🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3732 వార్తలు

ఫేస్‌బుక్ సీఈఓ జూకర్‌బర్గ్ సంచలన నిర్ణయం : మే 20 నుండి కొత్త రౌండ్ లేఆఫ్స్ స్టార్ట్
పాత
అసలు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా డిసెడ్ చేస్తారో తెలుసా?  పెంచుకోవటం కుదురుతుందా?
పాత
విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ : సివి ఆనంద్
పాత
తెలంగాణ

విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ : సివి ఆనంద్

హైదరాబాద్: ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షల నెరవేరేలా, శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తామని డిజిపి సివి ఆనంద్ తెలిపారు. కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర కొత్త డిజిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల్లో సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని పోలీసు శాఖకు సూచించారు. నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని, మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారిందని తెలియజేశారు. నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారని, నేరగాళ్లు అనుసరిస్తున్న టెక్నాలజీ పోలీసులకు కూడా సవాలు విసురుతుందని అన్నారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని, విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ అని కొనియాడారు. శాంతిభద్రత విషయంలో రాజీ పడొద్దు అని నేరాల తీరు కూడా మారుతుందని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసు బృందం బాగా కృషి చేస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా.. డ్రగ్స్ ముఠాలు కూడా విస్తరిస్తున్నాయని

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, చీరల వ్యాపారం చేసే భార్యను చంపి భర్త ఆత్మహత్య : కొడుకులు ఇద్దరూ డాక్టర్ చదువుతున్నారు..!
పాత
వామ‌ప‌క్షాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు: సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం
పాత
తెలంగాణ

వామ‌ప‌క్షాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు: సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని న‌వ‌తెలంగాణ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేడే ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం జెండాను ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత న‌వ‌తెలంగాణ దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేష్ అధ్య‌క్ష‌త‌న ఎంహెచ్ భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మినేని వీర‌భ‌ద్రం మాట్లాడుతూ..144 సంవ‌త్స‌రాల క్రితం కార్మిక‌లోకం క‌దంతొక్కి 8 గంట‌ల ప‌ని దినాన్ని సాధించుకుంద‌ని, వారి త్యాగాలకు, […] The post వామ‌ప‌క్షాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు: సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌భ్యులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం appeared first on Navatelangana.

దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు
పాత
తెలంగాణ

దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. నవజాత శిశువును వీధికుక్కలు పీక్కుతిన్న విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గుట్ట పక్కన గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును పడవేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న వీధికుక్కలు ఆ శిశువును కొరికి తినేశాయి. శిశువు శరీర భాగాలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. […] The post దారుణం..చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు appeared first on Navatelangana.

సింగరేణి కార్మికుల పెన్షన్ పెరిగేవరకు పోరాడతా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పాత
ఇందిరమ్మ ఇండ్ల పైసలు వస్తున్నయా..? : యాదాద్రి కలెక్టర్ అనురాగ్
పాత
కరీంనగర్ జిల్లాలో భగవతి, ఆర్విన్  ట్రీ విద్యార్థుల విజయకేతనం :  చైర్మన్  బి.రమణారావు
పాత
సోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
పాత
తమ్ముడి పెళ్లి... అన్న చావుకొచ్చింది
పాత
తెలంగాణ

తమ్ముడి పెళ్లి... అన్న చావుకొచ్చింది

అమరావతి: ఇంట్లో తమ్ముడి పెళ్లి రోజే అన్న విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మిర్తివలసకు చెందని సతీష్ (32) అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సతీష్ కూడా గత సంవత్సరం పెళ్లి జరిగింది. తన సొంత తమ్ముడు వివాహం ఉండడంతో హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చాడు. మేడపై దుస్తులు ఆరేస్తుండగా పెళ్లి డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగలడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పెళ్లి బజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తమ్ముడి పెళ్లి కోసం వస్తే అన్న చావే శరణ్యమైందని స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరణ
పాత
దేశం, రాష్ట్ర, మానవ ప్రగతికి కార్మికులు ఎంతో ముఖ్యం: పువ్వాడ
పాత
తెలంగాణ

