కర్ణాటకలోని చిక్కమగళూరులో సీఈటీ పరీక్షల్లో షాకింగ్ ఘటన జరిగింది. ముక్కుపుడకలు ధరించిన విద్యార్థినులను సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని తీయలేకపోవడంతో టేపులు అంటించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విద్యార్థినులు వీడియో విడుదల చేయడంతో నెట్టింట తీవ్ర చర్చ నడిచింది. పరీక్షల్లో అక్రమాలు నివారించడానికే నిబంధనలు పాటించామని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది, కానీ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కులపై ప్రశ్నలు లేవనెత్తారు.