరో అజిత్ ఓటింగ్ సందర్భంగా 'నో నెవర్' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోలీవుడ్ మీడియా, విజయ్ అభిమానులు వీటిని తప్పుగా అర్థం చేసుకుని అజిత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మార్పు అవసరం లేదని అజిత్ చెప్పాడని ప్రచారం చేయడంతో ట్రోలింగ్ తీవ్రమైంది. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వివరణ ఇస్తూ, అజిత్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, ఆయన 'ఇప్పుడు వద్దు' అనే ఉద్దేశ్యంతోనే మాట్లాడారని స్పష్టం చేశారు.

LPG Gas Cylinder Prices: దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి..? గతంలో ఎంత పెరిగాయి? ప్రస్తుతం ఏ నగరంలో ఎంత ధర ఉందో తెలుసుకుందాం.. అలాగే మీరు గ్యాస్ బుక్ చేసుకునే ముందు 'Indane', 'HP' లేదా 'Bharat Gas' అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్ల ద్వారా ఆ రోజు ఉన్న కచ్చితమైన ధరను సరిచూసుకోవడం మంచిది.

RCB : బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు ఒక స్వర్గధామంగా పరిగణిస్తారు. ఈ వేదికపై ఆర్సీబీ బ్యాటర్లు పరుగుల వరద పారించడం కొత్తేమీ కాదు. శుక్రవారం, ఏప్రిల్ 24న గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో, ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారతదేశంలో బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ, ఆన్లైన్ వేదికగా వేల కోట్ల రూపాయల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. దీనికి తాజా నిదర్శనం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సాగుతున్న బెట్టింగ్ ఉధృతి. ఈ అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది 'పాలీమార్కెట్'.

కానుగ చెట్టు శాస్త్రీయ నామం పొంగామియా. వేడిని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఏసీల నుంచి వెలువడే వేడిని, సూర్యరశ్మిని పీల్చుకుంటూ చల్లదనాన్ని అందిస్తుంది. తక్కువ నిర్వహణతో ఏ నేలలోనైనా పెరిగే ఈ వృక్షం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది.

బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా..? ధరలు మరింతగా పడిపోతాయా..? రానున్న కొద్ది రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరలు పడిపోతున్న క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. అటు సిల్వర్ ధరలు కూడా తగ్గుతున్నాయి.

Indian Railways Rules: ఒకవేళ రైలు మిస్ అయితే, వెంటనే స్టేషన్లోని టికెట్ కౌంటర్ను సంప్రదించి TDR (Ticket Deposit Receipt) ఫైల్ చేయడం ద్వారా కొంత రీఫండ్ పొందే ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత మీ ప్రయాణం కోసం కొత్త టికెట్ ..

Quick healthy snacks recipes Indian: ఎండల్లో మీ కడుపును రెండు నిముషాల్లో క్లీన్ చేసి బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

GT vs RCB : మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, గిల్ తమ ఓటమికి గల కారణాలను వివరించాడు. తమ ఇన్నింగ్స్లోని మూడు ఓవర్ల వ్యవధి తమ పతనానికి కారణమైందని, అలాగే ఒక ఫీల్డింగ్ తప్పిదం చివరికి తమకు మ్యాచ్ను దూరం చేసిందని గిల్ నిర్మొహమాటంగా పేర్కొన్నాడు.

గతంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు రేణూ దేశాయ్. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఒకటిరెండు సినిమాలు చేయారు ఈ అందాల తార. దీంతో మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు.

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే నిన్న తులం బంగారం ధర రూ. 1,52,950 ఉండగా ఉంది. ఇక నిన్నటితో పోలిస్తే ఈ రోజు మాత్రం

CBSE second board exams 2026: సీబీఎస్ఈ పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 6.68 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. వీటిలో అధిక శాతం దరఖాస్తులు స్కోర్లను మెరుగుపరచుకోవడానికి ఇప్రూవ్మెంట్ రాసేందుకు రావడం గమనార్హం. ఈ మేరకు సీబీఎస్సీ ప్రకటన విడుదల చేసింది..

Horoscope Today (April 25, 2026): ఈ రోజు గ్రహాల అనుకూలతతో చాలా రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తోంది. మేషం నుంచి మీనం వరకు అనేక రాశులకు ఆర్థిక వృద్ధి, శుభవార్తలు, అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి, కొన్ని రాశుల వారికి పెళ్లి, ఉద్యోగ, విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈఏపీసెట్, లా సెట్, టీజీ ఈసెట్, టీజీ పీజీ ఈసెట్ వంటి పలు ప్రవేశ పరీక్షలన్నీ..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. టీజీఎస్ఆర్టీసీ బస్సులు శనివారం నుంచి యధావిధిగా తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్మికులు సమ్మె విరమించనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వంతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించేందుకు కార్మికులు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో బస్సులను శనివారం ఉదయం నుంచి ఎప్పటిలాగే తిప్పనున్నట్లు సమాచారం.