దేశం, రాష్ట్ర, మానవ ప్రగతికి కార్మికులు ఎంతో ముఖ్యం: పువ్వాడ

హైదరాబాద్: అనేక రంగాల్లో కార్మికులు తన చమటను చిందించి పని చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కార్మికులు పనిచేయటం ఆపేస్తే ప్రపంచమే స్తంభిస్తుందని అన్నారు. ఖమ్మం పట్టణంలో పువ్వాడ అజయ్ మే డే వేడుకల్లో పాల్గొన్నారు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం, రాష్ట్ర, మానవ ప్రగతికి కార్మికులు ఎంతో ముఖ్యమని, బిఆర్ఎస్ హయాంలో కార్మికుల కోసం అనేక పథకాలు అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు ఎల్లప్పుడూ బిఆర్ఎస్ అండగా ఉంటుందని పువ్వాడ అజయ్ భరోసా ఇచ్చారు.

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన తల్లి, కుమారుడు
పాత
తెలంగాణ

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన తల్లి, కుమారుడు

అమరావతి: తల్లి, కుమారుడు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పాలకొల్లులో బండారు లక్ష్మీలహరి అనే మహిళ ఆరో తరగతిలోనే చదువు ఆపేసింది. ఆమె కుమారుడు విజయ్ పదో తరగతి చదువతుండడంతో తాను పదో తరగతి పరీక్షలు రాస్తానని కుటుంబ సభ్యులకు తెలిపింది. చదువుపై మమకారంతో ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాయడానికి సిద్ధపడింది. కుమారుడు విజయ్‌ తో కలిసి పదో తరగతి పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది. పదో తరగతి పరీక్షలకు కుమారుడితో కలిసి తల్లి హాజరైంది. పదో తరగతి ఫలితాలలో కుమారుడు 562/600, తల్లి 360/500 మార్కులు రావడంతో వాళ్ల ఆనంద భాష్పలకు అవధులు లేకుండా పోయాయి. రిజల్ట్స్ చూసుకొని తల్లీకొడుకులు మురిసిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత పుస్తకం పట్టి విజయం సాధించిన తల్లిని పలువురు అభినందిస్తున్నారు.

కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుంది: చంద్రబాబు
పాత
తెలంగాణ

కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుంది: చంద్రబాబు

అమరావతి: శ్రామికుల హక్కులను గుర్తించే చరిత్రాత్మక దినోత్సవం మే డే అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి శ్రామికుడికి గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం అని అన్నారు. మే డే సందర్భంగా చంద్రబాబు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుందని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తుందని అన్నారు. కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

పెళ్లి మండపం నుంచి పరుగులు తీసి... ప్రియుడి మెడలో దండ వేసిన వధువు.... షాకైన బంధువులు
పాత
తెలంగాణ

పెళ్లి మండపం నుంచి పరుగులు తీసి... ప్రియుడి మెడలో దండ వేసిన వధువు.... షాకైన బంధువులు

భోపాల్: పెళ్లి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగతున్నాయి. వరుడికి దండ వేసే సమయానికి ప్రియుడు పెళ్లి మండపానికి రావడంతో లవర్ మెడలో వధువు దండ వేసి కౌగలించుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛింద్వాడా మండలంలో జరిగింది. దీనిక ిసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ యువతి, యువకుడికి పెళ్లి ఘనంగా జరిగింది. వధువరులు దండాలు మార్చుకుంటుండగా వధువు స్టేజీ పైనుంచి పరుగులు తీసి ప్రియుడి మెడలో దండ వేసింది. ప్రియుడిని కౌగలించుకొని ముద్దుల వర్షం కురుపించింది. వెంటనే బంధువులు అప్రమత్తమై వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రియుడిని, పెళ్లి కూతురును చితకబాదారు. వెంటనే వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హుస్నాబాద్  ఇక విద్యా హబ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
పాత
మరణంలోనూ కొడుకు చేయి వదలని తల్లి.. జబల్పూర్ పడవ ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..
పాత
హైదరాబాద్ లో అగ్నిప్రమాదం... పెట్రోల్ బంకులో రెండు ఆటోలు దగ్ధం...
పాత
మే నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు..
పాత
వరంగల్ జిల్లాలో మక్క రైతుల ఆందోళన
పాత
ఇంధన సరఫరా 15 శాతం పెంచండి : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
పాత
రియల్ ఇన్సిడెంట్స్తో.. డాక్టర్ కీర్తి : ఎంబీబీఎస్ ఎంఎస్
పాత
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA