24605 articles




నవతెలంగాణ – హైదరాబాద్ :మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఆదివారం థాయ్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొమ్మిది సార్లు జరిగిన ఆసియాకప్లో భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. గాయం కారణంగా జెమీమా రోడ్రిగ్స్ దూరమవగా, ప్రతీకా రావల్ జట్టులోకి వచ్చారు. టోర్నీ ఆరంభ మ్యాచ్లో హాంకాంగ్పై విజయం […] The post ఆసియా కప్.. థాయ్లాండ్తో భారత్ పోరు appeared first on Navatelangana.





నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్ లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా సంభవించిన ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు పర్యాటకులపైనా తీవ్ర ప్రభావం చూపింది. […] The post నేపాల్లో జల ప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపోపై రష్యా డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో షెల్స్, మైన్స్ కారణంగా భారీ పేలుళ్లు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా, 42 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని నెలల కాలంలో ఇదే అతిపెద్ద దాడిగా పేర్కొన్నారు. The post ఉక్రెయిన్ లో భారీ పేలుళ్లు.. 38 మంది మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషినగర్ జిల్లాల నదీ తీరాల్లో తేలుతూ లభ్యమయ్యాయి. నేపాల్ నుంచి భారత్లోకి ప్రవహించే గండకీ నదీ మార్గం ద్వారా ఈ మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. లభ్యమైన మృతదేహాలను గుర్తించేందుకు భారత అధికారులు నేపాల్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తును వేగవంతం చేశారు. The post నేపాల్ లో వరదలు.. యూపీకి కొట్టుకొచ్చిన ఐదు మృతదేహాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. అటు రాబోయే రెండు గంటల్లో భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మాన్ తెలిపారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. The post కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.




మన తెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను, భవిష్యత్తును పణంగా పెట్టిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు సేవ చేయడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో కమిటీ ప్రతినిధి బృందం శనివారం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా 13 వేల మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాలను, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, వారు సమర్పించిన ప్రధాన విజ్ఞప్తుల నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించి సమగ్రంగా వివరించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పలు అంశాలను వివరించిన

ఉత్తరాది పూర్తిగా తమ కైవసం అయిందని, ఇక దక్షిణాది మీద దండయాత్ర మిగిలిందని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంబరపడిపోతున్న సమయంలో, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో జెన్ జీ రోడ్ల మీదికి వచ్చి బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లింది. అదే ఉత్తరాదిలో ఇటీవల పలు రాష్ట్రాల్లో జెన్ జీ ఉద్యమం స్పూర్తిగా జెన్ ఆల్ఫా కూడా రోడ్ల మీదికి వచ్చి ఉద్యమాలు మొదలుపెట్టింది. పాఠశాలల్లో పరిస్థితులు బాగాలేవని, కనీస వసతులు కల్పించాలని, సరైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని, గత మూడు వారాలలో పాఠశాల విద్యార్థులు తరగతి గదుల్లోంచి బయటకొచ్చి ప్రభుత్వ కార్యాలయాలకు ఊరేగింపులు తీసారు. స్కూలు గేట్లకు తాళాలు వేశారు. అధికారుల నుంచి సమాధానం కోరుతూ రోడ్లమీద బైఠాయించారు. వారి డిమాండ్లు చాలా మౌలికమైనవి. వాళ్లకు పాఠాలు సరిగ్గా చెప్పే ఉపాధ్యాయులు కావాలి. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, రాసుకోవడానికి అవసరమైన బల్లలు, సరైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, వాడటానికి వీలుగా ఉండే మరుగుదొడ్లు ఈ జెన్ ఆల్ఫా కనీస కోర్కెలు. ఇంకొక పాఠశాల వారైతే స్కూలుకు వెళ్లడానికి సరైన రోడ్డు వేయాలని డిమాండ్ చేసారు. ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు కావు కదా. ఆ పిల్లలు అడగక

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగించకుండా చూడాలని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సిఎం రేవంత్రెడ్డి కోరారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారినా, మృతిచెందినా, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా గుర్తించినట్లు ముఖ్యమంత్రి ఈసీ గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని సిఎం పేర్కొన్నారు. పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదు మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్ల

టిబెట్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రతకు హిమనీ నద విస్ఫోటనం జరిగి, వివిధ నదుల్లో నీటి ప్రవాహం పెరిగి, ఆ ఉధృతికి నేపాల్ అతలాకుతమై, వరదలు ముంచెత్తాయి. వరద,బుర ద ఏకమై ఉప్పెనలా మారింది.ఈ ఆకస్మిక పరిణామాల ఫలితంగా చూస్తుండగానే వందలాది మంది ప్రజలు,పర్యాటకులు జల విధ్వంసంలో కొట్టుకుపోయి, విగత జీవులుగా మారిపోయారు. చాలా మంది వరద ప్రవాహంలో గల్లంతైపోయారు. పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కూలిపోయా యి. రోడ్లు, వంతెనలు కొట్టుకు పోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. నే పాల్ జల విధ్వంసంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అంచనాలను మించి ఉండవచ్చు. మరణించిన వారిలోను,గల్లంతైన వారిలోను 30 దేశాలకు చెందిన పర్యాటకులున్నట్టు వార్తలు సూచిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదలకు భూకంపం ఒక కారణంగా అగుపిస్తున్నప్పటికీ, ఇంకా ఎన్నో అంశాలు ఈ జల విలయ విధ్వంసానికి కారణంగా పేర్కొంటున్నారు.రహదారులు,వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వలన భూకంపాలు సంభవిస్తున్నా యి. దీనితో పాటు మానవ తప్పిదాల వలన ఉష్ణోగ్రతలు పెరుతున్నాయి. దీని వలన హిమనీ నదాలు కరగి జల ప్రళయం సంభవించడం జరుగుతున్నది. నేపాల్- చైనా సరిహద్దుల్ల

‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’ పేరు వింటేనే 2.60లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల వెన్నులో వణుకు పుడుతుంది. ఈ స్కీమ్తో తమ బ్రతుకులకు భరోసాలేదని వారు ఆందోళన చెందుతున్నారు. 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్ లో మార్పు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ప్రతిపాదనలను 2003 ఆగస్టు 23వ తేదీన నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన యూపిఏ ప్రభుత్వం 2004 జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులకు నూతనంగా నేషనల్ పెన్షన్ (ఎన్పీఎస్) విధానం అమల్లోకి తెచ్చింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కొలువులో చేరిన సుమారు 2.60లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పింఛన్ పథకం పరిధిలోకి వచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కాదు. దేశవ్యాప్తంగా సుమారు 97లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పింఛన్ స్కీమ్ పరిధిలో ఉన్నారు. అయితే అనాధిగా అమల్లో ఉన్న ఓల్డ్ పెన్షన్ విధానంలోకి వచ్చే ఉద్యోగులకు ఎంప్లాయిస్ కాంట్రిబ్యూషన్ లేకుండానే ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత చివరి బేసిక్ మూల వేతనం నుంచి 50